Adimulapu Suresh: మంత్రి గుసగుసల మర్మమేంటి?
అప్పటికే అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నల్ల టీ షర్ట్ వేసుకుని మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన వెనక ప్లకార్డులు, నల్ల బెలూన్లు, నల్ల జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మోహరించి ఉన్నారు.
అదనపు ఎస్పీ శ్రీధర్తో ఆదిమూలపు సురేష్ మంతనాలు
ఆ తర్వాత చంద్రబాబుపై రాళ్లదాడి
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్, ఒంగోలు-న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం: అప్పటికే అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నల్ల టీ షర్ట్ వేసుకుని మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన వెనక ప్లకార్డులు, నల్ల బెలూన్లు, నల్ల జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మోహరించి ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా, పరుషమైన మాటలతో నినాదాలు చేస్తూ... రెచ్చగొడుతున్నారు. ఇంతలో మంత్రి సురేష్ దగ్గరకు ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్) శ్రీధర్రావు వచ్చారు. మంత్రి సురేష్ ఆయనతో మాట్లాడుతూ.. ‘కుడివైపునే కదా... రాంగ్ సైడు కాదు కదా! ’’ అంటూ ఏదో మాట్లాడారు. ఇంతలో ఎవరో... ‘ఇటే ఎడమ వైపే’ అని సమాధానం ఇచ్చారు. ‘సరే పక్కా’ అంటూ... అదనపు ఎస్పీ చెవిలో మంత్రి సురేష్ ఏదో చెప్పారు. ఆ వెంటనే వెనకున్న వైకాపా శ్రేణులు మరోసారి పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సభలకు మహిళలు ఎవరైనా నల్లరంగు చున్నీలు వేసుకుని వచ్చినా అడ్డుకుని, వాటిని తీసేసిన తర్వాతే సభలోకి అనుమతించే పోలీసులు... ఇక్కడ మాత్రం మంత్రి సురేష్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు ఎటు చూసినా నల్లటి బెలూన్లు, నల్ల జెండాలు పట్టుకుని, నల్ల చొక్కాలు వేసుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చోద్యం చూశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం చంద్రబాబు పర్యటన సందర్భంగా... ఆయన కాన్వాయ్పై వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేయడానికి ముందు చోటు చేసుకున్న ఘటన ఇది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... పోలీసుల వ్యవహారశైలిపై వివిధ వర్గాల నుంచీ విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో చూస్తుంటే... ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి మంత్రి సురేష్ పోలీసులతో మంతనాలు జరిపారా? ఇలా చేయండంటూ సూచనలిచ్చారా? చంద్రబాబు కాన్వాయ్కి సంబంధించి ఏమైనా ఆరా తీశారా? లేదా ఇలా చేద్దామని మంత్రి, అదనపు ఎస్పీ కూడబలుక్కున్నారా? వంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం వచ్చినప్పుడు నిరసన తెలియజేసేందుకు మంత్రి సురేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే సన్నాహాలు జరుగుతున్నాయన్న విషయం పోలీసులకు తెలుసు. తెదేపా నాయకులు స్వయంగా జిల్లా ఎస్పీ దృష్టికి ఆ విషయం తీసుకెళ్లారు. అయినా వారు ఏ చర్యలు తీసుకోలేదు.
నియంత్రించాల్సింది పోయి.. తలాడిస్తూ..
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు కార్యక్రమం అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదు. అంతకు ముందు రెండు రోజుల నుంచి జరుగుతోంది. శుక్రవారం మూడో రోజు..! మంత్రి సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబుకి నిరసన తెలపాలన్నది ముందుగా ప్రకటించిన కార్యక్రమం కాదు. ఆ రోజుకి ఆరోజే నిర్ణయం తీసుకున్నారు. పైగా చంద్రబాబు జడ్ప్లస్ సెక్యూరిటీలో ఉన్న నేత, మాజీ ముఖ్యమంత్రి. ఉద్రిక్తతలు తీవ్రమై... వైకాపా, తెదేపా కార్యకర్తలు ఘర్షణలకు దిగితే, పరస్పరం దాడులకు పాల్పడితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉండేవి..! ఆ మాత్రం పోలీసులకు తెలీదా? వారు నియంత్రించాల్సింది ఎవర్ని? అప్పటికప్పుడు నిరసనలకు సిద్ధమై, ఉద్రికత్తలు రెచ్చగొడుతున్న వైకాపా వర్గాల్ని కదా? వారిని భయపెట్టో, బెదిరించో, నచ్చజెప్పో అక్కడి నుంచి పంపించేసి, ఉద్రిక్తతల్ని చల్లబరిచి, చంద్రబాబు పర్యటన సాఫీగా జరిగేలా చూడాలి కదా..! అవేమీ చేయకుండా.. అదనపు ఎస్పీ శ్రీధర్రావు మంత్రి సురేష్ దగ్గరికి వెళ్లి మాట్లాడం, ఆయనేదో చెవిలో చెప్పడం... ఆయన చెప్పిన దానికి అదనపు ఎస్పీ తలాడించడం... ఇదంతా చూస్తుంటే జరగబోయే పరిణామాల గురించి పోలీసులతో మంత్రి సురేష్ ముందుగానే మంతనాలు జరిపినట్టుగా, అంతా తెలిసే పోలీసులు చేతులు కట్టుకుని కూర్చున్నట్టుగా అనిపిస్తోందని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. పోలీసులు మంత్రితో మాట్లాడి వెళ్లిన తర్వాత... వైకాపా శ్రేణులు మరింత రెచ్చిపోవడం, మంత్రి సురేష్ చొక్కా విప్పి మరీ సవాళ్లు చేయడం, చంద్రబాబు కాన్వాయ్పైకి వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడం వంటి ఘటనలన్నీ ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగాయని, అంతా తెలిసీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్షోలో పాల్గొనేందుకు వస్తున్న చంద్రబాబుకు కాకుండా.. ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రహదారికి ఇరువైపులా నిలిచిన వైకాపా శ్రేణులకు పోలీసులు రోప్ పార్టీని రక్షణగా నిలపడం చర్చనీయాంశమైంది. ఈ సమయంలో రోడ్డుపై చంద్రబాబు వాహనానికి ముందుగా వస్తున్న వారిపై సీఐ స్థాయి అధికారులు పలుమార్లు దురుసుగా వ్యవహరించారు. ఈ రాళ్ల దాడిలో తమ కమాండెంట్ గాయపడిన ఉదంతంపై ఎన్ఎస్జీ ఉన్నతాధికారులూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..