వారసత్వ రాజకీయాలు ప్రమాదకరం
దేశంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. పలు రాజకీయ పార్టీలు అప్రజాస్వామిక, వారసత్వ రాజకీయాలకు
దేశంలో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నం
మోదీ పాలనలో భారత్ ఎంతో ఎత్తుకు
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్షా
ఈనాడు హైదరాబాద్: దేశంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. పలు రాజకీయ పార్టీలు అప్రజాస్వామిక, వారసత్వ రాజకీయాలకు లొంగిపోవడంతో పాటు కుల, ప్రాంతీయతత్వాలను పెంచి పోషిస్తున్నాయని పార్టీ కార్యవర్గ సమావేశం పేర్కొంది. విచ్ఛిన్నకర శక్తులు, తుక్డే తుక్డే గ్యాంగ్లతో కలిసి దేశంలో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. వారసత్వ రాజకీయాల వల్ల కాంగ్రెస్ సిద్ధాంత రహిత, అవకాశవాద, అవినీతి పార్టీగా మిగిలిపోయిందని ధ్వజమెత్తింది. హైదరాబాద్లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండోరోజు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా 15 పేజీల రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న 30-40 ఏళ్లు భాజపా యుగమని వ్యాఖ్యానించారు. కర్ణాటక, అస్సాం ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, హిమంత బిశ్వశర్మ ఈ తీర్మానాన్ని బలపరిచారు. దీనిపై చర్చలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, తెరాస పాలన గురించి వివరించారు. రాజకీయ తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
అన్ని ప్రాంతాల్లో భాజపాకు ప్రజాదరణ
‘మోదీ నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వం ప్రజాద]రణ పొందుతోంది. తాజా ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. గత కొన్ని దశాబ్దాల్లో ఉత్తర్ప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గెలవడం.. పైగా మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించడం ఇదే మొదటిసారి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, పశ్చిమ నుంచి తూర్పు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భాజపాకు ప్రజల ఆశీర్వాదం లభించింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ప్రధానమంత్రి మోదీకి గతంలో సిట్ క్లీన్చిట్ ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. దీంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్షాలు, కొన్ని ఎన్జీవోలు, మేధావులుగా చెప్పుకొనే వారితో పాటు విదేశీ నిధులతో నడిచే ఓ వర్గం మీడియా కుట్రలు బయటపడ్డాయి. ఇందుకు కాంగ్రెస్, దాని అనుబంధ సంస్థలు దేశానికి క్షమాపణ చెప్పాలి. అమృతాన్ని దేవతలకు అందించేందుకు శివుడు గరళాన్ని తన కంఠంలో ఉంచుకొన్నట్లు ఈ అల్లర్ల అంశంలో మోదీ కూడా ఆ నిందను ఇంతకాలం భరించారు. గతంలో దర్యాప్తు సంస్థలన్నింటికీ మోదీ సహకరించారు. రాజ్యాంగంపై తన విశ్వాసాన్ని చాటుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతలపై అక్రమాల అభియోగాలు వస్తుంటే వారు ఆక్రోశంతో మోదీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా మోదీ నాయకత్వంలో రోజురోజుకు భారతదేశం ఎంతో ఎత్తుకు ఎదుగుతోంది. మహారాష్ట్ల్రలో అభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసమే ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందేేకు భాజపా మద్దతు పలికింది. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. అవకాశవాద, సిద్ధాంతరహిత మైత్రితో ఏర్పడిన ‘మహావికాస్ అఘాడీ’ వల్ల మహారాష్ట్రలో అభివృద్ధి స్తంభించి.. తీవ్రస్థాయిలో అవినీతి జరిగింది. భాజపా అధికారం కోసం పాకులాడదని ప్రస్తుత పరిణామాలతో మరోసారి రుజువైంది’ అంటూ రాజకీయ తీర్మానం పేర్కొంది.
దక్షిణాదిలో అధికారంలోకి రావడంపై చర్చించాం
కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ విలేఖరుల సమావేశంలో వివరించారు. ‘దేశంలో కుల, మత, కుటుంబ రాజకీయాలకు ముగింపు పలుకుతూ పనితీరు, అభివృద్ధి కేంద్ర రాజకీయాలే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తోంది. పశ్చిమబెంగాల్, తెలంగాణల్లో కుటుంబ పాలనకు తెర దించుతాం. దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికారం సాధించడంపై చర్చించాం. కీలకమైన రాజకీయ తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ముఖ్యనాయకులంతా విస్తృతంగా మాట్లాడారు. కాంగ్రెస్ వ్యవహారశైలిపైనా చర్చించాం. పూర్తి నిరాశతో ఉన్న ఆ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు, కొవిడ్ వ్యాక్సినేషన్, జీఎస్టీ, చివరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ను కూడా తప్పుపడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళను నిలబెట్టినా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. చివరకు పార్టీకి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించుకోలేకపోతోంది. ఇంటింటికీ తిరంగా కార్యక్రమంలో రాజకీయం లేదు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో రాజకీయ వేధింపులు పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దు, భారత్లో అంతర్భాగంగా జమ్మూకశ్మీర్, అగ్నిపథ్ ఏర్పాటు, సీడీఎస్ సహా పలు అంశాలపై చర్చ జరిగింది. దేశరక్షణ, ఆంతరంగిక భద్రతపై సమాలోచనలు జరిపాం. ప్రధాని మోదీ పాలనలో దేశంలో పేదరికం 22 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శకంగా మారుతోంది. దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే భాజపా లక్ష్యం. నరేంద్రమోదీ పాలనలో ఇద్దరు రాష్ట్రపతుల నియామకానికి అవకాశం రాగా.. మొదటిసారి దళితులకు, ఇప్పుడు ఆదివాసీ మహిళకు అవకాశం ఇచ్చారు.
ముర్ము జీవితంపై దృశ్యమాలిక రూపొందించాలి: ప్రధాని
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ముకు అవకాశం ఇవ్వడాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ఆమె జీవితంపై దృశ్యమాలికను రూపొందించాలన్నారు. సబ్కా సాత్... సబ్కా వికాస్ నినాదంతోనే ముందుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని తెలిపారు’ అని బిశ్వశర్మ వివరించారు. ఉదయ్పుర్, అమరావతి (మహారాష్ట్ర) ఘటనలపై స్పందిస్తూ.. దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించామన్నారు.
విజయం సాధించేదాకా విశ్రమించొద్దు
తెలంగాణ నేతలతో నడ్డా, అమిత్షా ప్రత్యేక భేటీ
తెలంగాణలో భాజపాకు మంచి వాతావరణం ఉందని.. సద్వినియోగం చేసుకుని వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్షా రాష్ట్ర నేతలకు ఉద్బోధించారు. విజయం సాధించేదాకా విశ్రమించొద్దన్నారు. పరేడ్గ్రౌండ్స్లో బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాత్రి 9.45కి ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు గంట సేపు జరిగింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, జితేందర్రెడ్డి హాజరయ్యారు. నడ్డా తర్వాత రెండోస్థానంలో ఉన్న సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ఛుగ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభతో పార్టీకి తెలంగాణలో మంచి ఊపు వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ