Adani group: అదానీ గ్రూప్నకు రుణాలు కొనసాగుతాయ్: బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్
Adani group: అదానీ గ్రూప్నకు రుణాలు కొనసాగుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. అదానీ గ్రూప్ పట్ల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ (Adani group) కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్లో ఆ గ్రూప్ షేర్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లు ఒడుదొడుకులకు లోనవుతునూనే ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్నకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల గురించీ చర్చ జరిగింది. ఏయే బ్యాంక్ ఆ గ్రూప్నకు ఎంత రుణం ఇచ్చిందీ బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్నకు రుణాలు కొనసాగుతాయంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) చీఫ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా అదానీ గ్రూప్నకు రుణాలు ఇచ్చే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. అదానీ గ్రూప్ షేర్లలో ఒడుదొడుకులను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. అదానీ గ్రూప్నకు ఎంత రుణం ఇచ్చిందీ మాత్రం వెల్లడించలేదు. ముంబయిలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ను అదానీ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్ను అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్నకు బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని చద్దా తెలిపారు. కొన్ని పరిమితులకు లోబడే రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. హిండెన్ బర్గ్ షాక్తో ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి అదానీ గ్రూప్ సిద్ధమైన వేళ చద్దా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
50 బిలియన్ దిగువకు అదానీ సంపద
ప్రపంచ కుబేరుల్లో టాప్-3కి వేగంగా ఎదిగిన గౌతమ్ అదానీ సంపద భారీగా క్షీణించింది. ఓ నెల క్రితం 120 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్న అదానీ సంపద విలువ ఇప్పుడు 50 బిలియన్ డాలర్ల దిగువకు (49.1 బిలియన్ డాలర్లు) చేరింది. దీంతో ఈ సూచీలో 25వ స్థానానికి చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 83.6 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.