రైల్వే ప్రాజెక్టులకు ఏపీ వాటా ఇవ్వట్లేదు
ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఆయా ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు.
50% ఖర్చులో ఇస్తున్నది అంతంతమాత్రమే
రాజ్యసభలో వెల్లడించిన రైల్వే మంత్రి
అశ్వినీ వైష్ణవ్
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఆయా ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు. శుక్రవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఖర్చు పంపిణీ విధానం కింద నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.15,846.35 కోట్లుకాగా, ఏపీ ప్రభుత్వం రూ.746.63 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.3,073.5 కోట్లు బకాయి ఉందన్నారు.
* నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ నిర్మాణానికి రూ.2,643.35 కోట్లు ఖర్చవుతుందని, ఇందుకు భూమిని ఉచితంగా ఇవ్వడంతోపాటు, 50% ఖర్చును భరించడానికి గతంలో ఏపీ ప్రభుత్వం అంగీకరించి, రూ.6 కోట్లే ఇచ్చిందని, ఇంకా రూ.1,315.50 కోట్లు ఇవ్వాలని వివరించారు.
* రూ.2,155 కోట్ల ఖర్చయ్యే భద్రాచలం-కొవ్వూరు లైన్ ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉందని చెప్పారు. 50% ఖర్చు భరించేదీ లేనిదీ ఏపీ ప్రభుత్వం చెప్పాలన్నారు.
* విజయవాడ-గుడివాడ-భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నిడదవోలు (డబ్లింగ్, విద్యుదీకరణ) ప్రాజెక్టుకు రూ.3,377 కోట్ల అంచనా వ్యయంలో ఏపీ రూ.288కోట్లే చెల్లించిందన్నారు. 50% వాటా కింద ఇంకా రూ.1,400 కోట్లు ఇవ్వాలన్నారు.
* రూ.3,038 కోట్లతో తలపెట్టిన కడప-బెంగుళూరు కొత్త లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.189.94 కోట్లే ఇచ్చినట్లు తెలిపారు.
* రూ.2,120 కోట్లతో తలపెట్టిన కోటిపల్లి-నరసాపురం లైన్కయ్యే ఖర్చులో ఏపీ 25% వాటా భరించాలని, ఇప్పటివరకు రూ.2.69 కోట్లే ఇచ్చిందని, ఇంకా రూ.358 కోట్ల బకాయి ఉందని చెప్పారు.
* రూ.2,513 కోట్లతో తలపెట్టిన తుమకూరు-రాయదుర్గం లైన్ నిర్మాణానికి 50% వాటా భరించాల్సిన ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.260 కోట్లే ఇచ్చిందన్నారు.
* ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ఆంధ్రప్రదేశ్లో 5,706 కిలోమీటర్ల పొడవైన 16 కొత్తలైన్లు, 17 డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, దీని అంచనా వ్యయం రూ.63,731 కోట్లని రైల్వేమంత్రి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భరోసానూ బరికేశారు!
-
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)