News in Pics: చిత్రం చెప్పే సంగతులు -2(19-03-2023)
Updated : 19 Mar 2023 22:14 IST
1/23
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారికి గరుడోత్సవం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
2/23
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆదివారం నల్లచెరువు మండలం చిన్నయల్లంపల్లి వద్ద పాదయాత్ర 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
3/23
అల్లరి నరేష్(Naresh) హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). మిర్నా మేనన్ కథానాయిక. ఆదివారం సినిమాలోని ‘దేవేరి’ పాటను విడుదల చేశారు. కార్యక్రమంలో మిర్నా మేనన్ ఇలా మెరిశారు.
4/23
ప్రముఖ దర్శకుడు శంకర్ తాను గుర్రం సవారీ చేస్తున్న ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆర్సీ 15’(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్లో భాగంగా ఇలా సవారీ చేసినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు.
5/23
హైదరాబాద్ బంజారాహిల్స్లో ‘హెల్తీ బేబీ షో -2023’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని చిన్నారులకు కిట్లు పంపిణీ చేశారు.
6/23
ప్రముఖ సినీనటుడు రామ్చరణ్ ఈ నెల 27న జన్మదిన వేడుకలు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన కామన్ డీపీని ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ ఫొటోను చూసి చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
7/23
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మధుబాల.. ‘మేనక’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది.
8/23
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని సోమనాథ మహాదేవ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
9/23
రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతార’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాను త్వరలో ఇటాలియన్, స్పానిష్ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
10/23
ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
11/23
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని స్టిల్స్ను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. ఇవి ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
12/23
‘శాకుంతలం’లో సమంత, దేవ్ మోహన్ల స్టిల్
13/23
హైదరాబాద్లోని చందానగర్కు చెందిన చలువాది మల్లి విష్ణువందన ఈ నెల 30న భద్రాద్రి ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం కోసం 1,01,116 బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖించారు. వాటిని నేడు ఆమె ఆలయ అధికారులకు అందజేశారు.
14/23
భద్రాద్రి సీతారాముల ఆలయంలో వైభవంగా పుష్కర తీర్థజలాల శోభాయాత్ర నిర్వహించారు. ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం వివిధ రాష్ట్రాల్లోని పుణ్యజలాలను అర్చక వైదిక కమిటీ సేకరించింది. వీటికి ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శోభాయాత్ర ఏర్పాటు చేశారు.
15/23
మంచు మనోజ్ తన తండ్రి మోహన్బాబుకు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నడక నుంచి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
16/23
విశాఖలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులతో గ్రౌండ్ పరిసరాలు సందడిగా మారాయి.
17/23
సినీ నటుడు నాని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్కు హాజరై సందడి చేశారు. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.
18/23
19/23
విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి జంటగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘వీఎస్ 10’(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా చిత్రీకరణను ఆదివారం ముహూర్తపు షాట్తో ప్రారంభించారు.
20/23
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
21/23
హైదరాబాద్ కొండాపూర్లోని ఎనిమిదో బెటాలియన్లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
22/23
నాని (Nani) హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కీర్తి సురేశ్ ఇలా మెరిశారు.
23/23
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!