పీవోడబ్ల్యూ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

ఒంగోలులో జరిగిన పీవోడబ్ల్యూ 8వ రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్‌.విష్ణు, ఉపాధ్యక్షులుగా రమాసుందరి, పి.అనుసూయ, ప్రధాన కార్యదర్శిగా బి.పద్మ, సహాయ కార్యదర్శులుగా

Published : 28 Jun 2022 05:33 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలులో జరిగిన పీవోడబ్ల్యూ 8వ రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్‌.విష్ణు, ఉపాధ్యక్షులుగా రమాసుందరి, పి.అనుసూయ, ప్రధాన కార్యదర్శిగా బి.పద్మ, సహాయ కార్యదర్శులుగా శీలం ఏసమ్మ, పి.విజయ, కోశాధికారిగా ఎస్‌.భారతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వసంతమ్మ(నెల్లూరు), వి.మంజుల(ప్రకాశం), జె.కల్పన, ఎన్‌.సామ్రాజ్యం(గుంటూరు), ఎల్‌.రమ(విజయవాడ), వి.శాంతి, చిలకమ్మ(తూర్పుగోదావరి), పి.కుసుమ, బి.ఈశ్వరి(శ్రీకాకుళం)లను ఎన్నుకున్నారు. మహిళలపై దాడులను వ్యతిరేకిస్తూ, హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను వెంటనే విడుదల చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ జులై ఒకటి నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌.విష్ణు తెలిపారు. ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలను సోమవారం విలేకరులకు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని