AP Liquor: మద్యంలో విషం
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డైఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది.
3 రకాల బ్రాండ్లలో విషపూరిత, హానికరమైన రసాయనాలు
ఆంధ్రాగోల్డ్, 9 సీహార్స్, సిల్వర్ స్ట్రైప్స్స్ విస్కీ నమూనాల్ని పరీక్షిస్తే వెల్లడైంది
ఈ మద్యం వల్ల భావితరాల్లో జన్యుపరమైన సమస్యలు.. అనేక అనారోగ్యాలు
తెదేపా నాయకులు పంచుమర్తి అనూరాధ, ఆనం వెంకటరమణారెడ్డి, వరుణ్
ప్రైవేటు ల్యాబ్లలో పరీక్షించిన నమూనాల నివేదికలు విడుదల
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డైఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది. ఈ మద్యం తాగినవారు మతిభ్రమించి భ్రాంతిలో ఉంటారని, నరాలన్నీ లాగేస్తున్నట్లు, మెదడులోనూ, ఒళ్లంతా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుందని తెలిపింది. నాడీవ్యవస్థ పనితీరు పెరిగిపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.
భావి తరాల్లో జన్యుపరమైన సమస్యలకు కారణమై వైకల్యం, అంధత్వం వంటివాటికి దారితీసే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంగవైకల్య ప్రదేశ్గా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఆ నమూనాల్ని చెన్నైలోని ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగశాలలో పరీక్ష చేయించింది. ఆ ప్రయోగ ఫలితాలు, నివేదికల్ని శనివారం మీడియాకు విడుదల చేసింది. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రసాయన నిపుణుడు, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కలిసి విలేకరులతో మాట్లాడారు.
తాగితే చనిపోతారని తెలిసే వ్యాపారం
- పంచుమర్తి అనూరాధ
అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగిన ఈ మద్యాన్ని తాగితే ప్రజలు భయంకరమైన వ్యాధులతో చనిపోతారని తెలిసి కూడా ప్రభుత్వానికి ఏమీ పట్టట్లేదు. ప్రజల చావులతో సీఎం జగన్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీ మద్యంతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా చూడలేదు. ఈ విష రసాయనాలతో కూడిన మద్యం పురుషులు తాగటం వల్ల మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయి. కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి తెగబడటం, 60-70 ఏళ్ల వృద్ధుడు చిన్నారులపై బలాత్కారాలు చేయటం వంటి నేరాలకు ఈ విష రసాయనాలు కలిగిన బ్రాండ్లు తాగటమే కారణమవుతోంది. అయినా సరే ఐఏఎస్ అధికారులు ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు.
రజత్ భార్గవా... ఇప్పుడే ఏమంటారు
- వరుణ్
ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న బ్రాండ్లలో విష రసాయనాలు ఉన్నాయని గతంలోనే మేం బయటపెట్టాం. అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఆ నమూనాలు ఆంధ్రప్రదేశ్లో నుంచి సేకరించినవేనని ఎలా చెబుతారు? కొన్న తర్వాత వాటిలో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. అందుకే గుత్తి, చిలకలూరిపేట, అనపర్తి సహా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ర్యాండమ్గా కొనుగోలు చేసి నమూనాలు సేకరించాం. జియోట్యాగింగ్ కూడా చేశాం. (ఆయా ప్రాంతాల్లోని దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసిన వీడియోలు ప్రదర్శించారు). వాటిని మేము ల్యాబ్లో పరీక్షిస్తే.. ప్రాణహాని కలిగించే విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. గత రెండేళ్లలో అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. వైరస్ వల్ల వారి ఊపిరితిత్తులు ఇప్పటికే బలహీనపడ్డాయి. రోగనిరోధక శక్తి తగ్గింది. ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రమాదకర రసాయనాలు కలిగిన మద్యం తాగితే అది మరింత ప్రాణాంతకం అవుతుంది. మా పరీక్షల్లో తేలిన అంశాలు నిజం కాదని ప్రభుత్వం భావిస్తే.. ఆ బ్రాండ్లు సురక్షితమేనని వచ్చి ప్రకటించాలి. ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలి.
త్వరలో జగనన్న సారాయి యాప్
- ఆనం వెంకటరమణారెడ్డి
రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో లభిస్తున్న బ్రాండ్లన్నీ జగన్రెడ్డి, ఆయన బంధువులు, వారి పెట్టుబడిదారులు తయారు చేయిస్తున్నవే. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న రెగ్యులర్ బ్రాండ్లు ఇక్కడ ఎందుకు అమ్మట్లేదో జగన్ సమాధానం చెప్పాలి. త్వరలో జగనన్న సారాయి యాప్ను కూడా తీసుకొస్తారనుకుంటా. జనం సారా తాగకపోతే అందులో అప్లోడ్ చేయాలని వాలంటీర్లకు నిబంధన పెట్టినా పెడతారు. అక్రమ మద్యం అమ్ముకునేందుకే ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు పెట్టట్లేదు.
పరీక్షించిన బ్రాండు-1: ఆంధ్రా గోల్డ్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్
తాగితే వచ్చే పరిణామాలు: దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం, శ్వాసక్రియ ఒక్కసారిగా పెరిగిపోవటం, రక్తపోటు తగ్గిపోవటం, నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతమవ్వటం, తలతిరగటం, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగటం, మూర్ఛపోవటం లాంటి సమస్యలు వస్తాయి.
పరీక్షించిన బ్రాండు-2: సిల్వర్ స్ట్రైప్స్స్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్
తాగితే వచ్చే పరిణామాలు: చేతులు, అరికాళ్ల కింద సూదులతో గుచ్చినట్లు ఉండటం, జన్యుపరమైన సమస్యలు, కళ్ల మంటలు, చర్మంపై దురద, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
పరీక్షించిన బ్రాండు-3: 9 సీహార్స్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్
తాగితే వచ్చే పరిణామాలు: శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, కళ్ల మంటలు, చర్మంపై దురద, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటివి
వెలుగుచూసిన విష రసాయనాలు..
పైరోగలాల్: ఇది విషపూరితం. దీన్ని తాగటం, పీల్చటం అత్యంత ప్రమాదకరం. జన్యుపరమైన సమస్యలకు కారణమవుతుంది.
డై ఇథైల్ థాలేట్: ఈ రసాయనం కలిగిన మద్యం తాగితే తిమ్మిరి ఎక్కుతుంది. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఉంటుంది.
ఐసోఫులెరిక్ యాసిడ్: ఈ రసాయనాన్ని పరిశోధనల్లోనే ఉపయోగిస్తారు. మనుషులు, జంతువుల వైద్య అవసరాలకూ ఉపయోగించకూడదు. ఇది శ్వాసపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం