POLAVARAM PROJECT: పరిహారం..ఫలహారం
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో ఇది మరో అక్రమాల అంకం. కొండ పోరంబోకు భూములకు నకిలీ డి ఫాం పట్టాలతో దొంగ లబ్ధిదారులను సృష్టించి రూ.కోట్ల పరిహారం ఫలహారం చేశారు. ఇందులో దళారులు కీలకపాత్ర పోషించారు. వీరికి రెవెన్యూ సిబ్బంది, ఒకరిద్దరు అధికారులు సహకరించడం వల్లే ఈ స్థాయి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. గిరిజనుల పేరుతోనే ఆ మొత్తం బదిలీ అయ్యేలా చూసి వారికి కొంత మొత్తం అందించారు. సింహభాగం దళారులు, కొందరు రెవెన్యూ....
పోలవరం భూసేకరణలో అక్రమాలు
పాత తహసీల్దార్ల సంతకాల ఫోర్జరీ, దొంగ ముద్రలు
నకిలీ పట్టాలతో దళారుల మోసాలు ..కొందరు అధికారుల వత్తాసు
345 ఎకరాల్లో అక్రమాలుజరిగినట్లు అనుమానాలు
బయటపడ్డవి కొన్నే..
లబోదిబోమంటున్న బాధితులు
పోలవరం నిర్వాసిత గ్రామాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి, న్యూస్టుడే - దేవీపట్నం
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో ఇది మరో అక్రమాల అంకం. కొండ పోరంబోకు భూములకు నకిలీ డి ఫాం పట్టాలతో దొంగ లబ్ధిదారులను సృష్టించి రూ.కోట్ల పరిహారం ఫలహారం చేశారు. ఇందులో దళారులు కీలకపాత్ర పోషించారు. వీరికి రెవెన్యూ సిబ్బంది, ఒకరిద్దరు అధికారులు సహకరించడం వల్లే ఈ స్థాయి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. గిరిజనుల పేరుతోనే ఆ మొత్తం బదిలీ అయ్యేలా చూసి వారికి కొంత మొత్తం అందించారు. సింహభాగం దళారులు, కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులు పంచుకున్నారనే అనుమానాలు రేగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో ఈ అక్రమాలు తాజాగా వెలుగుచూశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన జలాశయానికి, ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరిస్తున్నారు. మరోవైపు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాస ప్రక్రియ సాగుతోంది. దేవీపట్నం మండలం చిన రమణయ్యపేట పంచాయతీలోని గ్రామాల్లో ఇలా నకిలీ డి ఫాం పట్టాలు సృష్టించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఎకరానికి రూ.7.50 లక్షల చొప్పున ఇప్పటికే ఆ మొత్తాలు నకిలీ లబ్ధిదారులకు అందించడం, ఆ సొమ్ము చేతులు మారడం పూర్తయింది. తాజాగా 30 ఎకరాలకు సంబంధించిన అక్రమాలు బయటపడ్డాయి. పోలవరం భూసేకరణలో కొన్నేళ్లుగా ఒక్క దేవీపట్నం మండలంలోనే 345 ఎకరాల వరకు ఇలా అక్రమ పట్టాల రూపేణా పరిహారం దారి మళ్లినట్లు సమాచారం. చాలా మంది గిరిజనులు ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. డి ఫాం పట్టాలకు పరిహారం చెల్లించే క్రమంలో ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరికి చెల్లిస్తున్నామనే డ్రాఫ్టు నోటిఫికేషన్, డ్రాఫ్టు డిక్లరేషన్ ఇవ్వకపోవడంతోనే ఇలాంటి అక్రమాలకు తావు ఏర్పడుతోందని అంటున్నారు. అసలు లబ్ధిదారులు పరిహారం కోసం ఎదురుచూస్తుంటే.. దొంగ పట్టాలతో ఆ పరిహారాన్ని కొందరు భోం చేస్తున్నారనే ఆరోపణలకు తాజా ఉదంతం బలం చేకూరుస్తోంది. ఈ విషయమై రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యతో ‘ఈనాడు’ మాట్లాడి వివరణ కోరింది. 25 ఎకరాలకే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. 345 ఎకరాల అంశం తమ దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా నిర్దిష్టంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని వెల్లడించారు.
పాత తహసీల్దార్ల సంతకాలతో దొంగ పట్టాలు
దేవీపట్నం మండలంలో గతంలో పని చేసిన ముగ్గురు తహసీల్దార్ల ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ ముద్రలతో దళారులు ఇలా దొంగ పట్టాలు సృష్టించారని తెలిసింది. తహసీల్దార్లలో ఒకరు పదవీ విరమణ చేయగా మరొకరు మరణించారు. ఇంకొకరు వేరే జిల్లాలో పని చేస్తున్నారు. ఈ పని చేసిన దళారుల పేర్లూ గ్రామస్థుల ఫిర్యాదులో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఎక్కడెక్కడ డి ఫాం భూములున్నాయి? అవి ఎవరివి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయో తెలిసినవారే అక్రమాలకు తెరతీశారు. చినరమణయ్యపేట పంచాయతీలో ఇంకా ఎవరెవరికి పరిహారం అందలేదో, వారి భూముల సర్వే నెంబర్లేవో తెలుసుకుంటున్నారు. అదే గ్రామంలో భూములు లేని వేరే గిరిజనుల పేరుతో దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు. ఆ గిరిజనుల ఖాతా నంబర్లు తీసుకుని.. వారికి కొంత సొమ్ము ఇస్తామని బేరం కుదుర్చుకుని మిగిలిన మొత్తాలకు ముందే చెక్కులు తీసుకుంటున్నారు. ఇలా ఆయాచితంగా లబ్ధి పొందిన వారిలో కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికే రూ.కోట్లు అక్రమార్కుల చేతికి చేరింది. ఆయా భూములకు జెన్యునిటీ సర్టిఫికెట్ల జారీలోనూ అక్రమాలు చోటుచేసుకోవడం వల్లే ఈ వ్యవహారం సాగిపోతున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడితే విచారణ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో నివేదిక సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎలా బయటపడింది?
దేవీపట్నం మండలం గుబ్బలంపాడు, చినరమణయ్యపేట, సీతారం గ్రామాలకు చెందిన గిరిజనులు, గిరిజనేతరులు తమ భూములకు పరిహారం అందుతుందని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు. అధికారులు వారికి పరిహారం అందుతుందనే చెబుతున్నారు. ఇంతలో అవే గ్రామాల్లో వేరేవారికి పరిహారం సొమ్ము అందింది. అలా పొందిన వారికి గ్రామంలో భూములు లేవు. వారికి పరిహారం ఎలా అందిందా అని గ్రామస్థులు తహసీల్దారు కార్యాలయంలోను, ఇతరత్రా కార్యాలయాల్లో విచారించారు. ‘మీ పేరున ఇప్పటికే భూసేకరణ పరిహారం చెల్లించేశారు’ అని సమాధానం వచ్చింది. దీంతో విస్తుపోవడం వీరి వంతయింది. అసలేం జరిగిందని గ్రామస్థులే ఆరా తీసి, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించగా ఎవరెవరికి, ఏ పట్టాలతో పరిహారం అందించారో ఆ వివరాలు బయటపడ్డాయి. తీరా చూస్తే అవన్నీ నకిలీ పట్టాలని గ్రామస్థులు గుర్తించారు.
ఫిర్యాదు చేశామని కేసులు
- డి.కాంతమ్మ, గుబ్బలపాలెం
మాకు ఆరు ఎకరాల భూమి అల్లుడు, కూతురి పేరున ఉంది. వారి కోసం నేను అధికారుల చుట్టూ తిరుగుతున్నా. పరిహారం రాలేదని ప్రాజెక్టు అధికారి వద్దకు వెళ్లాం. ఆయన జేసీ దగ్గరికి వెళ్లమంటున్నారు. ఈలోపు ఆ భూమికి పరిహారం వేరేవారికి ఇచ్చేశారు. ఆ విషయంపై ఫిర్యాదు చేస్తే దళారులు మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమ్మల్ని స్టేషన్కు పిలిచి ప్రశ్నించారు. మాకు న్యాయం చేయాలి.
మా భూములకు వేరే వారికి సొమ్ము ఇచ్చేశారు
- మిర్తివాడ సీతమ్మ, చినరమణయ్యపేట పంచాయతీ
మాకు సర్వే నంబరు 111/2లో మా అత్త పేరున భూమి ఉంది. ఆ భూమికి పరిహారం కోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో మా భూమి పేరుతో నకిలీ పట్టా సృష్టించి సొమ్ము ఇచ్చేశారని తెలిసింది. అధికారులకు ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని కోరుతున్నాం.
285 ఎకరాల్లో అక్రమాలపై సమాచారముంది
- మట్టా మెహర్బాబా గౌడ్, పాతూరు
మా భూమికి పరిహారం కోసం వెళ్తే అధికారులు తిప్పించుకున్నారు. తీరా వేరే వారికి పరిహారం ఇచ్చేశారని తెలిసింది. కొందరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. పాత అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. కొందరు అధికారులు వారితో కలిసి ఇలా చేస్తున్నారు. ఇంతవరకు 285 ఎకరాలకు సంబంధించి ఇలా అక్రమాలు జరిగాయని మేం సమాచారం సేకరించాం. సమగ్ర విచారణ జరపాలి. మాలాంటి బాధితులందరికీ న్యాయం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన