KTR: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల సమ్మె తీరు నచ్చింది: కేటీఆర్‌

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగానూ విద్యార్థులతో నేరుగా మాట్లాడడానికి ఇవాళ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. పూర్తిస్థాయి వీసీ, బోధకులను నియమించాలని, ఇతర  డిమాండ్లను పరిష్కరించాలంటూ జూన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. జూన్‌ 20న మంత్రి సబితా హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.

Published : 26 Sep 2022 18:39 IST

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగానూ విద్యార్థులతో నేరుగా మాట్లాడడానికి ఇవాళ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. పూర్తిస్థాయి వీసీ, బోధకులను నియమించాలని, ఇతర  డిమాండ్లను పరిష్కరించాలంటూ జూన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. జూన్‌ 20న మంత్రి సబితా హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.

Tags :

మరిన్ని