Andhra news: అ బదులు A చేసి.. సమస్యలు దాచేసి!
సాధారణంగా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులపై.. పెద్దలతో సంతకం చేయించి తీసుకురమ్మంటారు. కానీ, వైకాపా సర్కారు తీరు దానికి రివర్స్లో ఉంది.పిల్లల సామర్థ్యాలు తల్లిదండ్రులకు తెలియకుండా.. తమ పనితీరులోని డొల్లతనం బయటపడకుండా.. ఏకంగా ప్రోగ్రెస్ రిపోర్టులనే దాచేస్తూ.. జబ్బలు చరచుకుంటోంది.
ఆంగ్లంలో చిన్న చిన్న పదాలూ చదవలేకపోతున్న సర్కారుబడి విద్యార్థులు
బేస్లైన్ పరీక్షలో తేలిన నిజాలను కప్పేస్తున్న వైనం
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గాలికి వదిలేసి గొప్పగా ప్రచారం
పూటకో విధానంతో పిల్లలు, ఉపాధ్యాయుల్లో గందరగోళం
తల్లిదండ్రులను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం
సాధారణంగా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులపై.. పెద్దలతో సంతకం చేయించి తీసుకురమ్మంటారు. కానీ, వైకాపా సర్కారు తీరు దానికి రివర్స్లో ఉంది.
పిల్లల సామర్థ్యాలు తల్లిదండ్రులకు తెలియకుండా..
తమ పనితీరులోని డొల్లతనం బయటపడకుండా..
ఏకంగా ప్రోగ్రెస్ రిపోర్టులనే దాచేస్తూ.. జబ్బలు చరచుకుంటోంది.
విద్యావ్యవస్థను ఉద్ధరిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చుకుంటోంది.
పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ..
అమ్మానాన్నలను మోసం చేసేందుకు మీకు మనసెలా ఒప్పింది జగన్?
‘క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్, బస్’ తదితర ఆంగ్ల పదాలను ఒకటో తరగతిలోపే పిల్లలు నేర్చుకుంటారు. కానీ, ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారిలో 24.3% మంది ఈ పదాలను చదవలేకపోతున్నారు.
గతేడాది జనవరిలో విడుదల చేసిన అసర్ నివేదిక-2022లో ప్రథమ్ సంస్థ వెల్లడించింది.
‘ఐ లైక్ టు రీడ్, వేర్ ఈజ్ యువర్ కౌ?, దిస్ ఈజ్ ఏ బిగ్ షాప్’ ఇలాంటి చిన్న చిన్న ఆంగ్ల వాక్యాలను 14-16 ఏళ్ల వారిలో 28.9%, 17-18 ఏళ్ల వారిలో 23.6% మంది చదవలేకపోతున్నారు. సులభ భాగహారాన్నీ 41.4శాతం మంది చేయలేకపోయారు.
జనవరి 17న విడుదల చేసిన అసర్ సర్వే నివేదిక-2023లో బహిర్గతమైన అంశమిది.
‘నాన్న రోజూ పొలానికి వెళ్తారు. గతేడాది ధాన్యం బాగా పండింది. అందుకే ఈసారి మళ్లీ వరి వేశాం’ తెలుగులో ఇలాంటి చిన్న పేరాలనూ.. ప్రభుత్వ బడుల్లోని నాలుగు, అయిదో తరగతుల విద్యార్థులు 65.04% మంది తప్పులు లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతుల వారిలో 41.58% మంది చదవలేదు.
ఈ సర్వే చేసింది సాక్షాత్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. 2022లో ప్రథమ్ సంస్థతో కలిసి రూపొందించిన ప్రశ్నపత్రంతో విద్యాశాఖ బేస్లైన్ పరీక్ష నిర్వహించగా వెలుగుచూసిన వాస్తవాలివీ. కానీ, ఈ నిజాలను రాష్ట్ర ప్రభుత్వమే రహస్యంగా దాచేసింది.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను బయటకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం దాచేస్తోంది. ఫలితంగా పిల్లలు నష్టపోవడంతోపాటు వారి తల్లిదండ్రులనూ సర్కారు మోసం చేస్తోంది. వాస్తవాలు ఒకలా ఉంటే జాతీయ సాధన సర్వే(న్యాస్) పరీక్షను ఆంగ్లంలో రాసిన వారిలో ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ‘ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమిచ్చాం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్(ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం.. బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇస్తున్నాం.. టోఫెల్ పెట్టాం.. త్వరలో ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ రాబోతోంది. సీబీఎస్ఈ పాఠాలు చెబుతున్నాం’ అంటూ గొప్పగా ప్రచారం చేసుకోవడం మినహా అసలు క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకునే వారే కరవయ్యారు. ఏదైనా కొత్త విధానం తీసుకురావాలంటే.. అంతకంటే ముందు దానిపై విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో అవేమీ ఉండటం లేదు. ఒకటి తర్వాత మరొకటి తీసుకొస్తూ హడావుడి చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో అమలును గాలికి వదిలేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను సైతం చూచిరాతలుగా మార్చేసింది. విద్యకు రూ.70వేల కోట్లు ఖర్చు చేశామని బడాయికి పోతున్న ప్రభుత్వం.. కమీషన్లు వచ్చే అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. టీచర్ల నియామకం, పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టిపెట్టడం లేదు. అవన్నీ వదిలేసి.. వింత ప్రయోగాలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. తాజాగా కృత్రిమ మేధలాంటి ఫ్యూచర్ స్కిల్స్ నేర్పిస్తామంటూ కొత్త రాగం అందుకుంది.
సిలబస్లతో సర్కస్..
రాష్ట్ర ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల అభ్యసనం, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తొలుత రాష్ట్ర సిలబస్లోని పుస్తకాలను మార్చారు. 2022-23 నుంచి సీబీఎస్ఈ సిలబస్ తెచ్చారు. ఆ సమయంలో ప్రపంచంలో సీబీఎస్ఈకి మించిన సిలబస్ లేదని, ఇది ఎంతో గొప్పదని ప్రభుత్వం ప్రచారం చేసింది. రెండేళ్లలోనే దాన్ని మూలకు పడేసింది. ఇప్పటికే వెయ్యి పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు ఉంది. తాజాగా ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) అంటూ ప్రచారం చేస్తోంది. అయిదేళ్ల కాలంలో సిలబస్పైనే ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఒక్కోసారి ఒక్కోటి తీసుకొస్తూ.. పిల్లల్ని అయోమయానికి గురి చేస్తోంది.
కంటెంట్.. మళ్లీ మళ్లీ..
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్లను అందించింది. మరోపక్క రూ.లక్షలు ఖర్చు చేస్తూ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి కొత్తగా కంటెంట్ను తయారు చేస్తోంది. రెండు రకాల కంటెంట్లను వినియోగిస్తే పిల్లల పరిస్థితి ఏంటి? బోధనకు ఉపాధ్యాయులెలా సిద్ధమవుతారు? పాఠశాల విద్యా శాఖ డబ్బులు ఖర్చు చేసి, మెటీరియల్ తయారు చేస్తున్నప్పుడు బైజూస్ కంటెంట్ ఎందుకు తీసుకుంటున్నట్లో పాలకులకే తెలియాలి.
వాళ్లెందుకు చేదో.?
కొన్నిచోట్ల తెలుగు ఉపాధ్యాయులతో టోఫెల్ పాఠాలు చెప్పిస్తున్నారు. రెగ్యులర్గా ఆంగ్లం, టోఫెల్ పాఠాలు ఒకరే చెబుతుండటం కష్టంగా మారడంతో.. టోఫెల్ను వేరే సబ్జెక్టుల వారితో బోధిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 44,478 పాఠశాలలుంటే దాదాపు 32వేల బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలతో టోఫెల్ బోధన చేస్తున్నారు. మిగతా 12వేలకుపైగా బడుల్లోని పేద పిల్లలకు ఆంగ్ల నైపుణ్యాలు అవసరం లేదని సర్కారు అభిప్రాయమేమో.
ప్రభుత్వానిదే ఆ బాధ్యత..
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలనే వారిని బడికి పంపిస్తుంటారు. కానీ, జగన్ సర్కారు మాత్రం రకరకాల ప్రయోగాలు చేస్తూ.. విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బేస్లైన్ పరీక్ష నిర్వహించి, దాని ఫలితాలను బయటకు రాకుండా దాచేసింది. వెబ్సైట్ నుంచీ తొలగించింది. పాఠశాలల పరిస్థితులతోపాటు అభ్యసన సామర్థ్యాలనూ తల్లిదండ్రులకు వివరించాల్సిన ప్రభుత్వం, వాస్తవాలను దాచేస్తే నష్టపోయేది పేద విద్యార్థులే కదా!
కాకినాడ జిల్లా బెండపూడి పాఠశాల విద్యార్థులు ఆంగ్లం బాగా మాట్లాడుతున్నారని, ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, బేస్లైన్ సర్వేలో ఆంగ్లంలో కొందరి పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు తేలింది. 6, 7, 8 తరగతుల్లోని 290మంది ఆంగ్లంలో చిన్న వాక్యమూ చదవలేకపోయారు.
చేరట్లేదు.. చేరినా మానేస్తున్నారు..
రాష్ట్రంలో అంతా బాగుందని ప్రభుత్వం జబ్బలు చరచుకుంటున్నా.. మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో చేసిన సర్వేలో 14-16 ఏళ్ల వారిలో 1.3 శాతం.. 17-18 ఏళ్ల వారిలో 6.7శాతం మంది పాఠశాల, కళాశాల విద్యకు దూరమవుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి కోసం పిల్లలతో సహా తల్లిదండ్రులు వలస వెళ్తున్నారు. వలస వెళ్లే పిల్లల కోసం సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన జగన్ సర్కారుకు లేకపోయింది. ‘సమగ్ర శిక్షా అభియాన్’ నిధులను ఐఎఫ్పీలు, ట్యాబ్ల కోసం మళ్లిస్తున్న ప్రభుత్వం.. పిల్లల కోసం కేటాయించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్లుగా ప్రవేశాలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఇన్ని రకాల సదుపాయాలు, ఐబీ, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్ అమలు చేస్తుంటే, పిల్లలు ఎందుకు రావడం లేదనే దానిపై పాలకులు దృష్టిసారించడం లేదు. 2021-22లో 44.29లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య.. 2023-24లో 38.25లక్షలకు పడిపోయింది. ఇందులోనూ రిజిస్టర్లో పేరు ఉండీ, పాఠశాలలకు వెళ్లని పిల్లలూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే ఈ సంఖ్య 37లక్షలే.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
2,705 ‘అసెంబ్లీ’ నామినేషన్ల ఆమోదం
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలన తర్వాత 175 శాసనసభ స్థానాలకు మొత్తం 2,705 నామినేషన్లను ఆమోదించగా.. 939 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!