Andhra News: ఇప్పుడంత ఈజీగా లేదా..?
ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్లో తొలి మంత్రివర్గ కూర్పును సునాయాసంగా చేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంత ఈజీగా లేదంటున్నాయి వైకాపా వర్గాలు. సామాజిక సమీకరణాల దృష్ట్యా పాత
సునాయాసంగానే తొలి కేబినెట్ కూర్పు
తాజా జట్టు ఎంపికలో మాత్రం సుదీర్ఘంగా కసరత్తు
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్లో తొలి మంత్రివర్గ కూర్పును సునాయాసంగా చేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంత ఈజీగా లేదంటున్నాయి వైకాపా వర్గాలు. సామాజిక సమీకరణాల దృష్ట్యా పాత మంత్రుల్లో ఒకరిద్దరిని కొనసాగించాలని ముఖ్యమంత్రి తొలుత నిర్ణయించారు. ఆ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సూత్రప్రాయంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ‘మంత్రులంతా రాజీనామా చేయాలి. వారిలో కొనసాగించేవారితోపాటు, కొత్తవారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తా’మని కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ ప్రకారమే అంతా జరిగిపోతుందని అంచనా వేశారు. కానీ, అంత సాఫీగా జరగట్లేదని దాని ప్రభావమే పాత మంత్రుల్లో ఒకరో ఇద్దరో కొనసాగుతారన్న ముఖ్యమంత్రి ప్రకటనలో మార్పు చేయాల్సిన పరిస్థితికి దారి తీసిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తొలుత ఒకరిద్దరని.. తర్వాత నలుగురైదుగురని.. ఇంకోసారి అయిదారుగురని.. మళ్లీ 10 మంది వరకు పాత వాళ్లకు అవకాశం ఉందని ఇలా పలు విధాలుగా అధికార పార్టీ నుంచి లీకులు వెలువడ్డాయి. మరోవైపు కొత్తగా చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో చేస్తున్న లాబీయింగ్ సీఎంపై ఒత్తిడి పెంచిందంటున్నారు.
అప్పుడు తితిదే.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ: తితిదే పాలకమండలి, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ఖరారు చేసేందుకు సీఎం గతేడాది విపరీతమైన కసరత్తే చేయాల్సి వచ్చింది. ‘మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితా సునాయాసంగా చేసుకోగలిగా కానీ, తితిదే విషయంలో మాత్రం అబ్బో..!’ అని అప్పట్లో మంత్రిమండలి సమావేశంలో సీఎం అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజా కూర్పు తితిదే పాలకమండలి నియామకం కంటే సంక్లిష్టంగా మారినట్లుందని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులుగా ఉన్నవారు తిరిగి అదే పదవుల్లో కొనసాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు, సిఫార్సులు, ఇతరత్రా ఒత్తిడి ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అందువల్లే మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు.
నేటి మధ్యాహ్నానికి కొలిక్కి!: సోమవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణం చేయాల్సి ఉంది. వారి జాబితా ఆదివారం మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సీఎం మార్పులు చేర్పులు చేస్తారని సీఎంవో ప్రతినిధులే చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి జాబితా ఖరారైతే అప్పుడు దాన్ని ఆమోదం కోసం గవర్నర్కు పంపనున్నారు. ఆ తర్వాతనే మంత్రులు కాబోతున్న ఎమ్మెల్యేలకు ఫోన్ ద్వారా సమాచారమిస్తారు. ఇంత ఉత్కంఠ 2019 ఎన్నికల ముందు 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికప్పుడు కానీ, ఇటీవల వందల్లో నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో కానీ కనిపించలేదని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రచారంలో ఉన్న ప్రకారం పాత మంత్రుల్లో కొనసాగే వారి పేర్లు..!: గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర నారాయణ, కొడాలి నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలలో అయిదారుగురికి లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంకో ఒకరిద్దరికీ కొత్త మంత్రివర్గంలో అవకాశంఉండొచ్చంటున్నారు.
రాజ్భవన్కు రాజీనామా పత్రాలు
రాష్ట్ర మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల రాజీనామా పత్రాలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం శనివారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజ్భవన్ చేరుకున్నాయి. మంత్రుల రాజీనామాలు ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి రాసిన లేఖను వాటికి జతచేసి పంపారు. సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఆ దస్త్రాన్ని రాజ్భవన్కు అందజేశారు. మంత్రుల రాజీనామాల్ని గవర్నర్ ఆదివారం ఉదయం ఆమోదించనున్నారు. మంత్రివర్గంలో కొలువుదీరే కొత్త మంత్రుల జాబితాను ఆదివారం మధ్యాహ్నం తర్వాత గవర్నర్కు ముఖ్యమంత్రి పంపనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ