అడ్డొస్తే అంతమే
‘మేం చెప్పిందే జరగాలి.... అడ్డొస్తే అంతమొందిస్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి... మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’
అధికార పార్టీలోకి వస్తే సరే.. లేదంటే అంతే..
ఆధిపత్యం కోసం ప్రత్యర్థులపై దాడులు..హత్యలు
గ్రామాలు వీడుతున్న ప్రతిపక్ష నాయకులు
వ్యక్తిగత, పాతకక్షలేనని తేల్చేస్తున్న పోలీసులు
‘మేం చెప్పిందే జరగాలి.... అడ్డొస్తే అంతమొందిస్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి... మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’
పల్నాడులో వైకాపా నేతల నుంచి పలువురికి నిత్యం ఎదురవుతున్న బెదిరింపులివి.
ఈనాడు-అమరావతి: గ్రామాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను తమవైపు రావాలని బెదిరించటం.. వినకపోతే వారిపై అక్రమ కేసులు బనాయించడం.. అప్పటికీ లొంగకపోతే దాడులు, హత్యలు చేసే విష సంస్కృతి పల్నాడు జిల్లాలో గత మూడున్నరేళ్లుగా అమలవుతోంది. తమ ఆధిపత్యానికి అడ్డుగా ఉంటున్నారనుకున్న వారిని వైకాపా కార్యకర్తలు అంతమొందిస్తున్నారు. వీరికి ఆ పార్టీ మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల అండదండలు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఈ అరాచక ధోరణి పెరుగుతోంది.
వైకాపా ప్రమేయం లేదని చెప్పడానికే పోలీసులు పరిమితం
గ్రామాల్లో బలంగా ఉండే ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా ఈ హత్యలన్నీ ఒక దాని తర్వాత మరొకటి ప్రణాళిక ప్రకారం సాగుతున్నా.. పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడులు, హత్యలు జరిగితే.. అవి వ్యక్తిగత, పాత కక్షలతోనే జరిగాయని... రాజకీయాలతో సంబంధం లేదని వెనువెంటనే ప్రకటించేస్తున్నారు. కనీస దర్యాప్తు కూడా లేకుండానే ఆ హత్యలు, దాడులతో అధికార పార్టీకి సంబంధం లేదంటూ తేల్చేస్తున్నారు. ఒకటి, రెండు రోజులు నిందితులను పట్టుకుంటున్నామంటూ హడావుడి చేసి ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తు పక్కనపెట్టేస్తున్నారు. దాడులు, హత్యలకు పాల్పడుతున్నవారికి వైకాపా నాయకుల అండదండలుంటున్నా వారి ప్రమేయంపై విచారణలు ఉండట్లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చెబుతున్నా..వారి రక్షణకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. దీంతో గ్రామాల్లో అధికారపార్టీని ఎదిరిస్తే ప్రాణాలకే ముప్పు వస్తుందన్న ఆందోళన ప్రతిపక్షాల కార్యకర్తల్లో నెలకొంది. కొందరైతే గ్రామాలు వదలివెళ్లి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతున్నా దాన్ని పోలీసులు నియంత్రించలేక పోతున్నారు. తాజాగా రొంపిచర్ల మండల తెదేపా నాయకుడు వెన్నా బాలకోటిరెడ్డిపై తుపాకీతో దాడి జరిగింది. గతంలోనూ ఆయనపై హత్యాయత్నం జరిగినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఇవన్నీ పోలీసుల వైఫల్యానికి నిదర్శనాలన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పల్నాడులో పట్టపగలే హత్యలు
దశాబ్ద కాలంపాటు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఇటీవల కాలంలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక, రాజకీయపరమైన కారణాలతోపాటు ఆధిపత్యం కోసం హత్యలు, దాడులు జరుగుతున్నాయి. తుపాకులు సైతం కొని ప్రత్యర్థులపై దాడిచేసే స్థితికి ఎదిగారు. ఇది పల్నాడు ప్రగతికి అడ్డంకిగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొన్ని ఘటనలు ఇలా..
* వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో తెదేపా నాయకుడు చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ ఎంపీపీ శివరామయ్య, తనయుడు ఆదినారాయణతోపాటు మరికొందరు పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామ నడిబొడ్డున గొంతుకోసి హత్యచేశారు. ఈ కేసులో అరెస్టు అయిన వారు బెయిల్పై బయటకు వచ్చారు.
* దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను వైకాపాకు చెందిన నాయకులు పట్టపగలు గ్రామం ప్రధాన రహదారిపై దాడిచేసి హత్యచేశారు. ఈ గ్రామంలో తెదేపా సానుభూతిపరులైన 50 కుటుంబాలు ఇప్పటికీ గ్రామం విడిచిపెట్టి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నాయి. వీరి పొలాలు బీడుగా మారాయి.
* గురజాల మండలం అంబాపురంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తెదేపా కార్యకర్త విక్రమ్ను అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు హత్యచేశారు. గురజాల పోలీసుస్టేషన్ నుంచి ఇంటికి వెళుతుండగా రాత్రి 8.30గంటల సమయంలో గ్రామంలోనే దాడిచేసి మట్టుబెట్టారు.
* దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన మాజీ సర్పంచి, తెదేపా నేత పురంశెట్టి అంకుల్ దాచేపల్లిలో హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నేత ఒకరు హత్యలో కీలకపాత్ర పోషించారు. దాచేపల్లిలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం వద్దకు రావాలని పిలిచి గొంతుకోసి హత్యచేశారు.
* నరసరావుపేటలో ఇటీవల మసీదు స్థలం వివాదంలో తెదేపాకు చెందిన ఇబ్రహీంను జనసంచారంలోనే వైకాపా వాళ్లు కత్తులతో దాడి చేసి హతమార్చారు.
* పిడుగురాళ్ల పట్టణ శివారులో తుమ్మలచెరువుకు చెందిన తెదేపా కార్యకర్త షేక్ సైదాను వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడిచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇక్కడి పరిస్థితిని అద్దంపట్టింది.
* మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా వారిపై వైకాపా వారు దాడులకు తెగబడ్డారు. అప్పట్లో గ్రామాలు వదిలివెళ్లిన 50 కుటుంబాలవారు ఇప్పటికీ బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. తురకపాలెంలో తెదేపా కార్యకర్త ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే గ్రామంలో తెదేపా సానుభూతిపరులకు చెందిన నలుగురి గడ్డివాములు తగలబెట్టారు. కొత్తగణేశునిపాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా వారు దాడి చేసి కొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి వీడలేదు
పోలింగ్ రోజు సమీపిస్తున్నా కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ మండిపడ్డారు. -
పోలీసులకు ఓటుహక్కు విషయంలో వివరాలు సమర్పించండి
మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ పోలీసులు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
జగన్ను విదేశీ పర్యటనకు అనుమతించొద్దు
అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విదేశాలకు వెళ్లడానికి అనుమతించవద్దని హైదరాబాద్ సీబీఐ కోర్టును గురువారం సీబీఐ కోరింది. -
సంక్షిప్త వార్తలు
జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని, ఎండీయూ వ్యవస్థలను ప్రవేశపెట్టి 29,500 మంది డీలర్ల కుటుంబాలను వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
వైకాపా హయాంలో ఉపాధ్యాయుల బతుకులు దుర్భరం!
ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం... పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. -
‘షెడ్డు దక్కలేదు..’ పొట్టేలు చిక్కలేదు!
పొట్టేళ్లు చిక్కలేదు.. గొర్రెల యూనిట్లు దక్కలేదు.. షెడ్ల మంజూరును అటకెక్కించారు.. రాయితీ రుణాలు ఎత్తేశారు.. కనీసం బీమా పరిహారం ఇవ్వడానికి కూడా మనసు రాలేదు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు