Telangana news: తెరాస సర్పంచ్‌పై కక్ష.. కారు, ట్రాక్టర్‌ దహనం

మిర్‌దొడ్డి : సర్పంచ్‌పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమె ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు, ట్రాక్టర్‌కు నిప్పంటించారు. సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం అక్బర్‌పేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై అధికార తెరాసకు చెందిన సర్పంచ్‌ స్వరూప మాట్లాడుతూ తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ విషయంపై భూంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. దుండగులను గుర్తించి చట్టపరంగా వారిని శిక్షించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.

Published : 26 Sep 2022 11:06 IST

Telangana news: తెరాస సర్పంచ్‌పై కక్ష.. కారు, ట్రాక్టర్‌ దహనం

మిర్‌దొడ్డి : సర్పంచ్‌పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమె ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు, ట్రాక్టర్‌కు నిప్పంటించారు. సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం అక్బర్‌పేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై అధికార తెరాసకు చెందిన సర్పంచ్‌ స్వరూప మాట్లాడుతూ తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ విషయంపై భూంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. దుండగులను గుర్తించి చట్టపరంగా వారిని శిక్షించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.

Tags :

మరిన్ని