Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్‍ దృశ్యాల కలకలం.. వాస్తవాలు తేల్చుతామన్న తి.తి.దే

నో ఫ్లై జోన్ అయిన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని డ్రోన్‍ కెమెరాతో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలు.. ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, ఆలయ భద్రతను ప్రశ్నించేలా ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తి.తి.దే. భద్రతా సిబ్బంది వైఫల్యం అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డ్రోన్‌ దృశ్యాలు నిజమైనవో.. కాదో.. నిగ్గు తేల్చుతామని తి.తి.దే. స్పష్టం చేసింది. 

Updated : 21 Jan 2023 20:09 IST

నో ఫ్లై జోన్ అయిన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని డ్రోన్‍ కెమెరాతో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలు.. ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, ఆలయ భద్రతను ప్రశ్నించేలా ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తి.తి.దే. భద్రతా సిబ్బంది వైఫల్యం అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డ్రోన్‌ దృశ్యాలు నిజమైనవో.. కాదో.. నిగ్గు తేల్చుతామని తి.తి.దే. స్పష్టం చేసింది. 

Tags :

మరిన్ని