బ్రేకింగ్

breaking
16 Apr 2023 | 20:52 IST

వైఎస్‌ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో జరిపే విచారణకు అవినాష్‌ హాజరుకానున్నారు. ఈ కేసులో భాగంగా ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరిన్ని

తాజా వార్తలు