Azadi Ka Amrit Mahotsav: యువ బాంబు పుట్టిన వేళ..!
జాతీయోద్యమంలో తిలక్ నుంచి బోస్ దాకా ఎంతో మంది విప్లవ యోధులు! వారందరిలో ప్రత్యేకమైన పేరు ఖుదీరాం బోస్.
జాతీయోద్యమంలో తిలక్ నుంచి బోస్ దాకా ఎంతో మంది విప్లవ యోధులు! వారందరిలో ప్రత్యేకమైన పేరు ఖుదీరాం బోస్.
పుట్టిందే దేశం కోసమన్నట్లుగా... మీసాలు రాని వయసులోనే బ్రిటిష్ గుండెల్లో ‘బాంబు’లు పేల్చిన ధీరుడు... చిరునవ్వుతో ఉరి కొయ్యకు వేలాడిన దేశభక్తుడు... మనం మరచిన తొలి భగత్సింహుడు - ఖుదీరాం.
బెంగాల్లోని మేదినీపుర్ ప్రాంతంలో 1889 డిసెంబరు 3న ఖుదీరాం జన్మించేనాటికి ఆయన తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో తహసీల్దార్! ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకు. అప్పటికే ఇద్దరు కుమారులు పుట్టి చనిపోయారు. ఈ పిల్లవాడిని కాపాడుకోవటం కోసం స్థానిక సంప్రదాయాల ప్రకారం మూడు దోసిళ్ల బియ్యం (దీన్ని ఖుద్ అనేవారు) తీసుకొని పెద్దకూతురుకు అమ్మారు. అలా ఆ బాలుడి పేరు ఖుదీరాంగా స్థిరపడింది. కానీ దురదృష్టవశాత్తు ఆరో ఏటనే తల్లిని, ఏడో ఏట తండ్రిని కోల్పోవటంతో అక్కయ్య దగ్గరే తను పెరగాల్సి వచ్చింది. హామిల్టన్ హైస్కూల్లో చదువు. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించటంతో ఆ ఉద్యమ ప్రభావం అందరిపైనా పడింది. అరబింద్ఘోష్, సిస్టర్ నివేదితలు తమ ప్రాంతానికి వచ్చి ఇచ్చిన ప్రసంగాలతో ఖుదీరాం ఉత్తేజితుడయ్యారు. 15వ ఏటనే... అరబిందో సారథ్యంలోని విప్లవసంస్థ అనుశీలన్ సమితిలో చేరారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచినందుకు అరెస్టు చేశారు కూడా. మీసాలు రాకుండానే చెరసాలకు వెళ్లి వచ్చిన ఖుదీరాం బాంబుల తయారీ నేర్చుకున్నారు.
ఆ సమయంలో కోల్కతాలో మేజిస్ట్రేట్గా పనిచేసిన డగ్లస్ కింగ్స్ఫోర్డ్... భారత స్వాతంత్య్ర సమరయోధుల పట్ల క్రూరంగా స్పందించేవాడు. కఠినమైన శిక్షలతో అణచివేసేవాడు. ఓసారి పోలీసుల దమనకాండను నిరసిస్తూ యువకులు కొందరు కోర్టు బయట ఆందోళన చేశారు. వారిలోని సుశీల్సేన్కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించాడు కింగ్స్ఫోర్డ్. తోలు తేలిపోయేలా సుశీల్ను కొట్టారు. ప్రతి దెబ్బకూ వందేమాతరమంటూ నినదించాడు సుశీల్. ఇదంతా చూసిన విప్లవకారులు ఎలాగైనా కింగ్స్ఫోర్డ్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. దీన్ని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ముజఫర్పుర్కు బదిలీ చేసింది. కానీ అనుశీలన్ సమితి వదల్లేదు.
ప్రఫుల్ల కుమార్ చాకి, ఖుదీరాం బోస్లు ముజఫర్పుర్ చేరుకున్నారు. అక్కడే ధర్మశాలలో ఉండి... కింగ్స్ఫోర్డ్ రాకపోకలు, ఆనుపానులపై ఆరాతీశారు. 1908 ఏప్రిల్ 29న రాత్రి 8.30కి... క్లబ్ నుంచి బయటకు రాగానే ఆయన బగ్గీపై బాంబువేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. అనుకున్నట్లే.. యూరోపియన్ క్లబ్ గేట్ దగ్గరకు బగ్గీ రాగానే... ఖుదీరాం ముందుకు దూకి బాంబు వేశాడు. భారీ విస్ఫోటనంతో బగ్గీ కాలిపోయింది. లక్ష్యం సాధించామనే సంతృప్తితో ప్రఫుల్ల, ఖుదీరాం చీకట్లో చెరోదారిన వెళ్లిపోయారు. బాంబు పేలింది... ఇద్దరు చనిపోయారు. కానీ కింగ్స్ఫోర్డ్ కాదు. క్లబ్లో బ్రిడ్జ్ ఆడటానికి వచ్చిన కింగ్స్ఫోర్డ్ కుటుంబ స్నేహితులైన ఇద్దరు మహిళలు (ఆంగ్లేయులే) ఆ బగ్గీలో ఉన్నారు. వీరివెనకాల మరో బగ్గీలో కింగ్స్ఫోర్డ్, ఆయన భార్య ఉన్నారు.
ఈ విషయం తెలియని ఖుదీరాం, ప్రఫుల్లలు రాత్రంతా ప్రయాణం చేస్తునే ఉన్నారు. రైలెక్కిన ప్రఫుల్ల బోగీలోని ఓ పోలీసుతో మాటల్లో దొరికిపోవటంతో... తన దగ్గరున్న పిస్తోల్తో పేల్చుకొని చనిపోయాడు. రాత్రంతా 25 కిలోమీటర్లు నడిచి ఉదయానికి వని అనే రైల్వే స్టేషన్ చేరుకున్న ఖుదీరాం కూడా అక్కడున్న పోలీసుల కంటపడ్డాడు. ఆయన వాలకం చూసి అనుమానం వచ్చి పట్టుకోవటంతో... జేబులోంచి రివాల్వర్ కింద పడింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు. ప్రఫుల్ల చనిపోయిన విషయం తెలియని ఖుదీరాం... ఆయన్ను బతికించాలనే తపనతో తనపైనే నేరమంతా వేసుకొన్నాడు. జిల్లా కోర్టులో విచారణ అనంతరం మరణశిక్ష విధించారు. తీర్పు విన్నాక కూడా చిరునవ్వులు చిందిస్తున్న ఖుదీరాంను చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. తర్వాత హైకోర్టులో అప్పీలు చేయగా... అక్కడా మరణశిక్షే ఖరారైంది. 1908 ఆగస్టు 11న ధోతీకట్టుకొని... చేతిలో భగవద్గీత పట్టుకొని, ముఖంపై చిరునవ్వుతో రొమ్ము విరుచుకొని ఉరికంబమెక్కిన 18 ఏళ్ల 8 నెలల 8 రోజుల ఆ యువకుడి బలిదానాన్ని చూసి యావత్ కోల్కతా కదిలిపోయింది. అంతిమయాత్రలో వేలమంది పాల్గొన్నారు.
మరణానంతరం... ఖుదీరాం బెంగాల్కు ఓ ఫ్యాషనైపోయాడు. ఆయన ధరించిన ధోతీలాంటి వాటిని నేసిన బెంగాల్ చేనేత కార్మికులు...దానిపై ఖుదీరాం అని ముద్రవేసేవారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు.. జాతీయోద్యమంలో పాల్గొనే యువకులంతా ఈ ధోతీలనే ధరించేవారు. ఇప్పుడు బెంగాల్లో కొన్ని కాలేజీలతో పాటు ఓ రైల్వేస్టేషన్కు ఖుదీరాం పేరు పెట్టారు.
‘‘తీర్పు అర్థమైందా? నీకు పడ్డ శిక్ష ఏంటో తెలిసిందా?’’ అంటూ జడ్జి అడగ్గా... ‘‘తీర్పు అర్థం కావటమే కాదు... ఓ పదినిమిషాల సమయం ఇస్తే మీకు బాంబు చేయటం ఎలాగో కూడా నేర్పించటానికి నేను సిద్ధం’’ అంటూ నవ్వుతూనే ధైర్యంగా బదులిచ్చాడు ఖుదీరాం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... తోఫాకో దోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. -
సంక్షిప్తవార్తలు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. -
ఓటు ప్రాధాన్యంపై నేడు రౌండ్టేబుల్ సమావేశం
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. -
పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి
ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
వారికి లేని బాధ మీకెందుకు?
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్