కలెక్టర్ల నివేదికలే కీలకం!
ప్రతిపాదిత జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆకాంక్షలు, అభ్యంతరాలను వెల్లడిస్తున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి
కొత్త జిల్లాలపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్లు
పునర్విభజన భిన్న స్వరాలపై సూచనలకు ఆహ్వానం
ఈనాడు, అమరావతి: ప్రతిపాదిత జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆకాంక్షలు, అభ్యంతరాలను వెల్లడిస్తున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అందించే నివేదికలు కీలకం కాబోతున్నాయి. ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లను ప్రకటించింది. ఏడాది కిందటే కలెక్టర్లు జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేశారు. వారిచ్చిన సమాచారాన్ని అనుసరించి... ప్రిలిమనరీ నోటిఫికేషన్ల జారీకి ముందు కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించింది. అప్పట్లో ఉన్న కలెక్టర్లు పలువురు ప్రస్తుతం లేరు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్లకు అనుగుణంగా కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో రాజపత్రాన్ని (గెజిట్ నోటిఫికేషన్) విడుదల చేయనున్నారు. 1974 (ది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్) చట్టాన్ని అనుసరించి ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై... గ్రామ/వార్డు సచివాలయాలు, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల ద్వారా ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరాలను వ్యక్తంచేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలకు అవకాశాన్ని కల్పిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లకు అందే అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కీలకం కానున్నాయి. వీటిని కోడ్రీకరించి వారు ప్రభుత్వానికి నివేదికలు అందచేస్తారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది తెలియదు. ఈ ప్రక్రియ ముగిశాకే జిల్లాల వారీగా తుది నోటిఫికేషన్ వస్తుంది. అయితే... ప్రిలిమనరీ నోటిఫికేషన్లో రాజకీయ కారణాలతోనే మార్పులు, చేర్పులు జరగొచ్చని భావిస్తున్నారు.
కదిరి రెవెన్యూ డివిజన్పై పునఃపరిశీలన?
అనంతపురం జిల్లాలోని కదిరిని మళ్లీ రెవెన్యూ డివిజన్గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లావాసుల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో... పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనికిముందు కదిరి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లు ఉండగా... కొత్తగా పుట్టపర్తి వచ్చి కదిరి మాయమైంది. కదిరి డివిజన్ను యథావిధిగా కొనసాగించాలని గట్టి డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద తాలూకాల్లో ఒకటైన కదిరిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే నినాదం చాలాకాలంపాటు వినిపించింది. చివరికి 2013లో నెరవేరింది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 12 మండలాలతో కలిపి కదిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి