మార్షల్స్తో సభ నడిపిస్తున్నారు
‘అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. మార్షల్స్తో సభ నడిపించాలని చూస్తున్నారు.
తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. మార్షల్స్తో సభ నడిపించాలని చూస్తున్నారు. స్పీకర్ అనకూడని మాటలు మాట్లాడటం అసెంబ్లీ చరిత్రలో దురదృష్టకరం. మమ్మల్ని సస్పెండ్ చేసి బలవంతంగా బయటకు పంపారు. ఈ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా వెనకడుగు వేయబోం’. అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు తప్పు చేయలేదని వారికీ తెలుసు: ఎమ్మెల్సీ అనురాధ
‘స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదని, ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వైకాపావాళ్లకూ తెలుసు. మా నాయకుణ్ని మానసికంగా హింసించాలనేదే జగన్ ఉద్దేశం. రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని లోకేశ్ కోరితే దాన్నీ వక్రీకరించారు’.
కేసు నిరాధారమని ఐఏఎస్లే చెబుతున్నారు
-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
‘చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనేదే వైకాపా ప్రభుత్వ అజెండా. ఐఏఎస్ల దగ్గరనుంచి కింది స్థాయి వరకూ ఈ కేసు నిరాధారమనే చెబుతున్నారు. వైకాపా వాళ్లు ఇంతకింతకు అనుభవిస్తారు. గతంలోనూ తెదేపా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడూ సమర్థంగా ఎదుర్కొంటాం.’
న్యాయబద్ధ ఆందోళనలను అడ్డుకుంటున్నారు
-వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
‘సభలో న్యాయబద్ధంగా నిరసనలు చేస్తున్నా అడ్డుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవే. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.’
తప్పుడు కేసులను వెనక్కు తీసుకోవాలనేదే మా నినాదం
-ఎమ్మెల్సీ అశోక్బాబు
‘చంద్రబాబుపై తప్పుడు కేసులను తక్షణం వెనక్కు తీసుకోవాలనేదే సభలోనైనా, మండలిలోనైనా మా నినాదం. మండలిలో అంత తీవ్రత లేకపోయినా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దారుణం. స్పీకర్ వ్యాఖ్యలు అనుచితం’.
- ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, అంగర రామ్మోహన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
సాగుకు డ్రోన్ల సాయం
వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
-
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్