గవర్నర్‌కు జాతీయ పతాకాన్ని బహూకరించిన తపాలా శాఖ

ఘర్‌ ఘర్‌ కా తిరంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు బహూకరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా

Published : 13 Aug 2022 05:10 IST

ఈనాడు, అమరావతి: ఘర్‌ ఘర్‌ కా తిరంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు బహూకరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖులకు త్రివర్ణ పతాకాన్ని అందజేసే బాధ్యతను తపాలా శాఖ ముఖ్యులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఆదిత్య కుమార్‌ నాయక్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి జాతీయ పతాకాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని