బ్రేకింగ్
09 May 2024 | 12:52 IST
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
అమరావతి: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో విభజన, జాత్యాహంకార వ్యాఖ్యలకు తావులేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత స్ఫూర్తిని అంతా నిలబెట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘‘దక్షిణ భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి ఉన్నాయి. ఆఫ్రికన్లకు సొంత గుర్తింపు ఉంది. వ్యక్తుల గుర్తింపును శాంపిట్రోడా తగ్గించడం సిగ్గుచేటు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా అందరం భారతీయులమే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
- దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
- రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
- రోదసిలోకి తెలుగుతేజం
- దంచికొట్టి..దర్జాగా