Artificial Intelligence: ఏఐతో భారత్లో మరిన్ని ఉద్యోగాలు.. టాటా సన్స్ ఛైర్మన్
భవిష్యత్తులో మానవవనరుల అందుబాటులో లేని రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. దీనికి సంబంధించి కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని తెలిపారు.
దిల్లీ: కృత్రిమ మేధ (AI)తో భారత్లో మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) అభిప్రాయపడ్డారు. దాని సాయంతో తక్కువ నైపుణ్యం కలిగిన లేదా నైపుణ్యం లేని వ్యక్తులు సైతం ఉన్నత కొలువులు చేయగలుగుతారని అన్నారు. దిల్లీలో జరుగుతున్న బి20 సదస్సు (B20 Summit)లో పాల్గొన్న ఆయన కొత్త డిజిటల్ చట్టం ద్వారా డేటా భద్రత, వ్యక్తిగత గోప్యత విషయంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. చంద్రయాన్-3 విజయంతో మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు.
ఏఐ కారణంగా గోప్యతకు భంగం కలుగుతుందని, ఉద్యోగ భద్రత ఉండదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘భారత్లాంటి దేశంలో ఏఐ ఎన్నో ఉద్యోగాలను సృష్టిస్తుంది. తక్కువ నైపుణ్యం ఉన్నవారితోపాటు నైపుణ్యం లేని వ్యక్తులను ఇన్ఫర్మేషన్ రంగంలో ఏఐ నిష్ణాతులను చేస్తుంది. దాంతో వారు కూడా ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయగలుగుతారు. ఉదాహరణకు ఓ డాక్టర్పై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు నర్సుకు ఏఐ సాయపడుతుంది. అలాగే, వివిధ రంగాల్లోని వేర్వేరు విభాగాల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తుంది’’ అని చంద్రశేఖరన్ తెలిపారు. కొన్నిరంగాల్లో అవసరమైన మేరకు సేవలను అందించేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో లేవని చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఆయా ఖాళీలను భవిష్యత్తులో ఏఐతో భర్తీ చేసేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
డేటా ప్రైవసీలో అద్భుతమైన పురోగతి
‘‘కొత్త డిజిటల్ చట్టం రూపకల్పనతో వ్యక్తిగత గోప్యత విషయంలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఒకవైపు డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. మరోవైపు థర్డ్ పార్టీలకు ఇచ్చే సమాచారం సురక్షితంగా ఉండేందుకు డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ (DEPA)ను తీసుకొచ్చింది. ఈ రెండింటి కలయికతో వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసేప్పుడు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసేప్పుడు వారికి డేటా భద్రత ఉంటుంది. ఇదో కొత్త విధానం’’ అని చంద్రశేఖరన్ అన్నారు.
చంద్రయాన్-3తో మన సత్తా చాటాం
చంద్రయాన్-3 విజయంతో బాబిల్లిని చేరాలనే ఆకాంక్ష నెరవేరిందని చంద్రశేఖరన్ అన్నారు. ‘‘ఈ గెలుపుతో భారతదేశం ఏం సాధించిందో, భవిష్యత్తులో ఇంకా ఏమేమి సాధించగలదో ప్రపంచానికి చాటి చెప్పింది. సాధ్యంకానిదంటూ ఏదీ లేదు అనుకున్న ప్రతిసారీ చంద్రుడిని చూపించేవారు. ఇకపై చంద్రుడికి, మనకు మధ్య ఉన్న దూరం చెరిగిపోనుంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.