పూర్వాంచల్లో పట్టం ఎవరికో!
ఉత్తర్ప్రదేశ్లో పశ్చిమాన మొదలైన పోలింగ్ ప్రక్రియ.. ఒక్కో విడత ముగిసేకొద్దీ తూర్పు దిశగా సాగుతోంది. మధ్య యూపీలోని మెజార్టీ నియోజకవర్గాలకు నాలుగో దశలో ఎన్నికలు ముగియగా..
ఉత్తర్ప్రదేశ్లో పశ్చిమాన మొదలైన పోలింగ్ ప్రక్రియ.. ఒక్కో విడత ముగిసేకొద్దీ తూర్పు దిశగా సాగుతోంది. మధ్య యూపీలోని మెజార్టీ నియోజకవర్గాలకు నాలుగో దశలో ఎన్నికలు ముగియగా.. ఐదో దశతో పూర్వాంచల్ (తూర్పు యూపీ)లో పోరు ప్రారంభం కానుంది. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాలకు ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల తరహాలో ఈ దశలోని సీట్లలో మరోసారి సత్తా చాటాలని అధికార భాజపా తహతహలాడుతుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని ఆ పార్టీపై పైచేయి సాధించాలన్న ప్రణాళికలతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ముందుకెళ్తోంది. ప్రస్తుతమిక్కడ ఆయా పార్టీల పరిస్థితి ఎలా ఉందన్నది పరిశీలిస్తే..
భాజపా: అయోధ్య రాముడిపై ఆశలు
పూర్వాంచల్ రాజకీయాల్లో ‘అయోధ్య రామమందిరం’ చాలా ముఖ్యమైన అంశం. యూపీలో 1990ల్లో భాజపా అధికారంలోకి రావడంలో అది అత్యంత కీలక పాత్ర పోషించింది. మందిర నిర్మాణం గత ఏడాది ప్రారంభమవడం కమలదళానికి సానుకూలాంశం. అందుకే ఒకప్పటి స్థాయిలో కాకున్నా.. ఇప్పటికీ ప్రచారంలో రామమందిర అంశాన్ని కమలనాథులు ప్రస్తావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తొలి మూడు విడతల్లో భాజపా వెనుకబడిందని విశ్లేషణలు వస్తున్నాయి. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని కమలనాథులు చూస్తున్నారు. అయితే పోషణ భారమై ప్రజలు వదిలేస్తున్న గోవులు, ఇతర పశువులు ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన ప్రధాని మోదీ.. ఆ సమస్యను అధిగమించేందుకు కొత్త పథకాన్ని తీసుకొస్తామని ఇటీవల బహ్రాయిచ్లో నిర్వహించిన ర్యాలీలో ప్రకటించారు. వట్టిపోయిన గోవుల పోషణ బాధ్యతలు చూసుకువారికి ఆర్థిక సహాయం చేస్తామని సీఎం యోగి చెప్పారు.
ఎస్పీ: ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని..
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ.. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతపైనే ఈ దశలో ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. కీలకమైన అయోధ్య మందిరం అంశం గురించి గతంలో ఆ పార్టీ నేతలు ఇక్కడ ప్రచారంలో విస్తృతంగా మాట్లాడేవారు. తద్వారా మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలేశ్.. వ్యూహాత్మకంగా ఆ అంశాన్ని ర్యాలీల్లో ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఓం ప్రకాశ్ రాజ్భర్ నాయకత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) తమ మిత్రపక్షంగా ఉండటం ఈ ప్రాంతంలో అఖిలేశ్ పార్టీకి కలిసొచ్చే అంశం.తాము అధికారంలోకి వస్తే.. పశువుల నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఐదో విడతలో పోలింగ్ జరగనున్న స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. మొత్తం 61 సీట్లకుగాను 39 చోట్ల విజయ పతాకం ఎగరేసింది.
బీఎస్పీ: తాను గెలవకపోయినా..!
పూర్వాంచల్లో బీఎస్పీకి చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉంది. తాను గెలవలేకపోయినా.. చాలా స్థానాల్లో ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీయగల బలం ఆ పార్టీ సొంతం. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గారు. 2012 ఎన్నికల నుంచి మాత్రం వారు భాజపాకు అండగా నిలుస్తున్నారు. బ్రాహ్మణులతోపాటు జాతవ్, జాతవేతర దళితులను తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు బీఎస్పీ ఈ దఫా పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ మైనారిటీ అభ్యర్థులను బరిలో దించిన పలు స్థానాల్లో.. బీఎస్పీ కూడా అదే సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థులకు టికెట్ కేటాయించింది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ