Lok Sabha Polls: లోక్సభ తొలి విడత ఎన్నికల బరిలో.. కుబేరులు వీరే!
లోక్సభ ఎన్నికల తొలి విడతలో పోలింగ్ జరగనున్న 102 నియోజకవర్గాల్లో 1,625 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు ఛింద్వాడా కాంగ్రెస్ ఎంపీ నకుల్నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. తనకు రూ.717 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నకుల్నాథ్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రూ.96 కోట్ల రూపాయల ఆస్తులతో టాప్ -10లో నిలిచారు.
Published : 10 Apr 2024 17:35 IST
Tags :