పదోన్నతుల పోస్టింగుల్లో అక్రమాలకు తావులేదు

పదోన్నతులు పొందిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు(ఎంపీడీవో)ల పోస్టింగుల్లో అక్రమాలకు తావులేదని రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.బ్రహ్మయ్య, జీవీ

Published : 15 Aug 2022 05:12 IST

ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వెల్లడి

ఈనాడు, అమరావతి: పదోన్నతులు పొందిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు(ఎంపీడీవో)ల పోస్టింగుల్లో అక్రమాలకు తావులేదని రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.బ్రహ్మయ్య, జీవీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పదోన్నతులు, పోస్టింగ్‌లు పారదర్శకంగా జరిగాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అవకతవకలు జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండిస్తున్నామని చెప్పారు. గ్రూపు-1 ద్వారా నియమితులై ఎంపీడీవోలుగా దాదాపు 25 ఏళ్లపాటు అదే పోస్టులో కొనసాగుతూ.. ఒక్క పదోన్నతికి కూడా నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం రెండు రోజుల క్రితం పదోన్నతులు కల్పించిందని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని