తెలుగుజాతి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్
తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్ శక పురుషుడు అని శ్లాఘించారు.
శత జయంతి వేడుకల్లో కొనియాడిన వక్తలు
విజయవాడ సాంస్కృతికం, న్యూస్టుడే: తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్ శక పురుషుడు అని శ్లాఘించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ నటనా కౌశలం అపూర్వమని, నర్తనశాల సినిమా కోసం వెంపటి చినసత్యం వద్ద నాట్యం నేర్చుకున్నారన్నారు. మరో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయగా... ఆ తర్వాత వచ్చిన పాలకులు వాటికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఎన్టీఆర్ పథకాలను సక్రమంగా అమలు చేసి ఉంటే రాష్ట్రంలో పేదరికం ఏనాడో పోయేదన్నారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవుల కోసం కాకుండా సమాజ మార్పునకు ఎన్టీఆర్ కృషి చేశారని చెప్పారు. అలాంటి మహోన్నతుడి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తొలగిస్తుంటే.. ప్రజల నుంచి సరైన రీతిలో వ్యతిరేకత రాకపోవడం బాధాకరమన్నారు. తన కుమారుడు ఓ రాజకీయపార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నా సరే.. తాను స్పందించానని, ప్రభుత్వ చర్య సరైనది కాదని చెప్పానని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని కాపాడేందుకు మళ్లీ ఎన్టీఆర్ వస్తే బాగుండు: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు నేటికీ భారతరత్న ఇవ్వలేదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు దివి నుంచి భువికి మళ్లీ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ స్వాభిమానం నందమూరి తారక రామం... అంటూ గజల్ను ఆలపిస్తూ ఎన్టీఆర్ నట వైభవం, వ్యక్తిత్వం, పాలనా దక్షతను గజల్ శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమానికి ఉడా మాజీ ఛైర్మన్ తూమాటి ప్రేమ్నాథ్ అధ్యక్షత వహించగా కార్యదర్శి గుత్తికొండ శ్రీరామ్ నిర్వహించారు. పలువురు వక్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ‘ఎన్టీఆర్ ఫౌండేషన్’ను ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయ జమ్మాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత మలినేని నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. కమిటీ ప్రతినిధులు రూపొందించిన ఎన్టీఆర్ ఛాయాచిత్ర సంచికను ముఖ్యఅతిథులు ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, వైకాపా నాయకుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్.బాబూరావు, మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతీ రామ్మోహనరావు, కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, ఆర్థికవేత్త ఎం.సి.దాస్, రంగస్థల నటుడు కృష్ణ తదితరులు ప్రసంగించారు. జానపద, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సిల్వస్టర్ మిమిక్రీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వైద్యశిబిరంలో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్