కుక్కలున్నాయ్.. పిక్కలు జాగ్రత్త!
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి.
పట్టణం నుంచి పల్లెల వరకు వీధిశునకాల బెడద
పలు జిల్లాల్లో కానరాని ‘నియంత్రణ’ చర్యలు
గతేడాది కుక్కకాట్లలో దేశంలో మూడో స్థానంలో ఏపీ
ఈనాడు, అమరావతి
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి. సమస్యాత్మకమైన శునకాలను గుర్తించి ప్రత్యేక సంరక్షణ శిబిరాలకు తరలించడం వంటి విషయాలను పుర, నగరపాలక సంస్థలు పక్కన పెట్టేశాయి. కుక్కల దాడిలో పిల్లలు మరణించడం, తీవ్రంగా గాయపడడం వంటి విషాద ఘటనలు జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తుంటారు. హైదరాబాద్లోని బాగ్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పిల్లలు మృతి చెందాయి.
రాష్ట్రంలో సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు తగ్గించడంతో వీధి శునకాల సంఖ్య పెరుగుతోంది. 2022లో దేశంలో అత్యధికంగా కుక్కకాట్లు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు గత ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అత్యధికంగా 3,46,318 కుక్కకాట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో, 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 1,69,378 కుక్కకాటు కేసులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో 4.50 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. వీటిలో అత్యధికంగా 3.20 లక్షల కుక్కలు నగరాలు, పట్టణాల్లో ఉంటున్నాయి. ఆర్థిక వనరులు పరిమితంగా ఉండటం, సిబ్బంది కొరతతో పంచాయతీ కారణంగా సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయడం లేదు.
ఆపరేషన్లు చేస్తున్నా ఎందుకు పెరుగుతున్నాయి?
రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థలు, 25 పురపాలక, నగర పంచాయతీల్లో శునకాలకు విధిగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరపాలక సంస్థల్లో ఏటా ఇందుకోసం రూ. 1-2 కోట్లు వెచ్చిస్తున్నట్లు లెక్క చూపిస్తున్నారు. అయినా కుక్కల సంఖ్య ఎందుకు పెరుగుతుందన్నది ప్రశ్న. ఉదాహరణకు విజయవాడ నగరపాలక సంస్థలో గత ఐదేళ్లలో వీటి సంఖ్య 16 వేల నుంచి 20 వేలకు పెరిగినట్లు అంచనా. విశాఖలో 85,000 నుంచి 1,10,000కి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలులోనూ శునకాలు పెరిగిన విషయాన్ని అధికారులే అంగీకరిస్తున్నారు. పరిసర గ్రామాల్లోని కుక్కలు నగరాలు, పట్టణాల్లోకి రావడం, కొందరు తీసుకొచ్చి విడిచి పెట్టడంతో వాటి సంఖ్య పెరుగుతోందని చెప్పడం విశేషం.
ఫిబ్రవరి-ఆగస్టు మధ్యే ఎక్కువ సమస్య
ఏటా ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమి, ఆహారం కొరత వంటి కారణాల వల్ల వీధి కుక్కలు అసహనానికి గురై ప్రజలపై దాడులు చేస్తుంటాయని పశు వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కాలంలో వీధి కుక్కలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటున్నారు. ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు జాగ్రత్త వహించాలని తెలిపారు. వాటిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ కూడదని పశువైద్యాధికారి ఎన్.కిశోర్ సూచించారు.
* ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలోని కడప నగరంలో, పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్ జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలోనూ వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు నిలిపి వేశారు.
* అనంతపురంలో రెండేళ్లుగా ఆపరేషన్లు చేయడం లేదు.
* విజయవాడలో రెండేళ్ల తర్వాత గత ఏడాది మార్చి నుంచి మళ్లీ మొదలు పెట్టారు.
* విశాఖ, నెల్లూరు, తిరుపతి, కాకినాడలో రోజూ 20-30 శునకాలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.
* ద్వితీయ, తృతీయ శ్రేణి పురపాలక సంఘాల్లోనూ విధిగా శస్త్ర చికిత్సలు చేయాలన్న ఆదేశాలున్నా అమలు కావడం లేదు.
* ఒక్కో శునకానికి శస్త్ర చికిత్స కోసం రూ. 700-900 వరకు ఖర్చవుతుందని అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!