Viral Video: ప్రాణం మీదికి వచ్చిన ‘ఫైర్ హెయిర్కట్’..!
ట్రెండింగ్ హెయిర్ స్టైల్ ప్రయత్నం ఒకటి.. ఓ యువకుడి ప్రాణాల మీదికి వచ్చింది. జుత్తుకు మంట అంటించి చేసే ‘ఫైర్ హెయిర్కట్’ కాస్త వికటించడంతో.. అతనికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. గుజరాత్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గాంధీనగర్: ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్ స్టైల్ను అనుకరించడం కొంతమందికి అలవాటు! ట్రెండింగ్లో ఉన్నవాటి కోసం ఆరాటపడుతుంటారు. తాజాగా ఇటువంటి ప్రయత్నమే ఓ యువకుడి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. జుత్తుకు మంట అంటించి చేసే ‘ఫైర్ హెయిర్కట్(Fire Haircut)’ కాస్త వికటించడంతో.. అతనికి తీవ్రంగా గాయపడ్డాడు. గుజరాత్లోని వాపి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. వాపిలోని భడక్మోరా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(18).. ‘ఫైర్ హెయిర్కట్’ కోసం స్థానికంగా ఓ సెలూన్కు వెళ్లాడు. ఈ క్రమంలోనే హెయిర్కట్లో భాగంగా అతని జుత్తుకు మంట అంటించారు. అది కాస్త వికటించి.. ఒక్కసారిగా భగ్గుమంది. మంటలు అదుపులోకి రాకపోవడంతో అతని తల, మెడ, ఛాతీపై తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై సూరత్లోని వైద్యశాలకు తీసుకెళ్లారు.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సెలూన్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫైర్ హెయిర్కట్ కోసం జుత్తుకు పూసిన రసాయనం కారణంగా ఇలా జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని దర్యాప్తు అధికారి కరమ్సింగ్ మక్వానా తెలిపారు. ఇదిలా ఉండగా.. ఫైర్ హెయిర్కట్ అనేది ఒక రకమైన కేశాలంకరణ ప్రక్రియ. ఇందులో భాగంగా జుత్తుకు మంటలు అంటించి.. స్టైల్గా సెట్ చేస్తారు!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!