దుల్హన్ బంద్ కియా ... ‘తోఫా’కో ధోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు.
ముస్లింలకు జగన్ నయవంచన
రూ.కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల రక్షణపై నిర్లక్ష్యం
మైనారిటీలకు రూ.40 వేల కోట్లు దక్కకుండా పన్నాగం
ఎన్నికల రాకతో ఇప్పుడు మళ్లీ జిత్తులమారి వ్యవహారం
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. ముస్లిం యువత ఎదిగేందుకు దోహదం చేసే నైపుణ్య శిక్షణకు పాతరేశారు. వెరసి.. చరిత్రలో ముస్లింలకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం చేశారు
మైనారిటీలకు ఉపప్రణాళికను పారదర్శకంగా అమలు చేస్తాం.
2019 మ్యానిఫెస్టోలో జగన్ ప్రకటన
ముస్లింలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇస్లాం బ్యాంకు నెలకొల్పుతాం. దాని ద్వారా వడ్డీలేని రుణాలిస్తాం.
పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి హామీ
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి టక్కుటమారా విద్యలను ప్రదర్శించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసగించని వర్గం అంటూ లేదు. ముస్లింలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చిన జగన్.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ధోకా(ద్రోహం) చేశారు. వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయకుండా ఏరుదాటాక తెప్పతగిలేసిన చందంలా వ్యవహరించారు. ఉపప్రణాళికను కూడా తీసుకురాలేకపోయారు. గడిచిన ఐదేళ్లలో వారికి రూ.40 వేల కోట్లు దక్కకుండా కుట్ర పన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పేరు వస్తుందన్న అక్కసుతో ఆయన హయాంలో అమలుచేసిన పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి ఓట్లకు గాలం వేసేందుకు మళ్లీ జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు జగన్.ఆ భాగ్యమూ కలగలేదు..
ముస్లింలకు రంజాన్ పెద్దపండుగ. ఈ పండుగ పూట పేదలు మంచి భోజనం కూడా తినే భాగ్యం లేకుండా చేశారు జగన్. గత తెదేపా ప్రభుత్వం ముస్లింల కోసం అమలుచేసిన రంజాన్ తోఫానూ అధికారంలోకి రాగానే నిలిపేశారు. రేషన్కార్డు ఉన్న 11.25 లక్షల మంది పేద ముస్లింలకు ఈ పథకం కింద ఏటా పండుగ కానుకలను ఉచితంగా ఇచ్చేవారు. రంజాన్ రోజే కాకుండా సంక్రాంతి పండుగకు కూడా హిందువులతోపాటు ముస్లిం సోదరులకు కానుక అందించేవారు. జగన్ ఈ కానుకను రద్దుచేసి పేద ముస్లింలకు రంజాన్ సంతోషాన్ని దూరం చేశారు.
వక్ఫ్ ఆస్తుల రక్షణ గాలికి..
ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తుల రక్షణను గాలికి వదిలేశారు. వక్ఫ్ స్థలాల రక్షణకు గోడలు నిర్మిస్తానని, హోంగార్డులను కూడా వాటికి కాపలాగా ఉంచుతామని చెప్పి మాట తప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు 2019 బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించినట్లు పైకి చూపించిన వైకాపా సర్కారు.. వాటి పరిరక్షణకు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఈ నిధులను ఇతర పనులకు మళ్లించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఆస్తులు, నెల్లూరులో 6, తూర్పు గోదావరిలో 10, చిత్తూరులో 2, పశ్చిమ గోదావరిలో 6, అనంతపురంలో 9, కృష్ణాలో 9, ప్రకాశంలో 4, కడపలో 4, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 వక్ఫ్ ఆస్తులు కీలకమైన ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి రక్షణకు రూ.27 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. వైకాపా నేతలే వాటిని ఆక్రమించుకున్నా ఏమీ చేయలేకపోయింది. నెల్లూరు గుంటూరు, కడప నగరాలు, వినుకొండ, నరసరావుపేట, మదనపల్లె పట్టణాల్లో వక్ఫ్ భూములు కబ్జాకు గురైనా అధికారులు చర్యలు తీసుకోలేదు.
కాగితాలపైనే ఉపప్రణాళిక..
గత తెదేపా ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం ఉపప్రణాళికను ప్రవేశపెట్టింది. అప్పటికే ఉన్న దాన్ని జగన్ తాను కొత్తగా తెస్తున్నట్టు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అయినా దాన్ని పట్టాలెక్కించిన పాపాన పోలేదు. మైనారిటీలకు ఉపప్రణాళికను అమలుచేస్తే 8.8 శాతం జనాభాకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. అంటే ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టాలి. 2019 నుంచి 2022 వరకు బడ్జెట్లలో దాని ఊసే ఎత్తలేదు. 2022-23 ఏడాదిలో అమలుచేసినట్లు బడ్జెట్లో ప్రకటించినా ఆ మేరకు నిధులు కేటాయించలేదు. ఎన్నికల ఏడాది అయినా 2023-24లోనూ అదే వరుస. బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ప్రకటించారేగానీ.. ఆ నిధుల్ని మైనారిటీ సంక్షేమశాఖకు ఇవ్వలేదు. చివరికి.. అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల్లోని ముస్లిం లబ్ధిదారుల జాబితాను బయటకు తీశారు. వారికి అందిన ఆర్థికసాయం మొత్తాన్ని కలిపి అవే ఉపప్రణాళిక కింద వెచ్చించిన నిధులంటూ మైనారిటీలను మభ్యపెట్టారు. 2023-24 బడ్జెట్ను పక్కనపెట్టినా.. మైనారిటీలకు నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లను దక్కకుండా చేశారు జగన్.
షాదీఖానాలపై ఉదాసీనం
ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాల ఏర్పాటు విషయంలోనూ వైకాపా సర్కారు ఉదాసీనంగా వ్యవహరించింది. ముస్లిం వివాహాల కోసం తక్కువ అద్దెకు కేటాయించడంతోపాటు యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకే గత తెదేపా ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2015-16 నుంచి 2018-19 మధ్య 344 షాదీఖానాల నిర్మాణాలు, మరమ్మతులకు గత తెదేపా ప్రభుత్వం రూ.83 కోట్ల మేరకు ఖర్చు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వీటి నిర్మాణాలు, నిర్వహణను గాలికి వదిలేసి రూ.కోట్ల ప్రజాధనం వృథాగా మార్చారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపించడంతో ముస్లింలను మభ్యపెట్టేందుకు ఇటీవల కొన్ని పనులను పట్టాలెక్కించారు. ముస్లిం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరుచేసిన వసతి గృహాలు, ఐటీఐ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల నిర్మాణాల విషయంలోనూ వైకాపా సర్కారు అలాగే వ్యవహరించింది. పూర్తయిన భవనాలను అందుబాటులోకి తీసుకురాకుండా విద్యార్థులను అష్టకష్టాల పాలుచేసింది.
ఇస్లాం బ్యాంకు రాలేదు.. రాయితీ రుణం ఇవ్వలేదు
ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారికి రూ.5 లక్షల వరకు రాయితీ రుణాలు ఇస్తామని నమ్మబలికారు. వారి ఓట్లు గంపగుత్తగా వేయించుకున్నాక.. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇస్లాం బ్యాంకు అనే పదం ఉచ్ఛరించలేదు. పైగా గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రాయితీ రుణ పథకాన్ని కూడా ఎత్తేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముస్లింల జనాభా 36.18 లక్షలు. మెజారిటీ ముస్లింలకు చిరు వ్యాపారాలు, చిన్న చిన్న పనులే జీవనాధారం. ఇలాంటివారికి వడ్డీ లేని రుణాలే వెన్నుదన్నుగా నిలుస్తాయి. అయితే, వారు అభివృద్ధి చెందుతుంటే ఇష్టపడని జగన్ రాయితీ రుణ పథకాన్ని ఎత్తేసి తన రాక్షసత్వాన్ని చాటుకున్నారు.
మరమ్మతులకు డబ్బు ఇవ్వలే..
ముస్లింల పక్షపాతినని చెప్పుకొనే జగన్.. మసీదులు, ఈద్గాలు, దర్గాల మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేదు. వీటి మరమ్మతులు, శ్మశానవాటికలకు ప్రహరీలను నిర్మించడానికి గత తెదేపా ప్రభుత్వం 648 వక్ఫ్ సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.50 కోట్లు ఖర్చు చేసింది. వైకాపా సర్కారు మాత్రం ఐదేళ్లలో 17 సంస్థలకు రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రాజకీయ సిఫార్సు ఉన్న సంస్థలకే ఈ నిధులు కేటాయించింది. ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ వందకుపైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి.
ఇమామ్లు, మౌజమ్లకు వెన్నుపోటే...
గత తెదేపా ప్రభుత్వం ప్రతి నెలా ఇమామ్లకు రూ.5 వేలు, మౌజమ్లకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం అందించింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేల చొప్పున పెంచి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇమామ్లు, మౌజమ్లు ఉన్న మసీదులు రాష్ట్రంలో దాదాపు 15 వేల వరకు ఉంటే.. 5 వేల మసీదులకే గౌరవవేతనాన్ని పరిమితం చేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టారు.
5 శాతం పనుల పూర్తికీ నిధులు ఇవ్వలే..
2014 ఎన్నికల్లో వైయస్ఆర్ జిల్లా ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రంలో రూ.25 కోట్లతో హజ్భవనాన్ని నిర్మించారు. 2019 ఎన్నికల నాటికే దాదాపు 95 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తిచేసి ఆ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకూ జగన్కు మనసొప్పలేదు. మిగిలిన 5 శాతం పనుల పూర్తికి నిధులివ్వాలని అక్కడి కలెక్టరు పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదు. ఎన్నికలకు ఇక ఆరు నెలలు ఉండగా.. పూర్తి చేస్తున్నామంటూ హడావుడి చేశారు. రూ.10 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. కానీ ఆ పనులు చేపట్టేందుకు ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు.
షాదీ తోఫాలోనూ వంచనే...
అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచే షాదీ తోఫా అమలుచేస్తానన్న జగన్.. తర్వాత విస్మరించారు. ముస్లిం సంఘాలు కోర్టుకు వెళ్లి పోరాడితేగానీ ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాలేదు. షాదీ తోఫా ఆర్థికసాయాన్ని పెంచినట్టు చూపించిన జగన్ తర్వాత నిబంధనల కత్తెర వేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికే షాదీ తోఫా ఇస్తామని మెలికపెట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 40 వేల మందికి పెళ్లికానుక సాయం అందితే.. జగన్ ఇప్పటివరకు 6,346 మందికే పంపిణీ చేశారు.
విదేశీ విద్య దూరం
గత ప్రభుత్వ హయాంలో అమలైన విదేశీ విద్యా పథకాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు పక్కన పెట్టారు. తర్వాత కోర్టు ఆదేశాలతో ఏడాదిన్నర క్రితం అమలులోకి తెచ్చినా.. నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను తెగ్గోశారు. వివిధ దేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి తెదేపా ప్రభుత్వం 527 మంది ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తే.. జగన్ సర్కారు నుంచి ఐదేళ్లలో ఆర్థికసాయం అందిన విద్యార్థుల సంఖ్య 70 దాటలేదు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM