మార్షల్స్తో సభ నడిపిస్తున్నారు
‘అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. మార్షల్స్తో సభ నడిపించాలని చూస్తున్నారు.
తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. మార్షల్స్తో సభ నడిపించాలని చూస్తున్నారు. స్పీకర్ అనకూడని మాటలు మాట్లాడటం అసెంబ్లీ చరిత్రలో దురదృష్టకరం. మమ్మల్ని సస్పెండ్ చేసి బలవంతంగా బయటకు పంపారు. ఈ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా వెనకడుగు వేయబోం’. అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు తప్పు చేయలేదని వారికీ తెలుసు: ఎమ్మెల్సీ అనురాధ
‘స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదని, ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వైకాపావాళ్లకూ తెలుసు. మా నాయకుణ్ని మానసికంగా హింసించాలనేదే జగన్ ఉద్దేశం. రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని లోకేశ్ కోరితే దాన్నీ వక్రీకరించారు’.
కేసు నిరాధారమని ఐఏఎస్లే చెబుతున్నారు
-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
‘చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనేదే వైకాపా ప్రభుత్వ అజెండా. ఐఏఎస్ల దగ్గరనుంచి కింది స్థాయి వరకూ ఈ కేసు నిరాధారమనే చెబుతున్నారు. వైకాపా వాళ్లు ఇంతకింతకు అనుభవిస్తారు. గతంలోనూ తెదేపా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడూ సమర్థంగా ఎదుర్కొంటాం.’
న్యాయబద్ధ ఆందోళనలను అడ్డుకుంటున్నారు
-వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
‘సభలో న్యాయబద్ధంగా నిరసనలు చేస్తున్నా అడ్డుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవే. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.’
తప్పుడు కేసులను వెనక్కు తీసుకోవాలనేదే మా నినాదం
-ఎమ్మెల్సీ అశోక్బాబు
‘చంద్రబాబుపై తప్పుడు కేసులను తక్షణం వెనక్కు తీసుకోవాలనేదే సభలోనైనా, మండలిలోనైనా మా నినాదం. మండలిలో అంత తీవ్రత లేకపోయినా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దారుణం. స్పీకర్ వ్యాఖ్యలు అనుచితం’.
- ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, అంగర రామ్మోహన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు