నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం!
జగన్ నిర్ణయాలతో అరకోటి మంది కార్మికుల జీవితాలు అతలాకుతలం
పీఠమెక్కగానే నిర్మాణ రంగంపై దారుణమైన దెబ్బ
ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేసి దోపిడీ పద్ధతికి శ్రీకారం
రాజధాని అమరావతిపై అక్కసుతో మూడు ముక్కలాట
రూ.1500 కోట్ల సంక్షేమ బోర్డు నిధులూ పక్కదారి
ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్, అమరావతి
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత!
అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు!
ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం!
జగన్ రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాటలో స్థిరాస్తి రంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు. అధికార పీఠం ఎక్కింది మొదలు... కార్మికుల జీవనోపాధిని నాశనం చేయడమే లక్ష్యమన్నట్లుగా జగన్ పనిచేశారు. కొత్త ఇసుక విధానం పేరిట రీచ్లను మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా నిర్మాణాలు ఆగిపోయి నెలల తరబడి ఉపాధి కరవైంది. ఒకటి, రెండు రోజులు పనులు దొరక్కపోతేనే పూట గడవని కుటుంబాలు అయిదు నెలలపాటు అల్లాడిపోయాయి. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, రోజువారీ ఖర్చులు భారంగా మారి అప్పులపాలయ్యారు. అంతలోనే వచ్చిన కరోనాతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఐదేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న కష్టాలను ‘మే డే’ సందర్భంగా పరిశీలిస్తే... రాష్ట్ర విభజన తర్వాత తెదేపా పాలించిన తొలి ఐదేళ్లు నిర్మాణ రంగం జోరుగా సాగింది. అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో వేల మంది కార్మికులు పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగింది. వందల నిర్మాణాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉన్న కార్మికులు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచీ తీసుకొచ్చారు. కానీ జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించడంతో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది. భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అప్పులు చేసి, స్థలాలు కొని, నిర్మాణాలు చేపట్టిన వారు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.కొత్త ఇసుక విధానం పేరుతో అయిదు నెలలపాటు ఇసుక రీచ్లు బంద్ చేశారు. జగన్ సర్కార్ 2019 సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానం తెచ్చింది. ఆ సమయంలో నదుల్లో నీరు ఉండడంతో ఇసుక లభ్యం కాలేదు. దీంతో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోయి నిర్మాణ రంగం ఉక్కిరిబిక్కిరైపోయింది.
బలైపోయింది ఎవరు?
రాష్ట్రంలో తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్ బెండింగ్ మేస్త్రీలు, సెంట్రింగ్, సామగ్రి మోసే కార్మికులు, సీలింగ్ పనిచేసేవారు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగులు, ప్లంబర్లు, టైల్స్ వేసేవారు, పెయింటర్లు, కంకర, ఇటుకలు, ఇసుక మోసే కార్మికులు.
50 లక్షల మందిని హింసించారు
రాష్ట్రంలోని 59 రంగాల్లో పనిచేసే కార్మికులు తమ పేర్లను కార్మిక శాఖలో నమోదు చేసుకుంటారు. ఇలా నమోదైన వారు 19.46 లక్షల మంది ఉన్నారు. నమోదు చేసుకోని వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. మొత్తంగా సుమారు 50 లక్షల మంది ఉంటారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. నిర్మాణ రంగంపై పరోక్షంగా ఆధారపడిన లారీ, ఆటో, ట్రాలీల డ్రైవర్లు, వాటి యజమానులు, నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణదారులు, వాటిలో పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, రాడ్ బెండింగ్, సెంట్రింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టైల్స్ మేస్త్రీలు, రంగులు వేసేవారు... ఇలా అనేక వర్గాల కార్మికులు లక్షల మంది జగన్ పాలనలో నష్టపోయారు.
ఆ ప్రకటనతో అంతా అస్తవ్యస్తం..
విజయవాడలో జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అంతా తారుమారైంది. కొత్తగా భవనాలు నిర్మించడానికి యజమానులు ముందుకు రాకపోవడంతో పనులే ఉండడం లేదు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకే వేయి మంది వరకు కార్మికులు నిత్యం వస్తున్నారు. వచ్చిన వారిలో సగం మంది పనిలేక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ‘‘చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మాణాలు జోరుగా సాగినప్పుడు మాకు గిరాకీ ఉండేది. రోజుకు రూ.1200 ఇచ్చి మరీ తీసుకెళ్లేవారు. ప్రస్తుతం రూ.800 కూడా రావట్లేదు’’ అని కార్మికులు వాపోతున్నారు.
హైదరాబాద్ వెళ్లిపోతున్నారు..
బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన మేము ఏడేళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డాం. నేను నా భర్త ఇద్దరం కలిసి ఇక్కడే మేస్త్రీ పని చేసుకునేవాళ్లం. రాజధాని పనులు ఆగిపోవడంతో మా ఇద్దరిలో ఒక్కరికే పని దొరుకుతోంది. వారానికి మూడు రోజులపాటు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. పిల్లల ఫీజులు భారమై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. ఇక్కడ పనిచేసిన వాళ్లు చాలా మంది హైదరాబాద్కు వెళ్లిపోయారు. మేం కూడా వెళ్లిపోదాం అనుకుంటున్నాం.
ఇదీ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఓ కూలి ఆవేదన
బోర్డును... భోంచేశారు!
భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తుంటే జగన్ వాళ్ల నిధులను మింగేసి, ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు ఉంది. దీనికి నిర్మాణదారులు భవన నిర్మాణ విలువలో ఒక శాతం పన్ను చెల్లిస్తారు. బోర్డు వద్ద రూ.2,500 కోట్లకుపైగా నిధులు ఉండగా... ఇందులో నుంచి రాష్ట్ర ఫైనాన్సియల్ కార్పొరేషన్లో డిపాజిట్ పేరుతో రూ.750 కోట్లు లాగేశారు.
- కార్పొరేషన్లో డిపాజిట్ చేయించుకోవడమే కాకుండా వై.ఎస్.ఆర్. బీమా పథకం కోసం ఏటా రూ.300 కోట్ల వరకు మళ్లించేస్తున్నారు. ఇలా ఐదేళ్లలో రూ.1,500 కోట్లు మళ్లించారు.
- కార్మికులకు నవరత్నాల పథకాలు అందిస్తున్నామంటూ సంక్షేమ బోర్డు కార్యక్రమాలను జగన్ సర్కారు పూర్తిగా నిలిపివేసింది. నిర్మాణదారుల నుంచి ఒక శాతం పన్ను వసూలుచేసి, ఇతర అవసరాలకు వాడేసుకుంది.
- భవన నిర్మాణ కార్మికులకు వై.ఎస్.ఆర్. కల్యాణమస్తు పథకాన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తెచ్చింది. 2019 నుంచి 2022 వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేల మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి సహాయం అందలేదు.
- కరోనా మొదటి దశలో కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల నుంచి ప్రతి కార్మికుడికి రూ.5వేల సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర కార్మిక శాఖ సైతం వివరాలు సేకరించింది. సాయం అందుతుందనే ఆశతో వేల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కపైసా కూడా కార్మికులకు అందలేదు.
- కార్మికుల కుటుంబాల్లో యజమాని కాకుండా ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందలేదు. గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు. వై.ఎస్.ఆర్. బీమాలో వీరిని కలిపేయడంతో యజమానికి తప్ప ఇతరులకు పరిహారం అందడం లేదు.
- నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు, పథకాలు ఇవ్వడం లేదు.
- కొన్నిచోట్ల భార్యాభర్తలు, వారి పిల్లలు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరి పేర్లు బోర్డులోనూ నమోదయ్యాయి. ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతేనే బీమా పరిహారం వస్తుంది. మిగతా వారికి వర్తించడం లేదు. జగన్ సర్కార్ ఇవేమీ పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నాడు-నేడు’ అదే గోడు!
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. -
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి కట్టడి ఎలా?
పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్గా నిలిచిన ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు. -
62 ఏళ్లు పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగొచ్చు
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది. -
మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం
ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు డీఓ విధానం తొలగింపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్ అధికారి(డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసమంటూ.. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి
ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. -
గుంతల రోడ్లకు రెండు ప్రాణాలు బలి
రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది. -
తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
5 వేల మంది ఒప్పంద ఉపాధ్యాయినుల మెడపై కత్తి
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. -
ఇదీ సంగతి!
-
ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఎస్పీ ఆరా
పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. -
ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు
ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.