భూసేకరణ ప్రకటన ఉపసంహరణపై దాఖలైన పిల్ విచారణ వాయిదా
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది.
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. ఈ వ్యాజ్యం హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బుధవారం విచారణకు రాగా.. కొంతమంది రైతుల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి స్పందిస్తూ తమ భూములు తీసుకున్నందుకు సొమ్ము చెల్లించాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను కోరామన్నారు. సొమ్ము చెల్లించడంలో విఫలమైనందున భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరామని, ఈ రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేశామని చెప్పారు. దానిని అనుమతించాలని కోరారు. పిటిషనర్లు/ రాజధాని రైతు సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఏదో చెప్పబోతుండగా.. తాము ఈ వ్యాజ్యాన్ని వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించింది.
ప్రభుత్వ వినతిపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పండి
ఈసీకి హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం నిధుల పంపిణీ విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది. నిధుల పంపిణీ ఆవశ్యకతపై కారణాలను పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం ఈసీకి ఇప్పటికే వినతి ఇచ్చిందని ప్రత్యేక జీపీ సుమన్ నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆ వినతిపై నిర్ణయం తీసుకొని వివరాలను కోర్టుకు తెలపాలని ఈసీని ఆదేశించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన, చేయూత వ్యవహారంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలు గురువారానికి వాయిదా పడ్డాయని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆ వ్యాజ్యాలతో ప్రస్తుత వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
అనంతపురం రేంజ్ డీఐజీగా షేముషి
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: అనంతపురం రేంజ్ డీఐజీగా షేముషి బాజ్పేయీను ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్ప్రదేశ్లోని అహ్మదాబాద్కు చెందిన షేముషి 2008లో ఐపీఎస్కు ఎంపికయ్యారు.శిక్షణానంతరం అసిస్టెంట్ ఎస్పీగా కర్నూలు జిల్లా ఆదోనిలో పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలో విజిలెన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు డీఐజీగా ఉన్న ఆర్ఎన్ అమ్మిరెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేయడంతో ఈ నియామకం జరిగింది.
పోలింగ్ ముగిసిన వెంటనే ‘ఫాం 17సీ పార్ట్-1’ను ఏజెంట్లకు ఇవ్వాలి
సీఈవోను కోరిన న్యాయవాది పారా కిషోర్
ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్ ముగిసిన వెంటనే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఫాం 17సీ పార్ట్-1 (పోలింగ్ స్టేషన్, ఓటింగ్ మెషీన్, బ్యాలట్ యూనిట్, వీవీ ప్యాట్, సంబంధిత పోలింగ్స్టేషన్లో ఉన్న ఓటర్ల సంఖ్య, టెస్ట్ ఓట్లు, నమోదైన ఓట్లు తదితర వివరాలు) ఇవ్వాలని సీఈవో ముకేశ్కుమార్ మీనాను న్యాయవాది పారా కిషోర్ కోరారు. సచివాలయంలో సీఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. ఫాం17సీ పార్ట్-1ని నింపాక పోలింగ్ ఏజెంట్తో సంతకం చేయించి ప్రిసైడింగ్ అధికారి సంతకంతో అటెస్ట్ చేసిన ట్రూకాపీని లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు విడివిడిగా వారి తరఫు పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ముకేశ్కుమార్మీనా హామీనిచ్చినట్టు కిషోర్ వెల్లడించారు.
పదో తరగతి ఆంగ్ల పరీక్షలో ఐదో తరగతి స్థాయి ప్రశ్నలు
విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాశాఖ
సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్ మండిపాటు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఇటీవల నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆంగ్లం పేపర్లోని ప్రశ్నలు అయిదో తరగతి స్థాయి కూడా లేవని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇలా సులభమైన ప్రశ్నలు ఇస్తూ ఆంగ్లంలో విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని వారి తల్లిదండ్రులను రాష్ట్ర విద్యాశాఖ మోసం చేస్తోందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘సీబీఎస్ఈ, ఐబీ సిలబస్లు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అయితే ఈ ఏడాది పబ్లిక్ పరీక్షల్లో సీబీఎస్ఈ, రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ప్రశ్నాపత్రాలను చూస్తే అసలు విషయం బట్టబయలవుతుంది. ఆంగ్ల పదాలు తప్పు రాసినా కూడా మూల్యాంకనంలో నూటికి నూరు మార్కులు ఎలా వేశారు. దీన్ని విద్యాశాఖ ఎలా సమర్థించుకుంటుంది? ఇది తల్లిదండ్రులను మోసం చేయడం కాదా? 2022 జులైలో బేస్లైన్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. ఆ ఫలితాలను తల్లిదండ్రులకు ఇంతవరకు ఇవ్వలేదు. అందులో సుమారు పది లక్షల మంది తెలుగు వాక్యాలు, దాదాపు 17లక్షల మంది విద్యార్థులు సులభమైన ఆంగ్ల వాక్యాలనూ చదవలేరని తేటతెల్లమైంది. ‘గడప గడపకు’ కార్యక్రమం కింద ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి జరిగిందో కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేసిన వైకాపా ప్రభుత్వం.. అదే మాదిరిగా బేస్లైన్ పరీక్ష ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇదీ స్ట్రాంగ్రూమే!
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. -
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీకి మద్దతుగా 22,559 మంది సంతకాలు
జగన్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, వేధింపులకు బలైపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ‘ఛేంజ్.ఓఆర్జీ’లో ఉద్యమం కొనసాగుతోంది.