EPFO: అధిక పింఛను వివరాల అప్లోడ్కు మరింత గడువు
EPFO: అధిక పింఛను వివరాల అప్లోడ్కు మరింత గడువు ఇస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు సంస్థలకు అవకాశం కల్పించింది.
EPFO | దిల్లీ: అధిక పింఛనుకు ( higher pension option) సంబంధించి వివరాల అప్లోడ్కు సంస్థలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) మరింత గడువు ఇచ్చింది. ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. వాస్తవానికి సెప్టెంబర్ 30తో ముగియాల్సి ఉండగా.. ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన వినతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.
‘‘అధిక పింఛను ఆప్షన్కు సంబంధించి పెన్షన్లు/ మెంబర్లకు వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు గడువు ఇవ్వాలని ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి వినతి అందింది. సెప్టెంబర్ 29 నాటికి వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/ జాయింట్ ఆప్షన్కు సంబంధించి ఇప్పటికీ 5.52 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కార్మిక శాఖ తెలిపింది.
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
అధిక పింఛనుకు సంబంధించి గతేడాది నవంబర్ 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తొలుత ఉద్యోగులకు అధిక పింఛను దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆన్లైన్లో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఫిబ్రవరి 26 నుంచి మే 3 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. తర్వాత జూన్ 26 వరకు గడువు పొడిగించారు. ఆపై మరో 15 రోజులు చివరి అవకాశంగా గడువు ఇచ్చారు. జులై 11 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి వరకు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/ జాయింట్ ఆప్షన్ కోసం మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు అందినట్లు కార్మిక శాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!