YS Sharmila: వివేకాది రాజకీయ హత్యే
బాహ్య ప్రపంచానికి పైకి అంతా సవ్యంగా కనిపించినా తమ కుటుంబంతో అవినాష్రెడ్డి కుటుంబానికి కొంత కోల్డ్వార్ నడిచేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లెలు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.
అవినాష్కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం కావొచ్చు
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో షర్మిల స్పష్టీకరణ
అవినాష్ కుటుంబంతో మా కుటుంబానికి కోల్డ్వార్ ఉంది
ఎంపీగా ఆయన్ను పోటీ చేయనివ్వద్దనేది వివేకా ఆలోచన
ఎన్నికల్లో వివేకాను వెన్నుపోటు పొడిచింది కుటుంబ సన్నిహితులేనని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: బాహ్య ప్రపంచానికి పైకి అంతా సవ్యంగా కనిపించినా తమ కుటుంబంతో అవినాష్రెడ్డి కుటుంబానికి కొంత కోల్డ్వార్ నడిచేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లెలు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. అవినాష్రెడ్డికి మరోసారి కడప ఎంపీ టికెట్ దక్కొద్దన్నది తమ బాబాయి వివేకానందరెడ్డి అభిప్రాయమన్నారు. తన ఉద్దేశంలో వివేకాది రాజకీయ హత్యేనని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలేమీ లేవని.. అయితే వివేకా ఆర్థిక, కుటుంబ కారణాలతో ఘర్షణకు దిగే వ్యక్తి మాత్రం కాదని స్పష్టం చేశారు. తమ కుటుంబం, అవినాష్రెడ్డి కుటుంబం తమ ముత్తాతకు ఇద్దరు భార్యల సంతానమని.. ఈ కారణంగానే తమ కుటుంబాల మధ్య విబేధాలుండేవని చెప్పారు. వివేకా హత్యకు దారితీసిన పలు అంశాల గురించి తన వాంగ్మూలంలో ఆమె కూలంకషంగా వివరించారు.
- అవినాష్రెడ్డిని కడప ఎంపీ సీటుకు పోటీ చేయనివ్వద్దనేది తన ఆలోచన అని వివేకానందరెడ్డి నాతో చెప్పారు. నన్ను పోటీ చేయమంటే ముందు నేను ఒప్పకోలేదు. జగన్ నాకు మద్దతివ్వరని తెలిసే నేను అందుకు అంగీకరించలేదు. కానీ వివేకా నన్ను పలుమార్లు అడగడంతో పోటీకి సరే అన్నాను. అవినాష్తోపాటు అతని కుటుంబానికి వ్యతిరేకంగా నిలవడమే వివేకా హత్యకు కారణం కావచ్చు. తాము వెళ్లే దారిలోకి వివేకానందరెడ్డి వస్తున్నారని వారి మనసులో పెట్టుకోవచ్చు. వివేకాది రాజకీయ లేదా ప్రేరేపిత హత్య కావచ్చు. నేనైతే అలాగే ఆలోచిస్తున్నాను. వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలతో వివేకా హత్యకు గురై ఉండరు.
- అవినాష్ను పోటీ చేయనివ్వనని బహిరంగంగా ప్రకటించే మనిషి కాదు వివేకానందరెడ్డి. జగన్కు నేను వ్యతిరేకంగా వెళ్లనని వివేకా అనుకున్నారు. అవినాష్కు టికెట్ ఇవ్వకుండా జగన్ను ఒప్పించి తీరగలననే నమ్మకం చిన్నాన్నకు అపారంగా ఉండేది. ఆయన అవినాష్రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. అవినాష్రెడ్డి తరఫు నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చనేదే మా ఆలోచన. అది నిజం కావచ్చు. కాకపోవచ్చు.
- వైఎస్ఆర్ ఉన్నప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో లేని అవినాష్రెడ్డి కుటుంబం ఆయన మరణించిన తర్వాత క్రియాశీలంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం భారతినే. అవినాష్రెడ్డి ఆమెకు కజిన్. అవినాష్ తండ్రి, భారతి తల్లి తోబుట్టువులు.
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి, చిన్నాన్న మనోహర్రెడ్డి కారణం కావచ్చు. మనోహర్రెడ్డి తెదేపాకు మద్దతు పలికారు. జగన్ అతణ్ని ఒప్పించి తిరిగి వైకాపాకు మద్దతుగా పని చేయించాడు. కాబట్టి వివేకా ఓటమికి మనోహర్రెడ్డి ఓ కారణం కావచ్చు. 2019 మార్చి 15న జమ్మలమడుగులో నాతో ప్రచారం చేయించాలని వారు ప్రయత్నించారన్నది అవాస్తవం.
- వైఎస్ఆర్ మరణించిన తర్వాత 2009 ఉపఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకూ నేను జగన్ కోసం పనిచేశాను. హత్యకు గురయ్యే రెండు, రెండున్నర నెల క్రితం వివేకా మా ఇంటికి వచ్చి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను అడిగారు. అంతకు ముందెన్నడూ మా మధ్య ఆ అంశం చర్చకు రాలేదు. నేను కాదన్నా వినేందుకు ఆయన సిద్ధంగా లేరు. పోటీ చేయబోనని చెప్పొద్దంటూ గంటన్నరసేపు పదేపదే డిమాండ్ చేసి నన్ను ఒప్పించారు. ఈ విషయం మీడియాలో వచ్చిందా, బయట ప్రచారం జరిగిందా లేదా నాకు గుర్తులేదు. ఇది మా ఇద్దరి మధ్య మాత్రమే జరిగిన సంభాషణ అని కచ్చితంగా చెప్పగలను.
- తాను కాకుండా ఎంపీ సీటుకు నన్నెందుకు పోటీ చేయించాలని వివేకా అనుకున్నారో నాకు తెలియదు. బహుశా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కారణం కావచ్చు. తనకు టికెట్ రాదని ఆయన బలంగా నమ్మి ఉండొచ్చు. నాకు టికెట్ ఇప్పించేలా జగన్ను ఒప్పించే బాధ్యత తనదని మాత్రం చెప్పారు.
- కొందరు దగ్గరి వ్యక్తులే ఆయనకు వెన్నుపోటు పొడిచారు. నాకు తెలిసినంత వరకు అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డితోపాటు మరికొందరు అనుచరులే వివేకా ఓటమికి కారణమని నాకు గుర్తు. వివేకాకు కుడిభుజం లాంటి వ్యక్తులు కూడా ఆయనకు మద్దతుగా నిలవలేదు. వారి పేర్లయితే గుర్తులేదు కానీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులే ఓటమికి కారణం. మా కుటుంబంలోనూ ఇదే చర్చ జరిగింది.
అవినాష్ ఫోన్ చేసి వివేకా చనిపోయారని చెప్పారు: సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి
2019 మార్చి 15న తెల్లవారుజామున 4 గంటలకు లోటస్పాండ్లోని జగన్ నివాసానికి వెళ్లా. వైకాపా మీడియా సెల్ ఇన్ఛార్జి జీవీడీ కృష్ణమోహన్, సాంబశివరెడ్డి అక్కడ ఉన్నారు. 4.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. వైకాపా మేనిఫెస్టోతోపాటు జగన్ చేయాల్సిన ప్రసంగం గురించి సమావేశం జరిగింది. ఎన్నికల సమయం కావడంతో ఎక్కువసార్లు జీవీడీ, నేను కలిసి జగన్ ప్రసంగాలను రూపొందించేవాళ్లం. ఆ రోజు సమావేశంలో ఉండగా అటెండర్ నవీన్ తన ఫోన్ ఇచ్చి అవినాష్రెడ్డి లైన్లో ఉన్నారని చెప్పారు. నేను ఫోన్ మాట్లాడగానే వివేకా చనిపోయారని అవినాష్ చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎలా జరిగిందని అడిగా. వివేకా బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారని.. పడకగదిలోనూ రక్తం ఉందని అవినాష్ చెప్పారు. అదే విషయం జగన్కు చెప్పమని అవినాష్ ఫోన్ పెట్టేశారు. నేను జగన్ దగ్గరికి వెళ్లి చెవిలో విషయం చెప్పాను. కొంతసేపటి తర్వాత జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జీవీడీ, సాంబశివరెడ్డికి విషయం చెప్పడంతో అంతా కలిసి బయటికి వచ్చాం. అదే సమయంలో వివేకా హత్య గురించి నాకు చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయి.
- 6.40, 6.41 గంటలకు అవినాష్ నాకు ఫోన్ చేసి హత్య విషయం జగన్కు చెప్పారా లేదా అని అడిగారు. అనంతరం జగన్ పులివెందులకు విమానంలో వెళ్తారనుకొని ట్రావెల్ ఏజెన్సీలతో మాట్లాడటంలో నిమగ్నమయ్యా. అయితే 9-10 గంటల సమయంలో జగన్ రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్లారు.
- 8.28, 9.14 గంటలకు అవినాష్ ఫోన్ చేసి జగన్ కార్యక్రమాల గురించి అడిగినట్లు గుర్తు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య అయిదుసార్లు అవినాష్తో మాట్లాడింది వాస్తవమే అయినా చాలాకాలం కావడంతో అప్పుడు ఏం మాట్లాడానో గుర్తు లేదు. బహుశా జగన్ పులివెందులకు రాక గురించే అయి ఉంటుంది. అయితే ఆ రోజు జగన్ కార్యక్రమాలు ఎక్కడున్నాయో నాకు గుర్తు లేదు. నాకు తెలిసినంత వరకు జగన్ ఎప్పుడైనా పీఏ నాగేశ్వరరెడ్డి లేదా నా ఫోన్తో మాత్రమే మాట్లాడేవారు.
చిన్నాన్న ఇక లేరు అని జగన్ అన్నారు
- అజేయ కల్లం
2019 మార్చి 15 తెల్లవారుజామున 5 గంటలకు లోటస్పాండ్లో సమావేశం ప్రారంభమైంది. ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, డి.కృష్ణ, సాంబశివరెడ్డి తదితరులు సమావేశంలో ఉన్నారు. సమావేశం జరుగుతుండగానే 5.30 గంటల సమయంలో అటెండర్ వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారని జగన్కు చెప్పారు. బయటికి వెళ్లిన జగన్ పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చిన్నాన్న ఈజ్ నో మోర్ అన్నారు. షాక్కు గురైన మేం కడపకు వెళ్లాలని ఆయనకు సూచించి, బయటికి వచ్చేశాం. జగన్ను బయటికి పిలిచిన అటెండర్ ఎవరో నాకు తెలియదు.
అప్పుడు సమయమెంతో గుర్తు లేదు
-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
2019 ఎన్నికల సమయంలో వైకాపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్గా ఉన్నా. అప్పట్లో తరచూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య సమావేశాలు జరిగేవి. మార్చి 15న సమావేశం జరుగుతుండగా ఎవరో లోపలికి వచ్చి వివేకా చనిపోయారని జగన్కు చెప్పారు. అయితే అలా చెప్పిందెవరో నాకు గుర్తు లేదు. వృద్ధాప్యం కారణంగా ఆ సమయం ఎంతో కూడా చెప్పలేను. వెంటనే వెళ్లిపోవాలని జగన్కు సూచించి మేం వెనుదిరిగాం.
అవినాష్రెడ్డి ఫోన్ చేసి జగన్ ఉన్నారా అని అడిగారు
-గోపరాజు నవీన్కుమార్, జగన్ కుటుంబ అటెండర్
2019 మార్చిలో బంజారాహిల్స్ లోటస్పాండ్లో జగన్ వద్ద పనిచేశా. ఆయన ఇంట్లో గార్డెనింగ్తోపాటు కాఫీలు అందించేవాణ్ని. 2013-14లో హైదరాబాద్ వైకాపా కార్యాలయంలో పనిచేసే వర్ధన్రావు నాకు 90002 66234 సెల్ నంబర్ ఇప్పించారు. 2013-14 నుంచి 2019 మే వరకు దాన్ని నేనే వినియోగించా. తాడేపల్లికి జగన్ బంధువులెవరైనా రావాలనుకుంటే ఈ నంబర్కు ఫోన్ చేసేవారు. ఆ విషయాన్ని నేను ప్రధాన ద్వారం వద్ద ఉండే పోలీస్ అధికారులకు చెబితే లోపలికి రానిచ్చేవారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి సైతం ఈ నంబర్కు ఫోన్ చేసేవారు. అనంతరం అవినాష్రెడ్డిని నేను ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డితో ఇదే నంబరులో మాట్లాడించేవాణ్ని. వివేకా కుమార్తె సునీతారెడ్డి సైతం నాకు ఫోన్ చేసేవారు. భారతికి, ఆమె కుమార్తెలకు వైద్య సలహాల నిమిత్తం ఈ ఫోన్లోనే మాట్లాడేవారు. 2019 మార్చి 15న కాన్ఫరెన్స్ హాల్లో ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డ్డి, జీవీడీతో జగన్ సమావేశమయ్యారు. ఉదయం 6.30 గంటల సమయంలో అవినాష్రెడ్డి నాకు ఫోన్ చేసి, జగన్ ఇంట్లో ఉన్నారా అని అడిగారు. సమావేశంలో ఉన్నారని చెప్పాను. ఎవరెవరున్నారని అడిగితే ఓఎస్డీ, జీవీడీ ఉన్నారని చెప్పాను. కృష్ణమోహన్రెడ్డికి ఫోన్ ఇవ్వమని అవినాష్ చెప్పారు. ఆ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో నా గదిలో ఉన్న నేను వెంటనే మూడో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్కు వెళ్లి ఫోన్ కృష్ణమోహన్రెడ్డికి ఇచ్చి, వంటగదిలోకి వెళ్లిపోయాను. వారేం మాట్లాడుకున్నారో నాకు వినిపించలేదు. ఉదయం 8-8.30 గంటల సమయంలో వివేకా హత్య గురించి జగన్ గన్మెన్లు మాట్లాడుకుంటుండగా విన్నా. వెంటనే నా గదికి వెళ్లి టీవీలో చూశా. అదే రోజు 8.30 సమయంలో సునీతారెడ్డి నాకు ఫోన్ చేశారన్న సంగతి నాకు సరిగ్గా గుర్తు లేదు. సీడీఆర్లో చూసిన తర్వాత 25 సెకన్లపాటు మాట్లాడినట్లు గుర్తొచ్చింది. భారతి పులివెందులకు బయలుదేరారా అని ఆమె అడిగినట్లు గుర్తు. జగన్, భారతి నా ఫోన్ను ఎన్నడూ వినియోగించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?