Andhra News: పేదోడికి అందుబాటులో వినోదమంటే ఇదేనా?
పేదోడికి వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే సినిమా టికెట్ ధరల్ని తగ్గించామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు అదే పేదోడిపైనే అత్యధికంగా భారం మోపింది. రాష్ట్రంలోని థియేటర్లలో ప్రస్తుతం రూ.20గా ఉన్న
ఆర్ఆర్ఆర్కు కనీస టికెట్ ధర 4.75 రెట్లు పెంచుకునేందుకు అనుమతి
నాన్ ప్రీమియంపైనే అధిక బాదుడు
ఈనాడు, అమరావతి: పేదోడికి వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే సినిమా టికెట్ ధరల్ని తగ్గించామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు అదే పేదోడిపైనే అత్యధికంగా భారం మోపింది. రాష్ట్రంలోని థియేటర్లలో ప్రస్తుతం రూ.20గా ఉన్న కనీస టికెట్ ధరను.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రూ.95కు పెంచింది. ప్రస్తుత ధర కన్నా ఇది 4.75 రెట్లు ఎక్కువ. ఈ నెల 7వ తేదీ కంటే ముందు అమల్లో ఉన్న ధరల ప్రకారం రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్ కనీస ధర రూ.5. దాంతో పోలిస్తే ఏకంగా 19 రెట్లు పెంచినట్లయ్యింది. ఈ నెల 25న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ను సూపర్ హై బడ్జెట్ సినిమాగా పరిగణిస్తూ పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల్లో ఏసీ, నాన్ ఏసీ, ప్రత్యేక థియేటర్లు, మల్టీప్లెక్స్లు, ప్రీమియం, నాన్ ప్రీమియం, రెగ్యులర్, రిక్లెయినర్లు అని తేడా లేకుండా అన్ని తరగతులు, అన్ని విభాగాల్లో గంపగుత్తగా ప్రస్తుతమున్న ఒక్కో టికెట్ ధరపై అదనంగా రూ.75 చొప్పున పెంచుకునేందుకు అనుమతిచ్చింది. విడుదలైన పది రోజులపాటు ఈ అదనపు ధరలు వసూలు చేసుకోవచ్చంటూ ఈ నెల 17న హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. దాని ప్రకారం చూస్తే పేదలకు అందుబాటులో ఉండే నాన్ ప్రీమియం విభాగంపైనే అత్యధిక భారం పడింది. పేదోడికి అందుబాటులో వినోదం ఉంచటమంటే ఇదేనా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
వారం క్రితమే జీవో
ఎక్కువ ధరకు టికెట్ కొనుక్కుని సినిమా చూడలేని వారికోసం ప్రతి థియేటర్లోనూ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఈనెల 7న జారీ చేసిన జీవో 13లో ప్రభుత్వం పేర్కొంది. దానిప్రకారం నాన్ ప్రీమియం కేటగిరీ అంటేనే పేదలని చెబుతోంది. మరి ప్రీమియం విభాగాలతో సమానంగా వారిపైన కూడా అదనపు టికెట్ భారం మోపడమేమిటి? అది కూడా విడుదల తేదీ నుంచి పది రోజులపాటు అదనపు ధరలు వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించటమేంటి? అంటే ఆ వ్యవధిలో పేదోడికి సినిమా చూసే అవకాశం ఉండొద్దా? పేదవాడికి అందుబాటులో వినోదం అనేదే.. ప్రభుత్వ లక్ష్యమైతే వారు ఎక్కువగా వెళ్లే నాన్ ఏసీ, నాన్ ప్రీమియం కేటగిరీల్లో టికెట్ ధరలు అదనంగా పెంచేందుకు అనుమతే ఇవ్వకూడదు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది.
తెలంగాణలో నాన్ఏసీ థియేటర్లలో పెంపులేదే
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. అయితే అక్కడ అన్ని కేటగిరీల్లోనూ గంపగుత్తగా పెంచుకోవడానికి అవకాశమివ్వలేదు. ఏసీ థియేటర్లలో సినిమా విడుదలైన తొలి మూడు రోజులపాటు రూ.50 చొప్పున, ఆ తర్వాత వారం రోజులు రూ.30 చొప్పున పెంచుకునేందుకే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్లు, అతి పెద్ద స్క్రీన్లున్న థియేటర్లలో తొలి మూడు రోజులపాటు రూ.100 చొప్పున, తర్వాత వారం రోజులు రూ.50 చొప్పున అదనంగా పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పేదలు ఎక్కువగా వెళ్లే నాన్ ఏసీ థియేటర్లలో ప్రస్తుతమున్న రేట్లే కొనసాగించాలని పేర్కొంది.
ఏపీలో పేదలపై టికెట్ భారం ఇలా..
* ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ కనీస ధర రూ.20 (గ్రామ, నగర పంచాయతీల్లో నాన్ ఏసీ, నాన్ ప్రీమియం కేటగిరిలో). దానిపై అదనంగా రూ.75 వసూలు చేసుకుంటే రూ.95 అవుతుంది. అంటే ప్రస్తుత ధరపై 4.75 రెట్లు అదనంగా భారం పడింది.
* రాష్ట్రంలో సినిమా టికెట్ గరిష్ఠ ధర రూ.250 (మల్టీఫ్లెక్స్ల్లో రిక్లెయినర్ సీట్లకు). దానిపై అదనంగా రూ.75 వసూలు చేసుకుంటే రూ.325 అవుతుంది. ప్రస్తుత ధరపై 1.3 రెట్లు అదనం.
* దీన్ని బట్టి చూస్తే టికెట్ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించగలిగేవారిపై తక్కువ భారం.. అంత స్థోమత లేని వారిపై ఎక్కువ భారం ప్రభుత్వం వేసింది.
* ఆర్ఆర్ఆర్ కోసం నిర్దేశించిన అదనపు ధరల్ని కలిపితే నాన్ ఏసీ, నాన్ ప్రీమియం విభాగాల్లో టికెట్ ధరలు అధికంగా పెరగ్గా.. ఏసీ, ప్రీమియం విభాగాల్లో టికెట్ ధరలు తక్కువగా పెరిగాయి.
* సీఎం జగన్మోహన్రెడ్డి, పలువురు మంత్రులు, నాయకులు చెప్పినట్లు పేదలకు అందుబాటులో వినోదం అందించేందుకే టికెట్ ధర తగ్గించి ఉంటే.. ఇప్పుడు వారిపై అదనపు భారం లేకుండా చూడాలి. కానీ వారిపైనే ఎక్కువ భారం మోపడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?