News in Pics: చిత్రం చెప్పే సంగతులు -2(19-03-2023)

Updated : 19 Mar 2023 22:14 IST
1/23
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారికి గరుడోత్సవం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారికి గరుడోత్సవం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
2/23
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో కొనసాగుతోంది. ఆదివారం నల్లచెరువు మండలం చిన్నయల్లంపల్లి వద్ద పాదయాత్ర 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో కొనసాగుతోంది. ఆదివారం నల్లచెరువు మండలం చిన్నయల్లంపల్లి వద్ద పాదయాత్ర 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
3/23
అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). మిర్నా మేనన్‌ కథానాయిక. ఆదివారం సినిమాలోని ‘దేవేరి’ పాటను విడుదల చేశారు. కార్యక్రమంలో మిర్నా మేనన్‌ ఇలా మెరిశారు. అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). మిర్నా మేనన్‌ కథానాయిక. ఆదివారం సినిమాలోని ‘దేవేరి’ పాటను విడుదల చేశారు. కార్యక్రమంలో మిర్నా మేనన్‌ ఇలా మెరిశారు.
4/23
ప్రముఖ దర్శకుడు శంకర్‌ తాను గుర్రం సవారీ చేస్తున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 15’(వర్కింగ్ టైటిల్‌) సినిమా షూటింగ్‌లో భాగంగా ఇలా సవారీ చేసినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తాను గుర్రం సవారీ చేస్తున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 15’(వర్కింగ్ టైటిల్‌) సినిమా షూటింగ్‌లో భాగంగా ఇలా సవారీ చేసినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు.
5/23
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ‘హెల్తీ బేబీ షో -2023’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని చిన్నారులకు కిట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ‘హెల్తీ బేబీ షో -2023’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని చిన్నారులకు కిట్లు పంపిణీ చేశారు.
6/23
ప్రముఖ సినీనటుడు రామ్‌చరణ్ ఈ నెల 27న జన్మదిన వేడుకలు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన కామన్‌ డీపీని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ ఫొటోను చూసి చెర్రీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రముఖ సినీనటుడు రామ్‌చరణ్ ఈ నెల 27న జన్మదిన వేడుకలు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన కామన్‌ డీపీని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ ఫొటోను చూసి చెర్రీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.
7/23
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మధుబాల.. ‘మేనక’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మధుబాల.. ‘మేనక’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
8/23
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గుజరాత్‌లోని సోమనాథ మహాదేవ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గుజరాత్‌లోని సోమనాథ మహాదేవ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
9/23
రిషబ్‌ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతార’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాను త్వరలో ఇటాలియన్‌, స్పానిష్‌ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. రిషబ్‌ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతార’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాను త్వరలో ఇటాలియన్‌, స్పానిష్‌ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
10/23
ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
11/23
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని స్టిల్స్‌ను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. ఇవి ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని స్టిల్స్‌ను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. ఇవి ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
12/23
‘శాకుంతలం’లో సమంత, దేవ్‌ మోహన్‌ల స్టిల్‌ ‘శాకుంతలం’లో సమంత, దేవ్‌ మోహన్‌ల స్టిల్‌
13/23
హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన చలువాది మల్లి విష్ణువందన ఈ నెల 30న భద్రాద్రి ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం కోసం 1,01,116 బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖించారు. వాటిని నేడు ఆమె ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన చలువాది మల్లి విష్ణువందన ఈ నెల 30న భద్రాద్రి ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం కోసం 1,01,116 బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖించారు. వాటిని నేడు ఆమె ఆలయ అధికారులకు అందజేశారు.
14/23
భద్రాద్రి సీతారాముల ఆలయంలో వైభవంగా పుష్కర తీర్థజలాల శోభాయాత్ర నిర్వహించారు.  ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం వివిధ రాష్ట్రాల్లోని పుణ్యజలాలను అర్చక వైదిక కమిటీ సేకరించింది. వీటికి ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శోభాయాత్ర ఏర్పాటు చేశారు. భద్రాద్రి సీతారాముల ఆలయంలో వైభవంగా పుష్కర తీర్థజలాల శోభాయాత్ర నిర్వహించారు. ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం వివిధ రాష్ట్రాల్లోని పుణ్యజలాలను అర్చక వైదిక కమిటీ సేకరించింది. వీటికి ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శోభాయాత్ర ఏర్పాటు చేశారు.
15/23
మంచు మనోజ్‌ తన తండ్రి మోహన్‌బాబుకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నడక నుంచి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. మంచు మనోజ్‌ తన తండ్రి మోహన్‌బాబుకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నడక నుంచి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
16/23
విశాఖలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులతో గ్రౌండ్‌ పరిసరాలు సందడిగా మారాయి. విశాఖలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులతో గ్రౌండ్‌ పరిసరాలు సందడిగా మారాయి.
17/23
సినీ నటుడు నాని విశాఖలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. సినీ నటుడు నాని విశాఖలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.
18/23
19/23
విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి జంటగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘వీఎస్‌ 10’(వర్కింగ్‌ టైటిల్). ఈ సినిమా చిత్రీకరణను ఆదివారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి జంటగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘వీఎస్‌ 10’(వర్కింగ్‌ టైటిల్). ఈ సినిమా చిత్రీకరణను ఆదివారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు.
20/23
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
21/23
హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఎనిమిదో బెటాలియన్‌లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్‌ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఎనిమిదో బెటాలియన్‌లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్‌ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
22/23
నాని (Nani) హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కీర్తి సురేశ్‌ ఇలా మెరిశారు. నాని (Nani) హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కీర్తి సురేశ్‌ ఇలా మెరిశారు.
23/23

మరిన్ని