మూడు వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపాం
కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) కింద 2020లోనే ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ తెలిపారు.
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) కింద 2020లోనే ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ తెలిపారు. ఎంపీలు మిథున్రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వంగా గీత, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఈ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు, 11 కళాశాలల్లో 1,040 పీజీ సీట్ల పెంపునకు ఆర్థిక సహాయం చేశామన్నారు. పీఎం స్వాస్థ్య సురక్షా యోజన కింద మూడు వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ల ఏర్పాటుకు చేయూతను ఇచ్చామన్నారు. జననీ సురక్ష యోజన కింద ఆంధ్రప్రదేశ్ 2019-22 మధ్య రూ.61.99 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. ఈమేరకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* విశాఖపట్నం-కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేయదల్చిన పెట్రో కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్కు (పీసీపీఐఆర్) సంబంధించి హెచ్పీసీఎల్, గెయిల్ చేసిన ముందస్తు సాధ్యత అధ్యయనం పూర్తి కాలేదని కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ తెలిపారు. రాజమహేంద్రవరం, అనకాపల్లి ఎంపీలు మార్గాని భరత్, బీశెట్టి సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రధాన యూనిట్ ఎక్కడ పెట్టాలి, దాని సామర్థ్యంపై తుది నిర్ణయానికి వస్తే మాస్టర్ ప్లాన్ ఖరారవుతుందని, తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ఆ ప్రాంతంలో మౌలిక వసతులు, ఇళ్లు, ప్రజల జీవనోపాధిపై పీసీపీఐఆర్ ప్రభావం, పర్యావరణ సమస్యలపై అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం 2008లోనే పీసీపీఐఆర్-ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
* నంద్యాల జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద జనఔషధ కేంద్రాల ఏర్పాటుకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించినట్లు కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ తెలిపారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* ఆంధ్రప్రదేశ్లోని పిల్లల రక్షణ కేంద్రాలకు వాత్సల్య పథకం కింద 2022-23లో రూ.19.76 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలోని పిల్లల సంరక్షణ కేంద్రాల్లో 2021-22 నాటికి 3,069 మంది పిల్లలు ఉన్నారన్నారు.
* సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టులో కనెక్టెవిటీ రోడ్డుకు రూ.23.17 కోట్లు, జువ్వలదిన్నె పోర్టులో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి రూ.72 కోట్లు, కోస్తా జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధికి రూ.5.98 కోట్లు, కాకినాడ పోర్టు యాంకరేజ్కు రూ.42.92 కోట్లు, భవానీ ద్వీపంలో పర్యాటక పనులకు రూ.పది కోట్లు, విశాఖపట్నం పోర్టు నుంచి ఎన్హెచ్-5 అనుసంధాన రోడ్డుకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వివరించారు. వీటితోపాటు విశాఖపట్నం పోర్టులో కోస్టల్ బెర్తుకు రూ.30 కోట్లు, విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మారిటైమ్ షిప్బిల్డింగ్కు రూ.37.52 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ ఫేజ్-1కు రూ.28 లక్షలు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు ఇచ్చామన్నారు. ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీలో వరి రైతులకు తగ్గిన చెల్లింపులు
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ధాన్యం సేకరించిన రైతులకు చేస్తున్న చెల్లింపులు రెండేళ్లుగా తగ్గాయి. 2020-21 ఖరీఫ్, రబీ రెండింటిలో కలిపి రూ.15,199 కోట్లు చెల్లించగా... 2021-22లో అది రూ.14,819 కోట్లకు తగ్గింది. 2022-23 రబీ, ఖరీఫ్ సీజన్లలో (జనవరి 23నాటికి) రూ.9,871 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆహార రాయితీ కింద ఆంధ్రప్రదేశ్కు గత ఆరేళ్లలో రూ.39,842.86 కోట్లు ఇచ్చామని, రాష్ట్రం నుంచి సేకరించిన బియ్యానికి ఎఫ్సీఐ 25,855.57 కోట్లు చెల్లించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!