అరాచకాలకే అగ్రతాంబూలం
అరాచకం, అవినీతి, భూదందాలు సాగిస్తూ.. రౌడీయిజం చెలాయిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి మళ్లీ ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కాయి.
వైకాపాకు చెందిన అత్యధిక అభ్యర్థులపై ఎన్నో ఆరోపణలు
అందులో దాదాపు 50 మందివి తీవ్ర అరాచకాలు
భూదందాలు, గనులు.. ఇసుక దోపిడీ, రౌడీయిజం
ఈనాడు, అమరావతి: అరాచకం, అవినీతి, భూదందాలు సాగిస్తూ.. రౌడీయిజం చెలాయిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి మళ్లీ ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కాయి. రూ.వేల కోట్ల అవినీతి కేసుల్లో ఛార్జిషీట్లు నమోదై.. ప్రస్తుతం బెయిల్ తీసుకుని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ అధినాయకుడిగా ఉన్న వైకాపాలో అనేక మందికి మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించడంలో అవే పెద్ద అర్హతలుగా మారడం విశేషం. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి శనివారం ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తూ.. నాలుగు సవాళ్లను ఉటంకించారు. కండబలం, ధనబలం ఈ ఎన్నికల్లో ప్రధాన సవాళ్లని.. వాటిని ఎదుర్కొంటూ సక్రమంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత ఉందని ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు అధికార వైకాపా అలాంటి అరాచక శక్తులనే మళ్లీ ఈ ఎన్నికల్లో నిలిపింది. రాష్ట్రంలో 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను శనివారం ఆ పార్టీ ప్రకటించింది. 175 మంది అభ్యర్థుల్లో అత్యధికులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే.. అందులో అడ్డగోలు దోపిడీ చేస్తూ.. అరాచకశక్తులుగా విశ్వరూపం దాల్చిన వారు దాదాపు 50 మంది ఉన్నారు. క్రిమినల్ కేసులు, భూదందాలు, ఇసుక, మైనింగ్ దోపిడీ, రౌడీయిజంతో ఇప్పటికే ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ అక్రమయోధులకే మళ్లీ అభ్యర్థిత్వాలు కట్టబెట్టడం శోచనీయం.
వైకాపా అభ్యర్థుల్లో కొందరి ఘనకార్యాలిలా..
- ప్రభుత్వంలో పెద్దాయనగా పేరు గాంచి, నంబరు 2గా చెలాయిస్తున్న ఆ నాయకుడు చేయని అరాచకాలు లేవు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదే స్థానం నుంచి ఆయనకు మళ్లీ టికెట్ దక్కింది. తండ్రి పేరుతో అక్కడ తిరిగే టిప్పర్లు సహజ వనరులను దోచేస్తుంటాయి. తన సామ్రాజ్యంలోకి వేరే పార్టీ అధినేతను సైతం అడుగుపెట్టనీయకుండా పోలీసుల అండతో దందా సాగించారు.
- పల్నాడు ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో నాయకుడి అరాచకాలకు అంతే లేదు. పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోస్తారు. విపక్ష పార్టీ జెండా పట్టుకుంటే వారి ఇళ్లు, దుకాణాలకు నిప్పుపెడతారు. ఆ ప్రాంతాన్ని ఆటవిక రాజ్యంగా మార్చేశారు. ఆయన తమ్ముడి ఆధ్వర్యంలోనే అక్రమ మద్యం వ్యాపారం సాగుతోంది. గ్రానైట్ లారీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పిండుకుంటారు.
- ఉమ్మడి అనంతపురం జిల్లాలº సొంతిల్లు కూడా లేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు రూ.వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ ఘనుడికీ మళ్లీ వైకాపా అభ్యర్థిత్వం దక్కింది. కిందటి ఎన్నికల్లో బీద కబుర్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను గడగడలాడించారు. పేదలకు ఇచ్చిన స్థలాలు లాక్కోవడం, ఎర్రమట్టి దందా సాగించడం.. ఆఖరికి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైన వారి నుంచి రూ.కోట్ల కమీషన్లు కావాలంటూ బెదిరించి వారిని తరిమేసిన చరిత్ర ఈయనది.
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం డాన్గా పేరు మోసిన నాయకుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. ఉమ్మడి జిల్లా మెట్ట ప్రాంతంలోని వందల ఎకరాల్లో గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకున్నారు.
- విశాఖలో రౌడీరాజుగా పేరు పొందారు. గంజాయి బ్యాచ్లను, కిరాయి నేరగాళ్లకు అండదండలు అందిస్తూ.. తనకు అనుకూలంగా మలుచుకోవడం ఈయన నైజం. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ నడుపుతూ జీవితాన్ని ప్రారంభించిన ఈ నాయకుడు స్థిరాస్తి వ్యాపారంలో పాగా వేశాడు. విశాఖలోని ఒక నియోజకవర్గంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఈయనకు కప్పం కట్టాల్సిందే.
- ఆయన సాక్షాత్తూ అధినేతకు దగ్గరి చుట్టం. కడప జిల్లాలో ఈయన అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప నగరంలోనే అనధికారిక వెంచర్లు ఎన్నో వేయించారు. రూ.200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమి లాగేసుకున్నారు. సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్లతోటలు సాగు చేస్తున్నారు. తన కుమారుడి పేరుతో సత్యసాయి జిల్లాలోని భూములకు ఎసరు పెట్టారు.
- అధికార పార్టీలో కంకర కింకరుడిగా పేరు గాంచాడు మరో నాయకుడు. ఈయన నెల్లూరు జిల్లాలో ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు. అక్కడ ఆయన ఆధ్వర్యంలోనే కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి పక్కనే గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 25 ఎకరాల వరకు ఆక్రమించేశారు.
- రాయలసీమలోని ఒక జిల్లాలో ఆమె మహిళా ప్రజాప్రతినిధి. జగనన్న కాలనీలకు భూములిస్తే పెద్ద మొత్తంలో పరిహారం ఇప్పిస్తామని చెప్పి రైతులతో మాట్లాడుకోవడం.. వచ్చిన సొమ్ములో మూడో వంతు కమీషన్గా తీసుకునేలా ఒప్పందాలు చేసుకోవడం ఆమె ప్రత్యేకత. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో వాటికోసం రైతుల నుంచి తీసుకున్న భూములను వారికి తిరిగి అప్పగించాల్సింది పోయి, వాటిని తానే లాక్కున్నారు. వాటిల్లో విలాసవంతమైన రిసార్టు నిర్మించుకుంటున్నారు.
- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీఆర్ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్గా మారింది మరొకరు. చౌక బియ్యాన్ని తెలివిగా మళ్లించి రూ.కోట్లు వెనకేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి వీడలేదు
పోలింగ్ రోజు సమీపిస్తున్నా కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ మండిపడ్డారు. -
పోలీసులకు ఓటుహక్కు విషయంలో వివరాలు సమర్పించండి
మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ పోలీసులు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
జగన్ను విదేశీ పర్యటనకు అనుమతించొద్దు
అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విదేశాలకు వెళ్లడానికి అనుమతించవద్దని హైదరాబాద్ సీబీఐ కోర్టును గురువారం సీబీఐ కోరింది. -
సంక్షిప్త వార్తలు
జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని, ఎండీయూ వ్యవస్థలను ప్రవేశపెట్టి 29,500 మంది డీలర్ల కుటుంబాలను వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
వైకాపా హయాంలో ఉపాధ్యాయుల బతుకులు దుర్భరం!
ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం... పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. -
‘షెడ్డు దక్కలేదు..’ పొట్టేలు చిక్కలేదు!
పొట్టేళ్లు చిక్కలేదు.. గొర్రెల యూనిట్లు దక్కలేదు.. షెడ్ల మంజూరును అటకెక్కించారు.. రాయితీ రుణాలు ఎత్తేశారు.. కనీసం బీమా పరిహారం ఇవ్వడానికి కూడా మనసు రాలేదు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు