ఉద్యోగులకు డీఏలతో జగన్ ఎన్నికల వల
అధికారపీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్షకట్టినట్టు వ్యవహరించిన సీఎం జగన్.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ఒకరోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలను ప్రకటించారు.
పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం నటన
ఆర్థిక భారాన్ని వచ్చే ప్రభుత్వం పైకి నెట్టేసిన వైనం
ఈనాడు, అమరావతి: అధికారపీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్షకట్టినట్టు వ్యవహరించిన సీఎం జగన్.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ఒకరోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలను ప్రకటించారు. ఉద్యోగసంఘాల నేతలు, ఉద్యోగులు గత కొన్ని నెలలుగా పెండింగ్ డీఏలు ఇవ్వాలని నెత్తీనోరూ కొట్టుకుని మొత్తుకున్నా చెవికి ఎక్కించుకోలేదు. సంఘాల నేతలు క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. చర్చల పేరుతో మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమావేశాల్లో డీఏలు ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి ఓట్లకు గాలం వేసేందుకు రెండు డీఏలను ఒకేసారి ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవి కూడా ఏడాదిగా పెండింగ్లో పెట్టినవే. గత ఏడాది జనవరి, జులై మాసాల్లో విడుదల చేయాల్సినవి ఇప్పుడు ప్రకటించారు. 2023 జనవరి డీఏ 3.64%, జులై డీఏ 3.64% ఇచ్చారు.
పెండింగ్ డీఏల విడుదలలోనూ జిత్తుల మారితనమే:
పెండింగ్ డీఏల విడుదలలోనూ జగన్ తన జిత్తులమారితనాన్నే ప్రదర్శించారు. తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికప్పుడు వైకాపా ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు. దాన్ని కొత్త ప్రభుత్వంపైకి నెట్టేశారు. జనవరి డీఏ నగదు 2024 ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో ఉద్యోగులకు ఇస్తారు. ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే. మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాలి. జనవరి నుంచి మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో 2024 ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలల్లో పీఎఫ్/జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు 90% నగదు, మిగతా 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు జమచేయనున్నారు. పదవీవిరమణ చేసే ఉద్యోగులకు బకాయిల్ని పదవీవిరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
- 2023 జులై డీఏని ఈ ఏడాది జులై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు. 2023 జులై నుంచి 2024 జూన్ 30 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో సెప్టెంబరు, డిసెంబరు, వచ్చే ఏడాది మార్చి నెలల్లో చెల్లించనున్నట్టు తెలిపింది.
- విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఆర్ ఉత్తర్వులను విడుదల చేయలేదు. వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి. పాత బకాయిలనే చెల్లించని ప్రభుత్వం కొత్త వాటిపైనా స్పష్టత ఇవ్వలేదు
పాత బకాయిల మాటేంటి?
ఒక్కో ఉద్యోగికి జగన్ సర్కారు సగటున రూ.2.5 లక్షలకుపైగా ఇప్పటికీ బకాయి ఉంది. 2022 జులైలో డీఏ మంజూరు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకూ ఆ ప్రయోజనాలు అందలేదు. 2018 జులై, 2019 జనవరి డీఏలకు సంబంధించిన దాదాపుగా 66 నెలల బకాయిల్ని చాలామంది ఉద్యోగులకు చెల్లించాలి. సాంకేతికంగా ఇచ్చేసినట్టు చూపించి ఉద్యోగుల నుంచి ఆదాయపన్నును మినహాయించారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?
- 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్టు చూపించారు. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలు ఇవ్వలేదు.
- 2022లో ఇవ్వాల్సిన జనవరి, జులై డీఏల బకాయిలు రూ.4,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జులైలో ఇచ్చిన డీఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలే అందలేదు.
- సీపీఎస్ ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.2,100 కోట్లు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల డీఏ బకాయిలు పెట్టి ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు రావడానికి ఒకరోజు ముందు ఉద్యోగులను మోసం చేసేందుకు రెండు డీఏలు విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!