వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది.
అనంతపురం, రాయచోటి డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, మహబూబ్ బాషా బదిలీ
ఇప్పటికీ వైకాపాతో అంటకాగుతున్న అధికారులపై చర్యలేవి?
ఈనాడు- అమరావతి, కడప, న్యూస్టుడే- అనంతపురం నేరవార్తలు: అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. అనంతపురం ఎస్డీపీవో జి.వీరరాఘవరెడ్డి, రాయచోటి ఎస్డీపీవో సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారి తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించేసి, తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. వీరిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
ప్రతిపక్షాలపై అడ్డగోలు కేసులు, వేధింపులు
అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పోలీసు అధికారిగా కంటే వైకాపా కార్యకర్తగానే ఎక్కువ గుర్తింపు పొందారు. స్థానిక ప్రజాప్రతినిధి మాటే శాసనం అన్నట్లుగా పనిచేశారు. తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ల కింద అడ్డగోలుగా కేసులు పెట్టారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించే తెదేపా నాయకుల్ని గుర్తించి, బైండోవర్ చేయించారు. 2019లో వైకాపా అధికారం చేపట్టిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు.. వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా ఏరికోరి తెచ్చుకున్నారు. 2022 నవంబరు వరకూ అక్కడే కొనసాగిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా నాయకుల్ని పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోనివ్వలేదు. బుడ్డప్పనగర్లో దొంగ ఓట్లేస్తున్న వైకాపా నాయకులకు కొమ్ముకాశారు. అదేంటని ప్రశ్నించిన తెదేపా నాయకులపై విరుచుకుపడ్డారు. తన హయాంలో ప్రతిపక్షాలను తీవ్రంగా వేధించారు. వైకాపా ప్రభుత్వ మద్యం విధానంపై విమర్శలు చేసినందుకు తెదేపా మహిళా నాయకురాళ్ల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి సోదాలు చేశారు. వారి పడకగదుల్లోకి చొరబడి, ఫోన్లు లాక్కున్నారు. ఈ వేధింపులు తాళలేక ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించారు. ఎన్నికల వేళ తమకు అనుకూలమైన అధికారి ఉంటే... అడ్డదారుల్లోనైనా గెలవొచ్చన్న దురుద్దేశంతో రెండు నెలల కింద ఆయన్ను వైకాపా నాయకులు ఏరికోరి మళ్లీ అనంతపురం డీఎస్పీగా తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన ప్రతిపక్షాలను మరింత వేధించారు.
అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాశారు..
రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వైకాపా నేతలు ఏరికోరి అక్కడికి తెచ్చుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పూర్తిగా వైకాపాకు అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తెదేపా నేతలే లక్ష్యంగా కేసులు పెట్టారు. అధికార పార్టీ దాష్టీకాలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకోలేదు. రామాపురం మండలంలో వైకాపా నాయకులు తెదేపా ప్రచార రథంపై దాడి చేసి డ్రైవర్ను గాయపరిస్తే వారిపై చర్యలు తీసుకోకుండా.. పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిపై కేసు పెట్టారు. చిన్నమండెం మండలం వండాడిలో ఓ సర్పంచి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ర్యాలీగా వెళ్లిన తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం వద్ద తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్కుమార్రెడ్డి ప్రచార వాహనాన్ని వైకాపా నేతలు తగలబెట్టినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇలా అడుగడుగునా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాసిన ఆయనపై వేటు పడింది.
మిగతా వైకాపా బంటులపై చర్యలేవి?
ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు అధికార వైకాపాకు బంటుల్లా పనిచేస్తూ ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా వేధిస్తున్నారు. వారి ప్రచారాలకు ఆటంకం కలిగిస్తున్నారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు.
- కడప డీఎస్పీ షరీఫ్ పూర్తిగా వైకాపాకు ప్రయోజనం కలిగేలా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి.
- రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీసీపీ కె.విజయ్పాల్, నెల్లూరు గ్రామీణ డీఎస్పీ పి.వీరాంజనేయులురెడ్డి, పులివెందుల డీఎస్పీ వినోద్కుమార్ అధికార పార్టీ అరాచకాలకు అండగా ఉంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయచోటి సీఐ సుధాకర్రెడ్డి, పామిడి సీఐ రాజశేఖర్రెడ్డి తదితరులు వైకాపా నేతల ఆదేశాలతో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో