యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు.
ముందుకొస్తున్న ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు
ఎన్ఆర్ఐ తెదేపా ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ విభాగ కార్యాలయం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. ఎన్ఆర్ఐ తెదేపా విభాగం ఆధ్వర్యంలో లక్ష విదేశీ ఉద్యోగాల హామీ ఇచ్చారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఉంటూనే పనిచేసే అవకాశాన్ని యువతులకు కల్పించాలనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచన. అందుకు అనుగుణంగానూ పనిచేస్తోంది.
సాధికార కేంద్రం ఏర్పాటు.. శిక్షణ
2014-19 తెదేపా ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత యువతకు ఉద్యోగాల్లేవు. వైకాపా ప్రభుత్వం పరిశ్రమలు తరిమేసింది. దీంతో యువతకు చేదోడుగా నిలిచేందుకు.. తెదేపా కేంద్ర కార్యాలయంలో సాధికార కేంద్రం ప్రారంభించింది. మూడేళ్లుగా ఎన్ఆర్ఐ తెదేపా ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో యువతకు శిక్షణ అందిస్తూ ఉద్యోగాల్లో చేరేందుకు సహకారం అందిస్తోంది. ఇప్పటికే 1,000మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఉపాధ్యాయ, హోటల్ మేనేజ్మెంట్, ఇతర కోర్సులు చేసిన సుమారు 200మందికి పైగా యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించినా.. పారిశ్రామిక అవసరాల విషయంలో వారికి మార్గనిర్దేశం ఉండటం లేదు. ఇంటర్వ్యూలకు వెళ్తున్న విద్యార్థులకు అదే ప్రధానలోపంగా ఉందని గుర్తించారు. దీంతో ప్రపంచస్థాయి ప్రమాణాలను అనుసరిస్తున్నారు. ‘మెర్సర్ స్కోర్ ఆధారంగా యువతను కంపెనీలకు పంపిస్తాం. ఒకవేళ యువతకు అందులో తక్కువ స్కోర్ వస్తే అవసరమైన శిక్షణ ఇప్పిస్తాం. ఇలా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించగలమని నమ్ముతున్నాం’ అని ఎన్ఆర్ఐ తెదేపా విభాగ అధ్యక్షుడు వేమూరి రవికుమార్ వివరించారు.
ఒక్కో పారిశ్రామికవేత్త 20 ఉద్యోగాలిచ్చినా..
‘చంద్రబాబు అమలు చేసిన విధానాల కారణంగా 1990నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సాధించారు. కొన్నేళ్లపాటు అక్కడ పనిచేసి పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఫలితంగానే భాగ్యనగరం మెరిసిపోతోంది’ అని రవికుమార్ ఈ సందర్భంగా వివరించారు. ‘ఎన్ఆర్ఐ తెదేపాలో యూరోప్, అమెరికా, జపాన్, గల్ఫ్ తదితర 15దేశాల నుంచి 3వేల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారంతా 20ఉద్యోగాలు చొప్పున సృష్టిస్తే 60వేలు ఇవ్వొచ్చు. వీరు కాకుండా మా విభాగంలో 25వేల మంది వరకు పలు దేశాల్లో, వివిధ స్థాయిల్లో పనిచేసే వారున్నారు. తలో ఉద్యోగం కల్పించినా లక్ష ఉద్యోగాల కల్పనను తేలిగ్గా చేరుకుంటాం’ అని వివరించారు.
నైపుణ్యం ఉంటే విస్తృత ఉపాధి అవకాశాలు
‘యువతకు నైపుణ్యం ఉంటే పలు దేశాల్లో వివిధ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. ఉదాహరణకు ఎయిర్ కండిషనింగ్, లిఫ్ట్ట్ మెకానిక్ తదితర విభాగంలో దాదాపు 20వేలకు పైగా ఉద్యోగాలు కల్పించవచ్చు. నైపుణ్యం కలిగిన వారు లేరని ఎలివేటర్ కంపెనీ వాళ్లు చెబుతుంటారు. ఈ రంగంలో శిక్షణ ఇప్పిస్తే మంచి ఉపయోగం ఉంటుంది. వీరికి గల్ఫ్ దేశాల్లో మంచి అవకాశాలున్నాయి’ అని అమెరికాలోని హ్యూస్టన్కు చెందిన శేషుబాబు, ఫ్లోరిడాలో ఉండే తుమ్మల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్ఆర్ఐ తెదేపా కార్యాలయం ఏర్పాటుచేసి.. అక్కడే స్థానిక యువతకు శిక్షణ ఇప్పిస్తామని దినేష్ నాగమోతు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు