శత్రువు గుండెల్లో కవాతు
దేశంలోని 141 కోట్ల జనాభా నేడు నిశ్చింతగా నిద్రపోతోందంటే.. అది 14 లక్షలకు పైగా ఉన్న త్రివిధ బలగాల చలవే. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందింది.
మన సైనిక బలం అమేయం
రక్షణ రంగం పటిష్ఠం
దేశంలోని 141 కోట్ల జనాభా నేడు నిశ్చింతగా నిద్రపోతోందంటే.. అది 14 లక్షలకు పైగా ఉన్న త్రివిధ బలగాల చలవే. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందింది. స్వాతంత్య్రం దక్కిన నాడు దేశమంతా అనేక సంస్థానాలుగా ముక్కలు చెక్కలుగా మిగిలింది. విభజన గాయం ప్రజలనూ విడదీసింది. అంతటి విపత్కర పరిస్థితిలో దేశ ఐక్యతకు చిహ్నమై నిలిచింది మన సైన్యమే. అదే... సంస్థానాలను కలిపింది. కశ్మీర్ను కాపాడుకుంది. పాకిస్థాన్, చైనాలతో జరిగిన అయిదు యుద్ధాల్లో దేశాన్ని రక్షించింది.
2
చైనా తర్వాత అతిపెద్ద మిలిటరీ మనదే
3
రక్షణ రంగ కేటాయింపుల్లో భారత్ ర్యాంకు
4
సైనిక సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత దేశ స్థానం
సహనం, సాత్వికం, సమోన్నత సాంస్కృతిక నేపథ్యమున్న భారత్ది మొదటి నుంచీ కయ్యానికి కాలు దువ్వే స్వభావం కాదు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు సమర్థ విదేశాంగ విధానం, పరిపక్వత చెందిన దౌత్యమే దేశానికి బలమైన రక్షణ విధానమని నమ్మారు. పంచశీలను వంచించి, చైనా చేసిన దాడితో ఆ నమ్మకాలు వమ్మయ్యాయి. ఫలితంగా... సైనిక దళాలను దేశ దౌత్య లక్ష్యాలు, భౌగోళిక ఆకాంక్షలకు అనుగుణంగా మార్చడం మొదలైంది. నాటి నుంచి మన సైన్యం ఒక్కో అడుగేస్తూ అమేయశక్తిగా రూపుదిద్దుకుంది. స్వాతంత్య్ర అమృతోత్సవాలను నిర్వహించుకుంటున్న నేపథ్యంలో రక్షణ పరంగా ఇప్పటి వరకు సాధించిన విజయాలు, రానున్న 25 ఏళ్లలో చేరుకోవాల్సిన మైలురాళ్లపై ప్రత్యేక కథనం..
రాటుదేలిన రణసేన
దేశ రక్షణ, భద్రతా సవాళ్లను అధిగమిస్తూ మున్ముందుకు
ఆయుధాలను కొనుగోలు నుంచి అమ్మేస్థాయికి...
నవ్యపథంలో ఇండియన్ డిఫెన్స్
స్వతంత్ర భారత ప్రస్థానంలో త్రివిధ సాయుధ దళాల విజయాలు, త్యాగాలు చిరస్మరణీయం. పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు తలెత్తినా మన సైన్యం అద్భుత పోరాట పటిమ కనబరిచింది. భద్రత విషయంలో ఇంటాబయటా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధవిమానాలు, సముద్రజలాల్లో సత్తాచాటే యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూతలంపై శత్రు లక్ష్యాలను ఛేదించే యుద్ధ ట్యాంకులు, క్షిపణుల వంటి అత్యాధునిక ఆయుధాలతో అమ్ములపొదిని శక్తిమంతం చేసుకుంటోంది. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా... ప్రత్యర్థుల కంటే మేటిగా, అగ్రరాజ్యాలకు దీటుగా ఆయుధాల తయారీకి సమకట్టింది. ఆత్మనిర్భరతను సాధించి, ప్రపంచంలోనే ధీరోదాత్త సేనగా నిలవడమే లక్ష్యంగా త్రివిధ దళాలు సమాయత్తమవుతున్నాయి. ఈ గమ్యాన్ని చేరుకునేందుకు రక్షణ రంగం వచ్చే పాతికేళ్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? తదుపరి ప్రస్థానం ఎలా సాగాలి..?
1950 కొరియా యుద్ధంలో భారత దళాలు వైద్యసాయం అందించాయి. ఐరాస ఇప్పటివరకూ నిర్వహించిన 71 శాంతి రక్షక కార్యకలాపాల్లో భారత్ 49 సార్లు సేవలు అందించింది. సుమారు 2 లక్షల మంది భారత సైనికులు పాల్గొన్నారు.
ఆదిలోనే పోరుబాట
స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలోనే భారత సైనిక ప్రయాణం యుద్ధాలతో ఆరంభమైంది. 1948లో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ను, 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ పాలనలోని గోవా, దీవు దమణ్లను అంతర్భాగాలుగా చేసుకోగలిగాం. జమ్మూకశ్మీర్, జునాగఢ్ సంస్థానాల విలీనానికీ సైన్యం అండగా నిలిచింది.
* 1947 అక్టోబరులో పాక్ సైన్యం అండతో కొన్నిశక్తులు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. మహారాజా హరిసింగ్ అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన భారత సేనలు పాకిస్థాన్ సేనలను తిప్పికొట్టాయి. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా జమ్మూకశ్మీర్కు చెందిన మూడోవంతు భూభాగం పాక్ చేతుల్లో ఉండిపోయింది. దీన్నే పాక్ ఆక్రమిత కశ్మీర్గా పిలుస్తున్నాం. ఈ యుద్ధ పరిణామాలు నేటికీ రెండుదేశాల భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
* సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా 1962లో యుద్ధానికి దిగింది. సరైన సన్నద్ధత కొరవడటంతో భారత్ వైఫల్యం చవిచూడాల్సి వచ్చింది. డ్రాగన్ దండయాత్ర మనకు అనేక పాఠాలు నేర్పింది. దీంతో లాల్బహదూర్ శాస్త్రి... సోవియట్ యూనియన్ సహకారంతో రక్షణ రంగం ఆధునికీకరణకు బాటలు వేశారు.
* 1965లో ఆధునిక ఆయుధాలతో దురాక్రమణకు దిగిన పాకిస్థాన్ను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. తొలిసారి మన వాయుసేన రంగంలోకి దిగి పాక్ స్థావరాలను నేలకూల్చింది.
* తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) విమోచన నిమిత్తం భారత్-పాకిస్థాన్ల మధ్య 1971లో యుద్ధం చోటుచేసుకుంది. పాక్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
* 1999లో పాక్ సైనికులు గొర్రెల కాపరుల ముసుగులో కార్గిల్, లద్దాఖ్ పర్వత శిఖరాలను ఆక్రమించారు. భారత్ నుంచి సియాచిన్ను వేరుచేయాలన్న కుట్రను ఇండియా చిత్తుచేసింది.
* 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన చైనా దళాలనూ భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది.
పాకిస్థాన్తో భారత్ నాలుగు యుద్ధాలు చేసింది. వాటిలో 1999 నాటి కార్గిల్ యుద్ధం... ప్రపంచంలోనే అత్యంత ఎత్తున జరిగిన సమరంగా చరిత్రకెక్కింది.
అంకుర పరిశ్రమల భాగస్వామ్యంతో దేశ రక్షణ, భద్రతను బలోపేతం చేసేందుకు... కేంద్ర ప్రభుత్వం ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్’ కార్యక్రమం చేపట్టింది.
ఎన్నో ఆపరేషన్లు...
పాకిస్థాన్, మయన్మార్లలోని ఉగ్రవాదుల స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. స్వదేశంలో తీవ్రవాదులపై పోరాటం, ఖలిస్థాన్వాదులపై ఆపరేషన్ బ్లూస్టార్, సియాచిన్లో పాక్ పీచమణచడం, శ్రీలంకలో భారత శాంతిసేన కార్యకలాపాలు, యెమెన్ నుంచి భారతీయుల తరలింపు వంటి క్లిష్టమైన సవాళ్లను మన బలగాలు సమర్థంగా చేపట్టాయి.
* ఆత్మనిర్భర్ భారత్ సాకారానికి కేంద్రం ‘అగ్నిపథ్’ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద సాయుధ బలగాల్లో నాలుగేళ్లపాటు సేవలు అందించేందుకు యువతను నియమిస్తుంది.
* చైనా, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3,595 కి.మీ. రహదారులను రూ.20,767 కోట్లతో భారత్ నిర్మిస్తోంది.
* అమెరికా యుద్ధనౌక యూఎస్ఎన్ఎస్ ఛార్లెస్ డ్రూ... మరమ్మతుల కోసం ఇటీవల చెన్నై చేరుకుంది. అగ్రరాజ్య నేవీ షిప్ మన దేశంలో మరమ్మతులు చేయించుకోవడం ఇదే మొదటిసారి.
‘భారత్లో తయారీ’తో ఊపు...
‘మన ఆయుధాలను మనమే తయారు చేసుకుందాం. వాటిని మరొకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం’ అనే నినాదంతో భారత్ కొత్త అడుగులు వేస్తోంది. శత్రుదేశాల కంటే దీటుగా, అగ్రదేశాలకు పోటీగా నవతరం ఆయుధాల తయారీలో ముందడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తదితర సంస్థలు ఈ క్రతువులో నిమగ్నమయ్యాయి.
* రష్యా నుంచి కొనుగోలుచేసిన టి-53, టి-72, టి-90 యుద్ధట్యాంకులు ఉండగా... ‘కర్ణ’ పేరుతో అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారీదశలో ఉన్నాయి.
* పైలట్ రహిత యుద్ధ విమానాలు నిషాంత్, లక్ష్య, రుస్తుంను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం తదితర యుద్ధనౌకలు దేశరక్షణలో నిమగ్నమయ్యాయి.
* విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్ ‘ఐఎన్ఎస్ అరిహంత్’ జలాంతర్గామిని నిర్మించి... భారత్ను అణు జలాంతర్గాములున్న ఆరో దేశంగా నిలిపింది.
* సూపర్ సోనిక్ బ్రహ్మోస్-1 క్షిపణిని రష్యా సహకారంతో మన దేశం సిద్ధం చేసింది.
స్వదేశీ తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు పలుదేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ‘రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక విధానం-2020’ కింద 2025 నాటికి 25 బిలియన్ డాలర్ల (రూ.1,97,658 కోట్ల) ఉత్పత్తి సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్తగా సన్నద్ధం కావాలి
* చైనా, పాకిస్థాన్ల రూపంలో దేశానికి ముప్పు ఉన్నందున ఆయుధాల తయారీని మరింత ముమ్మరంగా చేపట్టాలి.
* విదేశాలకు భారీగా ఆయుధాలను ఎగుమతిచేసే దశకూ చేరుకోవాలి. తదుపరితరం అస్త్రశస్త్రాల రూపకల్పన విషయంలో అగ్రదేశాలతో పోటీపడాలి. ఆ తరహా ఆయుధాలకు భారత్ హబ్గా మారాలంటే, పరిశోధనలు ఊపందుకోవాలి. రక్షణ పరిజ్ఞానాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు గణనీయంగా పెరగాలి.
* అస్త్రాల సమీకరణకు ప్రస్తుతం ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రక్రియను సరళీకరించి, వేగవంతం చేయాలి.
* త్రివిధ దళాలను ఏకతాటిపైకి తెచ్చే ‘థియేటరైజేషన్’ను వేగంగా పూర్తిచేయాలి.
* భావితరం ఆయుధాలైన మానవరహిత యుద్ధ వ్యవస్థలు, మూకదాడి చేసే స్వార్మ్ డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, స్మార్ట్ అస్త్రాలు, హ్యాకింగ్కు తావులేని కమ్యూనికేషన్ వ్యవస్థలను సముపార్జించాలి. సైబర్, అంతరిక్ష యుద్ధాలకు సిద్ధపడాలి. ఇందుకు కృత్రిమమేధ, క్వాంటమ్, హైపర్ సోనిక్, టెరాహెర్జ్, కాగ్నిటివ్, రోబోటిక్స్, స్మార్ట్ పదార్థాల వంటి అధునాతన పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెంచాలి.
* త్రివిధ దళాల్లో కాలం తీరిన, ప్రస్తుత సాంకేతికలతో కూడిన, భవిష్యత్ తరానికి చెందిన ఆయుధాలు ఒక్కో వంతు చొప్పున ఉండేలా చర్యలు తీసుకోవాలి.
సాంకేతికంగా సన్నద్ధం కావాలి...
‘‘భవిష్యత్తు యుద్ధాలన్నీ అత్యున్నత సాంకేతిక యుద్ధభూమిలోనే జరుగుతాయి. ఇందుకు త్రివిధ దళాలు సైబర్ యుద్ధ నైపుణ్యాలను గణనీయంగా పెంచుకోవాలి. సంయుక్త ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు రంగంలో రక్షణ పరిశోధనలనూ ప్రోత్సహించాలి. దేశీయ సామర్థ్యంతో నౌకా దళాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని’’ భారత శతఘ్ని విభాగం మాజీ డైరెక్టర్ జనరల్.. లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) కేఆర్ రావు అన్నారు.
* ‘నెగెటివ్ లిస్ట్’ పేరున కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆయుధ వ్యవస్థలు, ఉపవ్యవస్థల దిగుమతిని నిషేధిస్తోంది. వాటిని పూర్తిస్థాయిలో దేశీయంగా, లేదంటే విదేశీ భాగస్వామ్యంతో తయారు చేసుకునే కసరత్తును త్వరితగతం చేయాలి.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM