జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది.
ఏబీవీ సస్పెన్షన్ చెల్లదంటూ క్యాట్ తీర్పు
కక్ష సాధింపుతో అయిదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వని వైనం
అప్పటినుంచి ఒంటరిగానే ఏబీ వెంకటేశ్వరరావు పోరు
హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా మళ్లీ సస్పెన్షన్
పదవీవిరమణ సమయంలోనూ ప్రభుత్వ వేధింపులు
సీనియర్ ఐపీఎస్ అధికారికి ఎట్టకేలకు ఊరట
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. ఆయనపై వైకాపా ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) తీర్పు వెలువరించి... కర్రుకాల్చి వాత పెట్టింది. తనపై కక్ష సాధింపే లక్ష్యంగా ఏళ్ల తరబడి పోస్టింగ్, వేతనాలు ఇవ్వకుండా, అక్రమ కేసులు, తప్పుడు అభియోగాలు పెట్టి వేధించినా.. ఎక్కడా తగ్గకుండా ఒంటరిగానే తొలి నుంచి తుది వరకూ ధైర్యంగా పోరాడినందుకు ఆయనకు చాలా ఆలస్యంగానైనా సరే న్యాయం చేకూరింది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మొదటి నుంచి వాదన వినిపిస్తున్న ఆయన చివరికి నైతికంగా గొప్ప విజయం దక్కించుకున్నారు. దురుద్దేశపూరితంగా తనకు ఆపాదించిన అభియోగాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్లోని క్యాట్ బుధవారం తీర్పు ఇచ్చింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ గతేడాది ఏప్రిల్లో ఆయన హైదరాబాద్లోని క్యాట్ను ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. ఏబీవీ సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఒక సారి హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాక కూడా.. రెండోసారి సస్పెండ్ చేయడమంటే అది వేధించడమేనని వ్యాఖ్యానించింది. ఆయనకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జగన్ గద్దెనెక్కిన తొలి రోజు నుంచే కక్షసాధింపు, వేధింపులు
2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్మోహన్రెడ్డి... ఆ వెంటనే ఏసీబీ డైరెక్టర్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును అక్కడి నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. అది మొదలు ఎనిమిది నెలల పాటు ఆయనకు ఏ పోస్టింగూ ఇవ్వలేదు. జీతభత్యాలు చెల్లించలేదు. సుదీర్ఘకాలం పాటు వేచి చూసిన ఆయన పోస్టింగ్, జీతభత్యాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా... నిఘా, భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు మోపుతూ 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేశారు.
అసలు ఆ నిఘా పరికరాలు కొనలేదు, వాటికోసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వ ఖజానాకూ నష్టం వాటిల్లలేదు. ఈ వ్యవహారంలో ఎవరికీ అనుచిత ప్రయోజనమూ కలగలేదు. అయినా సరే... తాము ముందుగా రూపొందించుకున్న అభియోగాలతో ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారించిన హైకోర్టు.. ‘‘ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం. చట్టవిరుద్ధం. ఏకపక్షం. అది చెల్లదు’’ అని తీర్పు ఇచ్చింది. దీన్ని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సస్పెన్షన్ రద్దుచేయాలని 2022 ఏప్రిల్ 22న ఆదేశాలిచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా జగన్ ప్రభుత్వం ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన పదే పదే ఆ తీర్పు ప్రతులను, వినతిపత్రాలను సీఎస్కు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2022 జూన్ 14న ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. అత్యంత అప్రాధాన్యమైన పోస్టింగ్గా భావించే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్గా ఆయన్ను నియమించారు.
విధుల్లోకి తీసుకున్న 14 రోజులకే మళ్లీ సస్పెన్షన్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీవీని విధుల్లోకి తీసుకున్నట్టే తీసుకున్న జగన్ ప్రభుత్వం... తర్వాత 14 రోజుల్లోనే, అంటే 2022 జూన్ 28న మళ్లీ సస్పెండ్ చేసింది. నిఘా, భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో నమోదైన కేసులో ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ సస్పెండ్ చేసింది. ఆయన్ను డిస్మిస్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. ఒకే ఆరోపణ, అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయటం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. అఖిలభారత సర్వీసు అధికారుల నియమావళి ప్రకారం.. సస్పెన్షన్ను అధికారుల కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కానీ ఏబీవీపై విధించిన సస్పెన్షన్ను గత 21 నెలలుగా ఒక్కసారీ సమీక్షించలేదు. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసు తేల్చనేలేదు. క్రిమినల్ కేసులోనూ అభియోగపత్రం దాఖలు చేయలేదు. దురుద్దేశపూరితంగా అవేవీ తేల్చకుండా జాప్యం చేశారు. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ను కొట్టేయాలంటూ ఆయన గతేడాది ఏప్రిల్లో క్యాట్ను ఆశ్రయించారు. అక్కడ కూడా సకాలంలో తేలకుండా ఉండేలా జగన్ ప్రభుత్వం ఎన్నెన్నో కొర్రీలు వేసింది. ఆయన పదవీవిరమణ తేదీ వచ్చేవరకూ సస్పెన్షన్పై ఏ నిర్ణయం రాకుండా చూసేందుకు ఎన్నెన్నో కుటిల వ్యూహాల్ని అమలుచేసింది. వాటన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు ఆయన విజయం దక్కించుకున్నారు.
ఒంటరిగానే పోరాటం
ఒక పక్షికి ఆపదొస్తే... ఆదుకోవడానికి చుట్టూ పది పక్షులు వాలుతాయంటారు. అలాంటిది రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం కుట్రపూరితంగా వేధిస్తూ, కక్షసాధిస్తూ ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కరంటే ఒక్క ఐపీఎస్ అధికారి కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించలేదు. తమ మనోస్థైర్యం దెబ్బతీసేలా పత్రికల్లో కథనాలు వస్తున్నాయంటూ ఎన్నికల సంఘానికే ఫిర్యాదులు చేసిన ఐపీఎస్ అధికారుల సంఘం.. ఏబీవీ సస్పెన్షన్పై నోరే ఎత్తలేదు. వైకాపాకు కొమ్ముకాస్తూ, ఆ పార్టీ భజనలో మునిగి తేలుతూ కీలక పోస్టింగుల దక్కించుకున్న కొందరు అధికారులైతే ప్రభుత్వ దుశ్చర్యలకు అన్నివిధాలుగా తోడ్పాటు అందించారు. అయినా ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు ఎవరికైనా తలొగ్గాల్సిన, భయపడాల్సిన అవసరం ఏముందంటూ ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లి న్యాయపోరాటం చేశారు. చివరికి ఫలితం సాధించారు.
ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?
అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారిని ఒక ప్రభుత్వమే ఇంతలా వెంటాడి, వేటాడి వేధించిన ఘటనలు దేశచరిత్రలోనే అరుదు. కానీ 34 ఏళ్ల పాటు పోలీసుశాఖకు అత్యున్నత సేవలు అందించిన ఏబీ వెంకటేశ్వరరావుకు కేవలం కక్షసాధింపు కోసం జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పోస్టింగు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేళ్లు సస్పెన్షన్లో ఉంచింది. డీజీ క్యాడర్లో ఉన్న ఆయనకు జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. రాష్ట్ర పోలీసు దళాల అధిపతిగా సేవలందించగలిగే సామర్థ్యం ఉన్న ఆయన్ను దురుద్దేశపూరితంగా వేధించింది. ఎవరైనా తమ కెరీర్ చివరిదశలో అత్యున్నతమైన పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీవిరమణ వరకూ సస్పెన్షన్లో ఉంచేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన చివరి క్షణంలోనైనా నైతికంగా విజయం పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇదీ స్ట్రాంగ్రూమే!
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.