Automobile sales: నవంబరులో భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే రికార్డు విక్రయాలు
Automobile sales: భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే రికార్డు స్థాయి విక్రయాలు నవంబరులో జరిగినట్లు ఫాడా వెల్లడించింది.
దిల్లీ: గత నెలలో వాహన రిటైల్ విక్రయాలు (Automobile sales) రికార్డు స్థాయలో నమోదయ్యాయని వాహన డీలర్ల పరిశ్రమ సమాఖ్య ఫాడా (FADA) తెలిపింది. ప్రయాణికుల, ద్విచక్ర, వాణిజ్య వాహనాలు ఇలా అన్ని విభాగాల్లో అమ్మకాలు పుంజుకున్నాయని పేర్కొంది. నవంబరులో మొత్తం వాహన రిటైల్ విక్రయాలు (Automobile sales) 26 శాతం పుంజుకున్నాయని తెలిపింది. క్రితం ఏడాది ఇదే నెలలో 18,93,647 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి అది 23,80,465 యూనిట్లకు చేరినట్లు వెల్లడించింది.
‘‘బీఎస్-IV నుంచి బీఎస్-VIకు మారిన 2020 మార్చి నెలను పక్కనపెడితే.. భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు నవంబరులో జరిగాయి’’ అని ఫాడా అధ్యక్షుడు మనీశ్రాజ్ సింఘానియా తెలిపారు. పండగ సీజన్ ముగిసినప్పటికీ విక్రయాలు భారీ ఎత్తున కొనసాగాయని పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం అందుకు దోహదం చేసినట్లు తెలిపారు.
ప్రయాణికుల వాహన (Passenger Vehicles) విక్రయాలు 21 శాతం పెరిగి 3,00,922 యూనిట్లకు చేరినట్లు సింఘానియా తెలిపారు. సరికొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, కొత్త వాహనాల విడుదల, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం వంటి అంశాలు విక్రయాల వృద్ధికి దోహదం చేసినట్లు పేర్కొన్నారు. కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్యూవీల్లో పెద్ద వేరియంట్ మోడల్ కార్ల విక్రయాలు పెరిగాయని తెలిపారు. మరోవైపు ద్విచక్రవాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 14,94,797 యూనిట్ల నుంచి 24 శాతం పెరిగి 18,47,708 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో వాణిజ్య వాహన విక్రయాలు 33 శాతం పుంజుకొని 79,369 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 81 శాతం, ట్రాక్టర్ల అమ్మకాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది.
వాహన తయారీ సంస్థలు ధరల్ని పెంచుతున్నాయని ఫాడా గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి వేరియంట్ల వాహనాలపై సంస్థలు రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సంవత్సరాంతం నేపథ్యంలో పాత స్టాక్ పూర్తి చేయడం కోసమూ కంపెనీలు ప్రయోజనాలను ప్రకటించొచ్చని అంచనా వేసింది. ఫలితంగా డిసెంబరులోనూ విక్రయాలు భారీ ఎత్తున జరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో ద్విచక్ర, ఎంట్రీలెవెల్ స్థాయి వాహన కొనుగోలు భారంగా మారొచ్చని తెలిపింది. రెపోరేటు పెరగడంతో రుణభారం అధికం కానుండడమే దీనికి కారణమని వివరించింది. చైనాలో ఆంక్షల వల్ల సెమీకండక్టర్ల సరఫరాపై ప్రభావం ఉండొచ్చని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.