బ్రేకింగ్

breaking
06 May 2024 | 21:25 IST

చివర్లో మెరుపులు.. ముంబయి టార్గెట్‌ 174

ముంబయి: ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయితే, దూకుడు కాస్త కొరవడింది. ఓపెనర్‌ హెడ్‌ (48) టాప్‌ స్కోరర్‌. అభిషేక్‌ (11), నితీశ్‌రెడ్డి (20), జాన్‌సేన్‌ (17), షాబాజ్‌ (10) పెద్దగా రాణించలేదు. మయాంక్‌ (5), క్లాసెన్‌ (2), విఫలమయ్యారు. చివర్లో కమిన్స్‌ (35; 17 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్‌ మంచి స్కోరే చేసింది. బౌలర్లలో పీయూష్‌ చావ్లా, హార్దిక్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. కంబోజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు