బ్రేకింగ్

breaking
09 May 2024 | 12:52 IST

శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

అమరావతి: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్‌ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో విభజన, జాత్యాహంకార వ్యాఖ్యలకు తావులేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత స్ఫూర్తిని అంతా నిలబెట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘దక్షిణ భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి ఉన్నాయి. ఆఫ్రికన్లకు సొంత గుర్తింపు ఉంది. వ్యక్తుల గుర్తింపును శాంపిట్రోడా తగ్గించడం సిగ్గుచేటు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా అందరం భారతీయులమే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు