రాష్ట్ర రాజధానికి ఒక రూలు.. జిల్లా కేంద్రాలకు ఇంకొకటా!
పరిపాలన సౌలభ్యానికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లా కేంద్రాన్ని, పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు వీలైనంత దగ్గర చేయడమే దీని లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర రాజధానిని మాత్రం రాష్ట్రానికి నడిబొడ్డున
ఈనాడు, అమరావతి: పరిపాలన సౌలభ్యానికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లా కేంద్రాన్ని, పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు వీలైనంత దగ్గర చేయడమే దీని లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర రాజధానిని మాత్రం రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామంటోంది. జిల్లాలోని ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం అందుబాటు దూరంలో ఉండాలనుకున్నప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాష్ట్ర పాలనా యంత్రాంగం అందుబాటు దూరంలో ఉండాల్సిన అవసరం లేదా? దీనిపైనే గురువారం విలేకరుల సమావేశంలో ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయకుమార్ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు. జిల్లాకేంద్రం నుంచి ఎంత దూరమన్నది దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకున్నామని, అందుకే వేరే లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ చంద్రగిరిని శ్రీబాలాజీ జిల్లాలోకి.. పాణ్యంను కర్నూలు జిల్లాలోకి తెచ్చామని చెబుతున్నారు కదా? జిల్లాకేంద్రమే అంత దగ్గరగా ఉండాలని ప్రభుత్వం అనుకున్నప్పుడు.. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిని కాదని, విశాఖను పాలనా రాజధానిగా చేయడం వల్ల అనంతపురం జిల్లాకు చెందినవారు అక్కడికి వెళ్లాలంటే వెయ్యి కి.మీ.లకుపైగా ప్రయాణించాలి కదా? దానిలో హేతుబద్ధతేంటి? అని విలేకరులు ప్రశ్నించారు. ‘ఇది జిల్లాలకు సంబంధించి కదా!’ అని అధికారి నవ్వుతూ సమాధానం దాటవేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చాక ప్రజల అవసరాలు 95-98 శాతం అక్కడే తీరిపోతున్నాయని, ఉద్యోగులపై ఫిర్యాదులవంటి వాటికే జిల్లాకేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ వాదనలని పరిగణనలోకి తీసుకున్నా మరి ప్రజల అవసరాలన్నీ స్థానికంగానే తీరిపోతున్నప్పుడు రాజధానిని అమరావతిలోనే ఉంచొచ్చు కదా? రాష్ట్ర పాలనా యంత్రాంగమంతా నగరానికి నడిబొడ్డున ఉన్న అమరావతిలో ఉండటం మంచిదా? రాష్ట్రానికి దాదాపు ఒక పక్కన ఉన్న విశాఖలో ఉంటే ఉపయోగమా? అప్పట్లో 3రాజధానులపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికలోని అంశాలనూ ఇదే విజయకుమార్ విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రణాళికాశాఖ కార్యదర్శిగా 3రాజధానుల వ్యవహారంలోను, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలోనూ ఆయనే క్రియాశీలంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనే జిల్లాకేంద్రం అందుబాటులో ఉండేలా జిల్లాల్ని పునర్ వ్యవస్థీకరించామని చెబుతూ.. విశాఖలో రాజధానిని ఏర్పాటుచేస్తే రాయలసీమకు దూరం కదా? అన్న ప్రశ్నకు సూటిగా జవాబివ్వలేదు.
పరిపాలన వికేంద్రీకరణకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, అందుకే 3రాజధానులు ఏర్పాటుచేస్తున్నామని చెబుతున్నారు కదా.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో కూడా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టువంటి వాటిని కూడా వేర్వేరు డివిజన్ కేంద్రాల్లోనో, నియోజకవర్గ కేంద్రాల్లోనో ఏర్పాటుచేస్తారా? అన్న ప్రశ్నకూ ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కమిటీ భావిస్తోందని బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!