తల్లిని కడసారి చూసేందుకు.. ఓ యువకుడి సాహసం
కరోనా రక్కసి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలను బలితీసుకుంటోంది. కరోనాతో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఉద్వేగానికి గురిచేస్తోంది....
కలబురిగి: కరోనా రక్కసి కుటుంబాలకు కుటుంబాలను బలితీసుకుంటోంది. ఎందరికో శోకం మిగులుస్తోంది. కరోనాతో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఉద్వేగానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు చెందిన యువకుడు కొవిడ్ బారిన పడిన తన తల్లిని కరోనా ఆసుపత్రిలో చేర్చించాడు. వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ తల్లి ఆదివారం మృతి చెందింది. మృతురాలిని చివరి సారిగా చూసేందుకు వచ్చిన కొడుకును ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. తన తల్లిని ఎలాగైనా చూడాలని సంకల్పించిన ఆ యువకుడు ఏకంగా ఆసుపత్రి భవనం ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్