పదోన్నతుల ఎర.. టీచర్లకు వల!
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాఠశాల విద్యాశాఖ అధికారులు బరితెగించి ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.
యథేచ్ఛగా పురపాలక పాఠశాలల హేతుబద్ధీకరణ
ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు
ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక విద్యపై శిక్షణ ఇచ్చి టీచర్లుగా నియామకం
పోలింగ్ విధుల్లో పాల్గొనేవారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు
ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాఠశాల విద్యాశాఖ అధికారులు బరితెగించి ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతో వారంతా జగన్ సర్కారుపై వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త ఎత్తుగడ వేసింది. ఉపాధ్యాయులకు పోలింగ్ విధులు ఉండే విషయం తెలిసిందే. వీరు ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా టీచర్లకు పదోన్నతులు, సర్దుబాట్లు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారంటే తెర వెనుక ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు చేసేందుకు ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.
ఈ నెల 27వ తేదీ లోపు వీటిని పంపాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టకూడదని తెలిసినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క మిగులుగా (సర్ప్లస్) ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు శిక్షణ ఇచ్చి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా నియమించేందుకు మరో ఉత్తర్వు ఇచ్చారు. ఉపాధ్యాయులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్పు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు సిఫార్సులతో భారీగా ఉపాధ్యాయులను బదిలీ చేసిన అధికారులు.. ఇప్పుడు పదోన్నతులు, సర్దుబాట్లు, హేతుబద్ధీకరణకు సిద్ధమవుతుండటంపై ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల కోడ్ ఉంటే మాకేంటి? అధికార పార్టీ సేవలో తరించడమే మా పని అని అనుకుంటున్నారో ఏమోగాని, విద్యాశాఖ అధికారుల చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
టీచర్లను ప్రభావితం చేసేందుకేనా?
గత విద్యా సంవత్సరంలో జిల్లా, మండల పరిషత్తులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, హేతుబద్దీకరణ చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా పురపాలక బడుల్లో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాల నుంచి పురపాలక పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నా డీఎస్సీలో పోస్టులను తగ్గించేశారు. ఇప్పుడు అర్హత గల ఎస్జీటీలతో వీటిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేసేందుకు మ్యాపింగ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,114 పురపాలక పాఠశాలలు ఉండగా.. వీటికి మంజూరైన పోస్టులు 12,006 ఉన్నాయి. వీటిల్లో దాదాపు 1,942 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. వీటిని ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు.
ప్రత్యేక విద్యా టీచర్లుగా..
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఎస్జీటీలకు ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక విద్య టీచర్లుగా నియమించేందుకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల వివరాలను పంపాలని డీఈవోలను ఆదేశించింది. ఆసక్తి చూపిన వారికి ప్రత్యేక విద్య కోర్సుపై శిక్షణ ఇచ్చి, ఆ బడుల్లో నియమిస్తారు. వాస్తవంగా సబ్జెక్టు టీచర్లు, ప్రత్యేక విద్య టీచర్ల ఖాళీలను డీఎస్సీతో భర్తీ చేయాల్సి ఉండగా.. పోస్టుల హేతుబద్దీకరణ, పదోన్నతులతో సర్దుబాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ సమయంలో ఇలా చేయడం.. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులను ప్రభావం చేసినట్లవుతుందని సంఘాల నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!