న్యాయ వ్యవస్థపై కుట్రలా ఉంది
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వారు వేర్వేరుగా దాఖలు చేసిన
దీని వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం
ఆరుగురు నిందితులకు బెయిలు నిరాకరించిన హైకోర్టు
ఈనాడు, అమరావతి: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వారు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. న్యాయమూర్తులను దూషిస్తూ పత్రికల్లో రాయలేని భాషతో పిటిషనర్లు పెట్టిన పోస్టులను న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో సవివరంగా ప్రస్తావించింది. ఆరోపణల తీవ్రత, మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరత, దర్యాప్తు ఇంకా తదిదశకు చేరుకోలేదని సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకొని పిటిషన్లను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ నవంబరు 30న ఈ మేరకు తీర్పు ఇచ్చారు. న్యాయవ్యవస్థ, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై హైకోర్టు ఆదేశాలతో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేయగా... సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఏడో నిందితుడు గుంటూరు పట్టాభిపురానికి చెందిన అవుతు శ్రీధర్రెడ్డి, ఎనిమిదో నిందితుడు హైదరాబాద్కు చెందిన జలగం వెంకట సత్యనారాయణ(68 ఏళ్లు), ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన తొమ్మిదో నిందితుడు గూడ శ్రీధర్రెడ్డి, పన్నెండో నిందితుడు హైదరాబాద్కు చెందిన సుస్వరం శ్రీనాథ్, పదమూడో నిందితుడు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దరిశ కిషోర్కుమార్రెడ్డి, పద్నాలుగో నిందితుడు హైదరాబాద్కు చెందిన సుద్దులూరి అజయ్ అమృత్లను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కష్టడీలో ఉన్న నిందితులు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్లు వేశారు.
న్యాయస్థానాలను అపకీర్తిపాల్జేయడమే: న్యాయమూర్తి
‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ పోస్టులు పెడుతున్న నేరగాళ్లను పట్టుకుని శిక్షపడేలా చూడాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 2020 మే 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కేసు దర్యాప్తులో విఫలమైంది. దీంతో దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని 2020 అక్టోబరు 12న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్టోబరు 2020న దర్యాప్తు సీబీఐకి బదిలీ చేసినా... పిటిషనర్లను అరెస్టు చేయడానికి సీబీఐకి ఏడాది పట్టింది. దీన్నిబట్టి చూస్తుంటే పిటిషనర్లు ఎంత శక్తిమంతులో అర్థమవుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టింగ్లను చూస్తుంటే ‘న్యాయవ్యవస్థ’పై కుట్ర పన్నినట్లు భావించాల్సి వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు 2020 ఏప్రిల్ నుంచి పోస్టులు పెట్టారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంటే సామాజిక మాధ్యమాల్లో నిందితులు పెడుతున్న పోస్టులు... జడ్జిలపై వ్యక్తిగతంగా చేస్తున్నవి కాదు. ఆ పోస్టులు న్యాయవ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉంది. దర్యాప్తు సీబీఐకి అప్పగించిన ఏడాది తర్వాత నిందితులను కనుగొని ఈ ఏడాది అక్టోబరు 21న అరెస్టు చేశారు. దీనినిబట్టి చూస్తుంటే పిటిషనర్లు చిన్న వ్యక్తులై ఉండొచ్చు.. కాని ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం లేకపోలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు