పరారీ వ్యాపారుల షేర్ల విక్రయం..రూ.800 కోట్ల రికవరీ

పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి...

Published : 16 Jul 2021 19:25 IST

దిల్లీ: పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని షేర్లను తాజాగా విక్రయించిన కన్సార్టియం రూ.792.11 కోట్లను రాబట్టుకుంది.

ఈ ముగ్గురు వ్యాపారవేత్తల వల్ల బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గతంలోనే స్పష్టం చేసింది. దీంట్లో 84.45 శాతం అంటే రూ.18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఈడీ గతంలోనే అటాచ్‌ చేసింది. వీటిలో రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను కన్సార్టియానికి బదిలీ చేసింది. వీటిలో ముగ్గురికి చెందిన షేర్లు కూడా ఉన్నాయి. గతంలోనే వాటిలో నుంచి రూ.7,181 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)’ విక్రయించింది. తాజాగా మరో రూ.792.11 కోట్లు విలువ చేసే షేర్లను సైతం అమ్మి మరికొంత సొమ్మును రాబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని