RuPay Credit card: యూపీఐ ఎఫెక్ట్.. రూపే కార్డులకు భలే డిమాండ్..!
RuPay Credit cards: రూపే క్రెడిట్కార్డులకు ఆదరణ పెరుగుతోంది. యూపీఐకి లింక్ చేసుకునే సదుపాయం ఉండడమే దీనికి కారణం.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ పేమెంట్ నెట్వర్క్ రూపే (Rupay) క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్ 2, 3, 4 నగరాల్లో వీటికి ఆదరణ లభిస్తోంది. యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉండడమే దీనికి కారణం. దీంతో అంతర్జాతీయ పేమెంట్ నెట్వర్క్లైన మాస్టర్, వీసా కార్డుల కంటే రూపే క్రెడిట్ కార్డులనే వినియోగదారులు ఎక్కువ కోరుకుంటున్నట్లు ఫిన్టెక్ ప్లాట్ఫామ్ జడ్ఈటీ పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.
యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డులు (Rupay credit card) అనుసంధానం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గతేడాది జూన్లో అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కొనుగోళ్ల సమయంలో యూపీఐ చెల్లింపులకు క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో ఇటీవల రూపే క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్లోని 706 చిన్న పట్టణాలు, నగరాల నుంచి రూపే క్రెడిట్ కార్డులకు వస్తున్న డిమాండ్ ఆధారంగా జడ్ఈటీ ఓ నివేదిక రూపొందించింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో తమ వేదికగా రూపే క్రెడిట్ కార్డులకు 37 శాతం డిమాండ్ వచ్చిందని తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది 23 శాతంగా ఉందని పేర్కొంది.
బిగ్ బిలియన్ సేల్లో నథింగ్, పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్
ముఖ్యంగా జైపుర్, మేరట్, సూరత్, నాగ్పూర్, రాంచీ, రాయ్పూర్, వారణాసి, ఇందౌర్, కాన్పూర్, ఝాన్సీ పట్టణాల నుంచి రూపే క్రెడిట్ కార్డులకు వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇదే త్రైమాసికంలో మాస్టర్ కార్డు క్రెడిట్ కార్డులకు 32 శాతం, వీసా కార్డులకు 31 శాతం మాత్రమే డిమాండ్ వచ్చిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మనీశ్ ష్రా పేర్కొన్నారు. రూపే నెట్వర్క్ ఎంపిక చేసుకుంటున్న వారు ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ బ్యాంకులు అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. డెబిట్ కార్డుల విషయంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు వరుసలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుల జారీలో ప్రైవేటు రంగ బ్యాంకులు, డెబిట్ కార్డుల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
Elon Musk | యూదు వ్యతిరేక పోస్ట్నకు మద్దతు తెలిపినందుకు మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఎక్స్లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేశాయి. దీనిపై మస్క్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 వద్ద కొనసాగుతోంది. -
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
-
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్