5 కి.మీ. కొట్టుకుంటూ తీసుకెళ్లారు
‘అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి పోలీసు వాహనం ఎక్కించారు. నాకు అటూ ఇటూ ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. ఒకరు మోచేత్తో బలంగా నా ముఖంపై కొట్టారు. పెదవి పగిలి
నీళ్ల సీసా ఇచ్చి రక్తం కడిగేసుకోవాలన్నారు
ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు
పోలీసుల చిత్రహింసలను వివరించిన గార్లపాటి వెంకటేష్
ఈనాడు, అమరావతి: ‘అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి పోలీసు వాహనం ఎక్కించారు. నాకు అటూ ఇటూ ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. ఒకరు మోచేత్తో బలంగా నా ముఖంపై కొట్టారు. పెదవి పగిలి రక్తం కారుతుండటంతో... ఆ బాధతో నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ముందుకు వంగాను. అప్పుడు మెడ మీద గట్టిగా కొట్టారు. 5 కిలోమీటర్ల దూరం వెళ్లేదాకా కొడుతూనే ఉన్నారు. పోలీసుల దెబ్బలకు తలంతా దిమ్ముగా అయిపోయి... మాట్లాడలేకపోయాను’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడన్న అభియోగంపై సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు, ధరణికోటకు చెందిన గార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ వాపోయారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో కలసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడకు పట్టీతో ఉన్న వెంకటేష్... పోలీసుల కస్టడీలో, ఆసుపత్రిలో వైద్య చికిత్సల సమయంలో తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు. ‘పోలీసుల దెబ్బలకు పెదవి పగిలి రక్తం కారితే... కార్లోనే నీళ్ల సీసా ఇచ్చి శుభ్రం చేసుకోవాలన్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. పోలీసులు నన్ను కొట్టారని, భుజం నొప్పిగా ఉందని మెజిస్ట్రేట్తో చెప్పాను. మెజిస్ట్రేట్ నా అవస్థ గమనించి అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పరీక్షల కోసం పంపారు’ అని తెలిపారు.
వైద్యులనూ మేనేజ్ చేశారు..
ఆసుపత్రికి వెళ్లాక వైద్యులను పోలీసులు మేనేజ్ చేశారని వెంకటేష్ చెప్పారు. ‘నన్ను అసలు కొట్టనేలేదని, దెబ్బలేమీ తగల్లేదని డాక్టర్లకు చెప్పాలంటూ నాతో పోలీసులు అన్నారు. నాకు ఎక్కడ నొప్పిగా ఉందో డాక్టర్లకు చెబుతుంటే... ‘నువ్వు యాక్షన్ చేస్తున్నావ్’ అంటూ పోలీసులు నన్ను గద్దించారు. డాక్టర్లు కూడా... నటిస్తున్నావన్నారు. నిజంగానే నాకు చాలా ఇబ్బందిగా ఉందని పరీక్షలు చేస్తే సమస్య తెలుస్తుందని వారితో చెప్పాను. రాత్రి 12 గంటల నుంచి మర్నాడు సాయంత్రం దాకా పరీక్షల తంతు కొనసాగింది. చేసిన పరీక్షే పది సార్లు చేశారు. చివరకు ఏమీ లేదని ఫేక్ రిపోర్టును సీల్డ్ కవర్లో పెట్టి జడ్జికి పంపించారు’ అని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
సునీల్ కుమార్కు జగన్, సజ్జల జీతం ఇస్తున్నారా?: వర్ల రామయ్య
‘సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్ని పార్టీలనూ ఒకేలా ఎందుకు చూడటం లేదు? వైకాపా వాళ్లు చిన్న ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి నకిలీ పత్రికా ప్రకటన విడుదల చేయడంపై గత నెల 5న సునీల్ కుమార్కు ఫిర్యాదు ఇస్తే ఇంతవరకు కేసే నమోదు చేయలేదు. ఆయనకు జగన్గానీ, సజ్జలగానీ సొంత డబ్బులు తీసి జీతం ఇస్తున్నారా? ప్రజల సొమ్ము తీసుకుంటూ, ప్రజలకు సేవ చేయాల్సిన ఆయన అధికార పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ధ్వజమెత్తారు.
ఫోర్జరీ చేసిన వారిపై చర్య తీసుకోండి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్కు వర్ల రామయ్య శనివారం లేఖ రాశారు. వైకాపా మద్దతుదారులు జూన్ 13న, జులై 1న అచ్చెన్నాయుడి లెటర్ హెడ్ను, సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ప్రకటనలు విడుదల చేసి, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్