Telangana news: తెరాస సర్పంచ్పై కక్ష.. కారు, ట్రాక్టర్ దహనం
మిర్దొడ్డి : సర్పంచ్పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమె ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు, ట్రాక్టర్కు నిప్పంటించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అక్బర్పేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై అధికార తెరాసకు చెందిన సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ విషయంపై భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. దుండగులను గుర్తించి చట్టపరంగా వారిని శిక్షించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.
Published : 26 Sep 2022 11:06 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?