వైకాపా ప్రలోభాల పర్వం.. కుప్పం, పిఠాపురంలలో ఓటుకు రూ.3-5 వేలు..
ఓటర్లను ఆకట్టుకునేందుకు వైకాపా నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికే అనుకూల పవనాలు వీస్తున్నాయి.
‘తూర్పు’లో ఓటర్లకు చీరలు, నగదు పంపిణీ
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, చిత్తూరు-న్యూస్టుడే, కుప్పం: ఓటర్లను ఆకట్టుకునేందుకు వైకాపా నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికే అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు ఓటర్లను నగదు, చీరలు, బహుమతులతో ప్రలోభ పెడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నాయకులు, ఐప్యాక్ సభ్యులు, రాజీనామా చేసిన వాలంటీర్ల పర్యవేక్షణలో ఓటుకు రూ.2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఎన్నికల షెడ్యూల్ రాక ముందే సిటింగ్ ఎంపీ, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి భరత్రామ్ చీరలు పంపిణీ చేశారు. కొత్తపేటలో చీరలు, తాజాగా పోస్టల్ బ్యాలట్ ఓటర్లకు వెండి నాణేలు అందజేశారు. రాజమహేంద్రవరంలో రూ.2,500, కొవ్వూరు, అనపర్తి, నిడదవోలుల్లో రూ.2,000 చొప్పున, రాజానగరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో రూ.1,500 చొప్పున పంపకాలు చేస్తున్నారు. కాకినాడ, పెద్దాపురంలలో రూ.2,000, తుని, ముమ్మిడివరం, రామచంద్రపురంలలో రూ.1,500, జగ్గంపేటలో రూ.1000 చొప్పున అందజేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు వైకాపా నాయకులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇక్కడి కొత్తపల్లి మండలంలో ఓటర్లకు రూ.3 వేలు చొప్పున పంచుతున్నారు. గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది.
చంద్రబాబు మెజార్టీని తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు
కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబును ఓడించడం అసాధ్యమని గ్రహించిన చిత్తూరు జిల్లాకు చెందిన ‘పెద్ద’మంత్రి, వైకాపా నాయకులు ఆయన మెజార్టీ తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుప్పం పురపాలిక పరిధిలో ఓటుకు రూ.4 వేలు, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం, కుప్పం మండలాల్లో రూ.3 వేలు చొప్పున ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ‘పెద్ద’మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి తన మనుషులను కుప్పానికి పంపారు. ఒక్కో మండలంలో 30-50 మందితో పంపకాలు చేయిస్తున్నారు. ఈ విషయంలో స్థానిక నాయకుల చేతికి డబ్బులు ఇవ్వకుండా, ‘పెద్ద’మంత్రి మనుషులను ఓటర్ల వద్దకు తీసుకెళ్లేంత వరకే వారి పాత్రను పరిమితం చేయడం గమనార్హం. ‘మీకు ఎంత అవసరమో చెప్పండి.. అంతేకానీ ఓటర్లకు డబ్బుల పంపిణీలో జోక్యం చేసుకోవద్దు’ అని కుప్పం నియోజకవర్గ వైకాపా నాయకులకు ‘పెద్ద’మంత్రి చెప్పినట్లు తెలిసింది.
ఓటర్లకు వైకాపా కూపన్ల పంపిణీ
దాచేపల్లి, న్యూస్టుడే: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓటర్లకు తాయిలాలు అందించేందుకు వైకాపా నాయకులు కూపన్లు పంపిణీ చేస్తున్నారు. గురజాల నియోజకవర్గం వైకాపా అభ్యర్థి కాసు మహేష్రెడ్డి తరఫున స్థానిక వైకాపా నాయకులు కూపన్లు, సీఎం జగన్ చిత్రాలతో ఉన్న క్యాలెండర్లు, స్టార్ క్యాంపెయినర్ అంటూ ఓ పుస్తకం, వాటి కిందనే ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రం పేరు ముద్రించి మాజీ వాలంటీర్లతో పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల అధికారులకు విషయం తెలిసినా.. పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైకాపా నాయకుడి ఇంట్లో రూ.కోటి స్వాధీనం!
విశాఖలో రెండు రోజుల కిందట ఐటీ తనిఖీలు
పెందుర్తి, న్యూస్టుడే: విశాఖలో ఓ వైకాపా నాయకుడి ఇంట్లో రూ.కోటి నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నగర పాలక సంస్థ 97వ వార్డు సుజాతనగర్లోని వైకాపా నాయకుడి ఇంట్లో రెండు రోజుల కిందట ఆదాయపు పన్ను విభాగం(ఐటీ) తనిఖీలు నిర్వహించింది. ఇందులో సుమారు రూ.కోటి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీలు జరిగిన విషయాన్ని పెందుర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి.శేష శైలజ, సీఐ రామకృష్ణ ధ్రువీకరించారు. అయితే దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పెందుర్తి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ తరఫున ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ఈ మొత్తాన్ని నిల్వ చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాల సానుభూతిపరులు, నాయకుల ఇళ్లలో పెద్దమొత్తంలో డబ్బు ఉండవచ్చనే అంచనాల నేపథ్యంలో ఐటీ విభాగం దీనిపై దృష్టి సారించినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం